Sunday 28 July 2019

రామాయణము యుద్ధకాండ -ముప్పదియైదవసర్గ

                                   రామాయణము 

                                         యుద్ధకాండ -ముప్పదియైదవసర్గ 

ఆజానుబాహుడైన శ్రీరాముడు శంకారావములతో ,భేరినాదములతో లంక వైపుగా వెళ్లసాగెను . రావణుడు ఆ ధ్వనులు విని క్షణకాలం ఇక ఇప్పుడు చేయవలసినది ఏమిటని ఆలోచించెను . పిమ్మట అతడు మంత్రుల వైపు చూసేను . రావణుడి తాత (రావణుడి తల్లి ఐన కైకసి కి తండ్రి )ఐన మాల్యవంతుడు అను రాక్షసుడు రావణుడు చేసినది తప్పని సీతాదేవిని శ్రీరాముడికి అప్పగించటమే మంచిదని . శ్రీరాముని తక్కువ అంచనా వేయవద్దని పరిపరి విధములుగా చెప్పెను . ఆ విధముగా చెప్పిన పిమ్మట రావణుడి మనోభావములను అంచనా వేయుచు రావణునే చూసేను . 

రామాయణము యుద్ధకాండ ముప్పదియైదవసర్గ . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Saturday 27 July 2019

రామాయణము యుద్ధకాండ -ముప్పదినాల్గవసర్గ

                                    రామాయణము 

                                       యుద్ధకాండ -ముప్పదినాల్గవసర్గ 

సరమ సీతాదేవిని ఓదార్చుచు ,"సీతా !నేను మారువేషములో శ్రీరాముడి వద్దకు వెళ్లి నీ కుశల వార్తను తెలిపి ,ఆ స్వామికి నీ సందేశమును వినిపించెదను . మరల భద్రముగా తిరిగి రాగలను . ఆ సామర్ధ్యము నాకు కలదు . "అని పలికెను . ఆ మాటలు విన్న సీతాదేవి ,"సరమా !నీవు నాకు ఉపకారము చేయదలిచినచో ,రావణుని వద్దకు వెళ్లి ,అతడు ఏమి ఉపాయములు పన్నుతున్నాడో తెలుసుకొనుము . ఆ మాయావి వలన ఎప్పుడేమి ముప్పు వచ్చునో అని భయసందేహములు కలుగుచున్నవి . నేను గడగడ వణికిపోవుచున్నాను . రావణుడు తన మంత్రులతో చేయు ఉపాయములు నాకు తెలిపి నాకు మహోపకారం చేయుము . "అని పలికెను . 
సరమ సీతాదేవితో "సీతా !నీవు కోరుకున్నది ఇదే అయినచో తప్పకుండ చేసెదను . "అని పలికి వెంటనే బయలుదేరి ,రావణుడు వున్నా చోటికి వెళ్లి వారికి కనపడకుండా దాక్కుని రావణుడు మంత్రులతో పలికే మాటలు అన్నీ విని సీత వద్దకు తిరిగి వచ్చి అక్కడి విషయములు ఇలా చెప్పెను . "సీతా !రావణుడికి అతి సన్నిహితుడు ,వృద్ధుడు ఐన 'అవిద్ధుడు 'అను మంత్రి రావణునికి సీతను అప్పగించుట మంచిదని ఎన్ని విధములుగా అప్పగించుటకు ప్రయత్నించినప్పటికీ అతడు నిన్ను అప్పగించుటకు అంగీకరించలేదు . రణరంగములో రాముడి చేతిలో ఈ రావణుడు ,అతడి పరివారము అంతా హతమయిన తర్వాతకానీ నీకు విముక్తి లేదనుకుంట రావణునికి ఆయువు మూడినందువల్ల అతడి బుద్ధి వక్రించియుండుటచే ఆ దుర్మార్గుడు ఈ దుష్ట నిర్ణయమునకు వచ్చినాడు . అతడు రాముడికి బయపడి నిన్ను వదిలిపెట్టుట కల్ల . "అని పలికెను . 

సీతాదేవితో సరమ ఈ విధముగా మాట్లాడుతుండగానే ,భూతలమును కంపింపచేయుచు ,వానర సైన్యము మ్రోగించిన భేరినాధములు ,శంఖారావంలు ,కోలాహల ధ్వనులు వినిపించెను . ఆ వానరుల కోలాహలం వినపడినంతనే రావణుని భృత్యులు అందరూ తేజస్సును కోల్పోయిరి . తమ ప్రభువు చేసిన తప్పు వలన 'ఇక తమ బ్రతుకులు తెల్లవారినట్టే 'అని భావించిరి . 

రామాయణము యుద్ధకాండ ముప్పదినాల్గవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










Thursday 25 July 2019

రామాయణము యుద్ధకాండ -ముప్పదిమూడవసర్గ

                                రామాయణము 

                          యుద్ధకాండ -ముప్పదిమూడవసర్గ 

అప్పుడు శ్రీరాముడు మరణించాడు అన్న భ్రమలో వున్న సీతాదేవి వద్దకు సరమ (విభీషణుడి భార్య )అను రాక్షసి వచ్చినది . ఆమె సీతాదేవి హితము కోరునట్టిది . ఆమె సితాదేవి వద్దకు వచ్చి ఆమెను పరిపరి విధములుగా ఓదార్చెను . ఆమె సీతామాతతో "ఓ మైథిలీ !నేను నిర్జన ప్రదేశమున దాక్కుని ఇంతకూ ముందు రావణుడు ఇక్కడికి వచ్చి పలికిన పలుకులన్నీ విన్నాను . ఆ రాక్షసరాజు హడావిడిగా ఇక్కడ నుండి వెళ్ళినాడు కదా !నేను కూడా అతడికి కనపడకుండా అతడి వెనకే వెళ్లి వారి మాటలన్నీ విన్నాను . 
శ్రీరాముడు క్షేమముగానే వున్నాడు . రావణుడు క్రూరుడు ,మాయలమారి ,అతని ఆలోచనలు ,పనులు అన్నీ దుష్టములే . అతడు తన మాటలను నీపై ప్రయిగించాడు . అమ్మా !నీవు బాధపడవలసిన అవసరము లేదు . నీ బాధలన్నీ తీరిపోబోతున్నాయి . అతిత్వరలోనే నీవు నీ భర్తను చేరబోతున్నావు . శ్రీరాముడు వానర సైన్యముతో సహా సముద్రమును దాటినాడు . లంకా సమీపమునే వున్నాడు . ఆయనను ,లక్ష్మణుని నేను స్వయముగా చూసితిని. శ్రీరాముడు సైన్యముతో సహా వచ్చిన సంగతి తెలిసిన రావణుడు తన మంత్రులతో కార్యాలోచన చేయుచున్నాడు . "అని పలికెను . 
సరమసీతాదేవితో ఈ విధముగా పలుకుతూ ఉండగా యుద్దనగారాలు ,ఢంకా నాదములు వినిపించినవి . అప్పుడు సరమ మళ్లీ సీతాదేవితో "సీతా !ఆ ధ్వనులు విన్నావా ?సైనికుల సందడి వినిపించుచున్నదా ?సైనికులు యుద్ధమునకు సిద్ధమవుతున్నారు . దేవీ !త్వరలోనే నీకీ చెర తొలగిపోయి నీవు కోరుకున్నట్టుగానే నీ భర్తను చేరి హాయిగా ఉంటావు . నా మాటలు నమ్ము ఆ సూర్యభగవానుడిని ప్రార్ధించు "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ ముప్పదిమూడవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణము యుద్ధకాండ -ముప్పదిరెండవసర్గ

                                      రామాయణము 

                                   యుద్ధకాండ -ముప్పదిరెండవసర్గ 

రావణుడు తెప్పించిన శిరస్సు దరనుర్భాణములు పరిశీలించి చూసిన సీతాదేవి అవి శ్రీరాముడివే అని అని భ్రమించి ,నిలువెల్లా వణికిపోతూ ,మొదలునరికిన అరటిచెట్టులా కూలిపోయెను . స్పృహ కోల్పోయెను . కొద్దిసేపటికి స్పృహ వచ్చిన తర్వాత బిగ్గరగా రోదించెను . కైకేయిని తిట్టుకొనెను . శ్రీరాముని తలుచుకుని కన్నీరుమున్నీరయ్యేను . తలకొట్టుకొనెను ఆ విధముగా మిక్కిలి దీనముగా సీతాదేవి రోదిస్తూ ఉండగా రావణుని అంగరక్షకుడైన ఒక రాక్షసుడు  వచ్చి ,రావణుని సమీపమున నిలబడి 'మహారాజుకు జయము "అని పలికి ,రావణుడు అతడిని చూసిన పిమ్మట రావణునితో 
ప్రభూ !ప్రహస్తుడు మంత్రులతో కలసి మీ దర్శనమునకై వేచి ఉన్నాడు . ఆ వార్తను తెలుపుటకై ఆయన నన్ను ఇచటికి పంపినాడు . మహారాజా !అత్యవసరమైన రాజ్యకార్యము వచ్చినట్లుంది . "అని పలికెను . అతడి మాటలు విన్న రావణుడు ప్రహస్తుడిని ,మంత్రులను కలవటానికి అశోకవనము నుండి బయటకు వెళ్లెను . రావణుడు అశోకవనము నుండి బయటకు వెళ్లిన పిమ్మట కుత్రిమమైన ఆ శిరస్సు ధనుర్భాణములు మాయమైపోయెను . 
రాక్షస రాజైన రావణుడు తన మంత్రులతో చర్చించి ,తన సమీపమునే నిలబడి వున్న తన సేనాధిపతులతో ,"మీరు వెంటనే దండోరా వేయించి ,మన సైన్యములను అన్నిటిని ,ఒక చోటకు చేర్చుము . సైన్యమునకు ఎందుకు తీసుకువస్తున్నారో చెప్పవద్దు . "అని పలికెను . రావణుని సైన్యాధిపతులందరూ రావణుని ఆజ్ఞ ప్రకారము సైన్యమును ఒక చోటకి చేర్చిరి . 

రామాయణము యుద్ధకాండ ముప్పదిరెండవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Tuesday 23 July 2019

రామాయణము యుద్ధకాండ -ముప్పదియొకటవసర్గ

                                    రామాయణము 

                           యుద్ధకాండ -ముప్పదియొకటవసర్గ 

శ్రీరాముడు వానరసేనతో కూడి సువేలపర్వతము సమీపములో వున్న సంగతి గూఢచారుల ద్వారా విన్న రావణుడు తక్షణ కర్తవ్యమును అలోచించి విధ్వజిహ్నుడు అను మాయావి రాక్షసుడిని పిలిపించి అచ్చముగా శ్రీరామునిలానే వుండే మాయా శిరస్సుని ,ధనుర్భాణములను సృష్టించమని ఆజ్ఞాపించెను . రావణుని ఆదేశము మేరకు విద్ధ్వజిహ్నుడు శ్రీరాముని వంటి శిరస్సుని ,ధనుర్భాణములను సృష్టించి రావణునికి ఇచ్చెను . రావనుడు ఆ మాయా శిరస్సుని విద్ధ్వజహ్నుడి వద్దే ఉంచి సీతాదేవిని చూచుటకు అశోకవనమునకు వెళ్లెను . 
అశోకవనంలో సీతాదేవి అధోముఖముగా చూస్తూ దుఃఖిస్తూ ఉండెను . అప్పుడు రావణుడు సీతాదేవిని సమీపించి "కళ్యాణీ !నేను ఎంతగా బ్రతిమిలాడినను రాముడిని నమ్ముకుని నన్ను తృణీకరించినావు . కానీ ఆనాడు ఖర దూషణాదులను చంపిన ఆ రాముడే నేడు నా వారి చేతిలో హతుడైనాడు . ఇప్పుడు నీకు ఆధారము ఎవ్వరు లేరు . ఈ దెబ్బతో నీ గర్వము అణిగిపోయినది . ఇక దుఃఖించి ప్రయోజనమేమి ?సీతా !ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని వెంటనే నా భార్యవు కమ్ము . ఆ రాముడి గురించిన చింతను విడిచిపెట్టుము . ఆ మరణించిన వాడితో నీకేమి పని ?కావున నన్ను పతిగా స్వీకరించి ,పట్టపురానివి కా . నీ భర్త ఎలా మరణించాడోచెబుతాను విను . 
నీ భర్త రాముడు లక్ష్మణునితో ,సుగ్రీవునితో వానరసైన్యముతో కూడి సముద్రమును దాటి ఈవలి తీరమునకు చేరినాడు . వారందరూ ప్రయాణ పరిశ్రమచే మత్తుగా నిద్రించుచుండగా నడి రేయి సమయములో నా మనుషులు అచటికి చేరినారు . 
మా రాక్షస సైనికులు అడ్డుకత్తులు ,ఇనుపకట్లగుదియలు ,చక్రములను ,దండములను ,ఖడ్గములను బాణములను ,సమ్మెటలను ,గథలను ,ఈటెలను ,రోకళ్ళను ఇంకా వివిధాయుధములను తీసుకుని వానరులను బలముగా కొట్టిరి .  పిమ్మట ప్రహస్తుడు రాముడి యొక్క శిరస్సును ,తన మహా ఖడ్గముతో క్షణములో ఖండించివేసెను . అతడు మెరుపుదాడితో విభీషణుడిని బంధించెను . రాక్షసుల దాటికి తట్టుకొనలేక లక్ష్మణుడు వానరసైన్యముతో కూడి నలుదెసలకు పారిపోయెను . సీతా సుగ్రీవుడి మెడ తెగిపోయెను . రాక్షసుల దెబ్బలకి హనుమంతుడి దవడలు పగిలిపోయెను . జాంబవంతుడి మోకాళ్ళను రాక్షసులు ఖండించిరి . ఇలా మా రాక్షసుల దాటికి చాలామంది వానరులు మరణించిరి . మిగిలిన వారు ప్రాణభయముతో పారిపోయిరి . ఈ విధముగా నీ భర్త వానరసైన్యముతో సహా మరణించెను . నీ భర్త ఖండించిన శిరస్సుని నీకు ఇప్పుడే చూపిస్తాను "అని పలికి 
పక్కనే ఉన్న రాక్షస దాసీలతో "విద్ధ్వజిహ్నుని పిలిపించండి అతడే ఆ రాముడి శిరస్సుని రణభూము నుండి తెచ్చినది "అని ఆదేశించెను . వెంటనే విధ్వజిహ్నుడు రాముడి మాయా శిరస్సుని ధనుర్భాణములని తీసుకువచ్చి రావణుడి ఆదేశము మేరకు సీతాదేవి ముందు వాటిని ఉంచి అతడు పక్కకు తప్పుకొనెను . 

రామాయణము యుద్ధకాండ ముప్పదియొకటవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణము యుద్ధకాండ -ముప్పదియవసర్గ

                                    రామాయణము 

                                     యుద్ధకాండ -ముప్పదియవసర్గ 

శార్ధూలాది గూఢచారులను చూసి ,రావణుడు అక్కడి వివరములు  అడగ్గా అక్కడి వివరములన్నీ పూసగుచ్చినట్టు చెప్పెను . పిమ్మట అతడు రావణునితో "రాజా !రాముడు నన్ను వదిలిపెట్టినపిమ్మట తన సేనతో ఇటువైపే వచ్చుచున్నాడు . ఆయన గరుడావ్యూహము పన్ని సేనను నడుపుతున్నాడు . రాముడు లంకా ప్రాకారమును చేరుటకు ముందే ఆయనతో యుద్ధమో లేక సీత ను అప్పగించటమో నిశ్చయించుకో "అని పలికెను .   వారి మాటలు విన్న రావణుడు 
శార్ధూలునితో "శార్ధూలా !దేవతలు ,గంధర్వులు ,దానవులు నన్ను ఎదిరించి యుద్ధము చేసినను ,లోకాలన్నీ నన్ను భయపెట్టినను నేను సీతను మాత్రము రామునికి అప్పగించను . మీరు సైన్యమును చూసినారు కదా !వారి బలాబలములు తెలుపుము . "అని పలికెను . 
రావణుడి మాటలు విన్న శార్దూలుడు "శత్రువులకు అజేయుడు ,వానరులకు రాజైన సుగ్రీవుడు ఋక్షరజసుని కుమారుడు . సుప్రసిద్దుడైన జాంబవంతుడు గద్గదుని సుతుడు . గద్గదునిమరియొక కుమారుడు ధూమ్రుడు . ఇంద్రునికి గురువైన బృహస్పతి యొక్క కుమారుడు కేసరి . ఈ కేసరి కుమారుడైన ఆంజనేయుడు ఒంటరిగానే అక్షకుమారుడు మొదలగు రాక్షస వీరులను  హతమార్చెను . ధర్మాత్ముడు వీరుడు ఐన సుషేణుడు వరునిదేవుని పుత్రుడు . రాజా !సౌమ్యుడైన దధిముఖుడు చంద్రుని కుమారుడు . బ్రహ్మదేవుడు మృత్యువు ,సుముఖుడు ,దుర్ముఖుడు ,వేగఁదర్శి అనువారిని వానర రూపములో సృష్టించెను . వానరసేనకు అధిపతి ఐన నీలుడు అగ్నిదేవుని యొక్క ఔరసపుత్రుడు . సుప్రసిద్దుడైన హనుమంతుడు వాయుదేవుని వారము వలన పుట్టినవాడు . అంగదుడు ఇంద్రునికి మనుమడు ,వాలికి పుత్రుడు . 
పరాక్రమవంతుడైన మైందుడు ,ద్వివిదుడు అశ్వినీదేవతల కుమారులు . గజుడు ,గవాక్షుడు ,గవయుడు ,శరభుడు ,గంధమాదనుడు అను ఐదుగురు యమధర్మరాజు కుమారులు . ఈ విధముగా దేవతలా అంశలతో పుట్టిన వానరులు కోట్లమంది . వారు వీరులు శూరులు . వీరు కాక ఇంకా అసంఖ్యాక వానరులు కలరు . వారి సంఖ్యచెప్పనలవి కానిది . దశరథ మహారాజు పుత్రుడు శ్రీరాముడు ,అతడు యువకుడు సింహపరాక్రముడు . ఇతడొక్కడే ఖర దూషణ త్రిశరులను చంపినాడు . విరాధుడు హతమైనది ఇతడి చేతిలోనే . మృత్యుతుల్యుడైన కబంధుడు చంపబడినది ఇతడి చేతిలోనే . వేయిమాటలేల ?ఈ భూమండలమున శ్రీరామునకు సాటి కల పరాక్రమశాలి ఎవడును లేడు . శ్రీరాముడి యొక్క ఉత్తమ గుణములు వర్ణించుట ఈ భూమి అందు ఎవ్వరికి సాధ్యము కాదు . 
ఆ శ్రీరాముడి తమ్ముడు లక్ష్మణుడు . అతడు ధర్మాత్ముడు . మదపుటేనుగు వలే దృఢకాయుడు బలశాలి . అతడి బాణముల దాటికి ఇంద్రుడు సైతము మృత్యుముఖం చేరవలసినదే . శ్వేతుడు ,జ్యోతిర్ముఖుడు అనువారు సూర్యుని పుత్రులు . హేమకూటుడు అను వానరుడు వరుణదేవుని సుతుడు . వానరోత్తముడు నలుడు విశ్వకర్మ కుమారుడు . బలశాలి ఐన దుర్ధరుడు వసుసుతుడు . నీకు తమ్ముడు రాక్షసులలో శ్రేష్ఠుడు ఐన విభీషణుడు లంకకు రాజుగా అభిషిక్తుడు అయ్యాడు . సువేల పర్వతము చేరివున్న వానరసైన్యములను గూర్చి పూర్తిగా వివరించితిని . ఇక మిగిలిన కార్యము మేరె నిర్ణయింపవలెను . "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ ముప్పదియవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Sunday 21 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువదితొమ్మిదవసర్గ

                                 రామాయణము 

                                     యుద్ధకాండ -ఇరువదితొమ్మిదవసర్గ 

శుకసారణుల మాటలు విని వారు చూపించిన వానరవీరులను అపారంగా వున్న వానర సైన్యమును చూసిన పిమ్మట రావణుడు మనసులో కొంత భయపడెను . కానీ ఆ భయము ఏమాత్రము బయటకు కనపడనీయక తనతో శత్రుపక్షమును పొగుడుతూ మాట్లాడినందుకు గాను వారిని ఇరువురిని రావణుడు బాగా తిట్టెను . పిమ్మట వారిని అక్కడనుండి వెళ్లిపొమ్మని కోపించెను . అప్పుడు వారు తలలు వంచుకుని వెళ్లిపోయిరి . పిమ్మట రావణుడు పక్కనే వున్న మహోదరుడితో రాజనీతి అందు బాగుగా నిగ్గుతేలిన చారులను (గూఢచారులను )పిలిపించామని చెప్పెను . 
రావణుడి ఆజ్ఞతో శార్ధూలుడు మొదలగు చారులు రావణుని ముందు నిలిచిరి . రావణుడు వారితో "మీరు వెంటనే శ్రీరాముడు సైన్యముతో విడిది చేసిన ప్రదేశమునకు వెళ్లుము . రాముడు యుద్ధమునకు చేయు ప్రయత్నములను ,అతడు నిద్రించు ప్రదేశములను సకల ఆనుపానులనుఁ తెలుసుకుని రండి . శత్రువుల ఆనుపానులు తెలిసినచో గెలుపు సులభమౌతుంది . "అని పలికెను . 
రావణుడి ఆజ్ఞ తీసుకున్న చారులు వెంటనే రాముడు సైన్యముతో విడిది చేసి ఉన్న సువేలపర్వతము దగ్గరప్రాంతమునకు వెళ్లిరి . అపారంగా వున్న ఆ సేనను చూడగానే వారికి వణుకు మొదలయ్యెను . ధైర్యము కోల్పోయిరి . వారిని చూసి గుర్తించిన విభీషణుడు వారిలో శార్దూలుడిని శ్రీరాముని వద్దకు తీసుకువెళ్లిరి . శ్రీరాముడి వద్దకు తీలుకువెళ్తూనే శార్దూలుడిని అతడి వెనుక వచ్చిన చారులిని వానరులు చావచితకబాదిరి . వారు మూర్చిపోయిరి . చాలాసేపటికి తేరుకొనిరి . శ్రీరాముడు వారిని క్షమించి వదిలివేయటంతో వగర్చుచు లంకకు చేరిరి . 

రామాయణము యుద్ధకాండ ఇరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము యుద్ధకాండ -ఇరువదియెనిమిదవసర్గ

                                   రామాయణము 

                                      యుద్ధకాండ -ఇరువదియెనిమిదవసర్గ 

సారణుడు పలికిన విషయములు విన్న పిమ్మట శుకుడు ఆ వివరణ సరిగా లేదని భావించెను . వెంటనే అతడు తన చేతి వేళ్ళతో నిర్దేశించి చూపుతూ ,శ్రీరాముని పక్షంలోని వీరులను గూర్చి రావణునితో ఇలా చెప్పసాగెను . "ప్రభూ !ఇదిగో మనకు ఎదురుగా అసంఖ్యాకంగా కల వానరవీరులు సుగ్రీవుని మిత్రులు . ఈ కామరూపులు దేవతల ,గంధర్వుల అంశలతో పుట్టినవారు . అదిగో అక్కడ కనపడుచున్న యువకులు ఇద్దరూ 'మైందుడు ''ద్వివిదుడు 'బ్రహ్మ యొక్క అనుగ్రహముతో వారు అమృతమును త్రాగినారు . వారు లంకను దెబ్బతీయుటకు ఉవ్విళ్లూరుచున్నారు . 
ఇక్కడ మదపుటేనుగు లాగా వున్న వీరుడు హనుమంతుడు . ఈ వీరుడికి కోపము వచ్చినచో తన ప్రభావముచే మహా సముద్రమును సైతము అతలాకుతలం చేయగలడు . ఇంతకూ ముందు సముద్రమును దాటి ,లంకకు వచ్చి సీతాదేవితో మాట్లాడినది ఇతడే . బాలుడిగా ఉన్నప్పుడే ఉదయించుచున్న సూర్యుని చూసి పండని భ్రమించి సూర్యువద్దకు ఎగిరినాడు . 
అతని పక్కనే శ్యామా వర్ణముతో వున్నవాడు శ్రీరాముడు ఇక్ష్వాకు వంశజులలో అతిరధుడు . ఈయన పరాక్రమములో  లోకములలో ప్రసిద్దికి ఎక్కినవాడు . ధర్మమును ఎప్పుడూ అతిక్రమింపడు . బ్రహ్మాస్త్రమును ప్రయోగించుటలో ,ఉపసంహరించుటలో సమర్థుడు . తన బాణప్రయోగములతో ఊర్ధ్వలోకములను ,అధోలోకములను చిన్నాభిన్నమొనర్పగలడు . ఇతడి కోపమునకు గురియైనవాడు మృత్ర్యులోకమునకు చేరినట్టే . నీవు దండకారణ్యము నుండి అపహరించి తీసుకువచ్చిన సీతాదేవి ఇతడి భార్యే . 
శ్రీరాముడి కుడిపక్కన మేలిమి బంగారు కాంతులతో విలసిల్లువాడు . ఇతడి తమ్ముడైన లక్ష్మణుడు నీ మీద కోపముతో కన్నులెర్రచేసినాడు . యుద్దములో ఆరితేరినవాడు . సమస్త శాస్త్రములను పుక్కిటపట్టినాడు . ఈ వీరుడొక్కడే యుద్ధమున రాక్షసులను అందరిని పరిమార్చుటకు ఉత్సాహపడుచున్నాడు . 
శ్రీరామ చంద్రుని ఆశ్రయించుకుని ఆ స్వామికి ఎడమవైపున వున్నవాడు నీ సోదరుడైన విభీషణుడు . శ్రీరాముడు ఇతడిని లంకకు రాజుగా పట్టాభిషిక్తుడిని చేసెను . శ్రీరామునికి విభీషనుకి మధ్య కొండవలెఉన్నవాడు  సుగ్రీవుడు . యితడు సమస్త వానరులకు ప్రభువు . అపజయము ఎరుగనివాడు . బలము కీర్తిప్రతిష్టలు ,వివేకము ,శాస్త్రజ్ఞానం వంశోన్నతి మొదలగు విషయములలో వానరులందరిలో శ్రేష్ఠుడు . 
అసంఖ్యాకంగా  మరో మహా సముద్రము వలేవున్న వానరవీరులతో ,విభీషణుడితో ,సుగ్రీవుడు నిన్ను ఎదిరించుటకు అక్కడ వేచివున్నాడు . తగిన విధముగా అలోచించి ,శత్రువుల ముందు పరాభవం కలుగకుండా ,నీకు జయము ప్రాప్తించునట్టు సముచితములైన ఉపాయములను ఆలోచించుము . 

రామాయణము యుద్ధకాండ ఇరువదియెనిమిదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Saturday 20 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువది ఏడవసర్గ

                            రామాయణము 

                                 యుద్ధకాండ -ఇరువది ఏడవసర్గ 

సారణుడు రావణునితో ఇంకా ఇలా చెప్పెను . "ఓ మహారాజా !ఇదిగో ఇటు చూడుము . అక్కడ ఉన్న వానరవీరుడి పేరు 'హరుడు ' ఇతడి అధీనములో ఉన్న వేలకొలది వానరవీరులు వృక్షములను పెకలించి ,చేతపట్టుకుని లంకపై దాడి చేయుటకు సిద్ధముగా ఉన్నారు . ఆ పక్కనే సమూహముగా ఉన్న ఆ భల్లూక సేనను చూసినావా ?ఈ సేనకు నాయకుడు జాంబవంతుడు . యితడు శత్రువులను దెబ్బతీయుటలో సమర్థుడు . యితడు దేవాసుర యుద్ధమునందు ,దేవేంద్రుడికి ఎంతగానో సహాయపడి అతడి చేత అనేక వారములు పొందినాడు . ఈయన అనుచరులు మహోన్నతములైన ఆకారములు కలవారు . మృత్యువుకు భయపడరు . వీరు పర్వత శిఖరములపైకి చేరి ,పెద్దపెద్ద బండలను సైతము శత్రువులపై విసరగలరు . 
ఆ పక్కన కనపడుచున్న వానరోత్తముడి పేరు 'దంభుడు ' మిక్కిలి ఐన ఇతడు తన బలముతో కూడి ఇంద్రునికి సహాయపడుతూ ఉంటాడు . ఇక్కడ కనపడుచున్న వీరుడు 'సన్నాధనుడు 'యితడు వానరులకు పితామహుడు . ఆ ప్రక్కనే ఉన్న వానరయోధుడు 'క్రధనుడు 'యితడు దేవాసుర సంగ్రామములో దేవతలకు సహాయపడుటకై అగ్నిదేవునికి గాంధర్వ కాంత వలన జన్మించాడు . యితడు తన బలముతో కలిసి లంకను నాశనము చేయుటకు ,ఆరాటపడుచున్నాడు . ఇదుగో ఈ సమీపమునే ఉన్న వీరుడు 'ప్రమాథి 'అతడు పెక్కుమంది రోషపూరితులైన సేనలను కలిగినవాడు . 
ఓ మహారాజా !అక్కడ ఉన్న కొండముచ్చులను చూసినావా ?లంకను నేలపాలు చేయుటకు యుద్ధోత్సాహముతో కేకలు వేస్తున్న వీరికి నాయకుడు గవాక్షుడు . అదుగో అటు చూడుము అతడే 'కేసరి 'అను వీరుడు అతను వెనుక అపారంగా ఉన్న సైన్యము లంకను నాశనము చేయటానికి చూస్తున్నట్లుగా వున్నారు . అదుగో ఆ వానర వీరులమధ్యన వున్నవాడు 'శాతవలి 'అను పేరు కల వానర నాయకుడు యితడు భూమండలమున మిక్కిలి పేరు ప్రఖ్యాతలు కలవాడు . ఇతని బలము తిరుగులేనిది . యితడు తన సేనలతో కూడి లంకను భస్మము చేయుటకు కుతూహలపడుచున్నాడు . కార్యసిద్ధి ద్వారా శ్రీరామునికి ప్రీతి కూర్చుటకై యితడు ప్రాణత్యాగమునకు కూడా సిద్దపడును . 
'గజుడు 'గవాక్షుడు 'గవయుడు ''నలుడు ''నీలుడు 'అను వానరవీరులలో ఒక్కొక్కరి వెంట పదికోట్లమంది కపియోధులు కలరు . ఇంకా ఇదేవిధముగా యుద్ధమునకు చురుకుగా పరాక్రమించగల వింధ్యపర్వత వీరులు కలరు వారి సంఖ్య లెక్కింపనలవికానిది . మహారాజా !వీరంతా మిక్కిలి ప్రతిభావంతులు . మహాపర్వతముల వంటి దృఢమైన విశాలమైన శరీరములు కలవారు . అంతేకాదు ఈ భూమండలముపై కల కొండలన్నిటిని క్షణములో ధ్వంసము చేసి ,వాటిని అన్ని దిక్కులకు విసిరివేయకల సమర్థులు . "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ ఇరువదియేడవసర్గ సమాప్తము . 

                      శశి '

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Friday 19 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువదిఆరవసర్గ

                                  రామాయణము 

                                 యుద్ధకాండ -ఇరువదిఆరవసర్గ 

శుక సారణులు ఇద్దరూ ఆ విధముగా నిర్భయముగా పలికిన పిమ్మట రావణుడు వారిని మందలించుచు "దేవతలు గంధర్వులు దానవులు కలిసి ఒక్కుమ్ముడిగా నాపై యుద్ధమునకు వచ్చినను ,లోకములన్ని నన్ను భయపెట్టినను సీతను మాత్రము ఇవ్వను . సారణా !నీవు సౌమ్యుడవు . వానరులధాటికి తట్టుకొనలేక మిక్కిలి భయపడి ,శ్రీరామునకు సీతను అప్పగించటం మంచిదని తలంచుచున్నావు . యుద్ధ రంగమున నన్ను ఎదిరించి నిలవగల శత్రువు ఎవ్వడు ?"అని పలికి శుక సారణులతో కలిసి తన భవన ప్రాసాదము మీదికి ఎక్కెను . 
భవనము పైకి ఎక్కిన రావణుడు సముద్రాభిముఖముగా తిరిగి ,అక్కడ ఉన్న మైదానములలో ,పర్వతములలో ,వనములలో అపారంగా వ్యాపించిన వానర సైన్యమును చూసేను . పిమ్మట అతడు ఆ సైన్య విశేషములు తెలుసుకొనగోరి ,సారుణితో "ఓ సారణా !ఈ సైన్యములో ప్రముఖులెవ్వరు ?మహా శూరులెవ్వరు ?బలవంతులెవ్వరు?సుగ్రీవుడు ఎవరి మాటను వింటాడు . నాకు వివరముగా తెలుపండి "అని అడిగెను . 
అప్పుడు సారుణుడు అపారంగా ఉన్న ఆ సైన్యములో నీలుడిని ,అంగదుడిని ,నలుడిని ,రంభుడిని ,శరభుడిని ,పసనుడు ,వినతుడిని ,క్రోధనుడిని ,గవయుడిని ,చూపించెను . 

రామాయణము యుద్ధకాండ ఇరువదిఆరవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Wednesday 17 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువది అయిదవసర్గ

                               రామాయణము 

                               యుద్ధకాండ -ఇరువది అయిదవసర్గ 

శ్రీరాముడు సేనతో సహా అపారమైన సముద్రము దాటి సముద్ర తీరమున విడిది చేసినాడని తెలుసుకున్న రావణుడు తన మంత్రులైన శుకసారణులను పిలిపించి వారితో "మహా సముద్రమును దాటి గొప్ప వానర సైన్యము ఈవలి తీరమునకు చేరినది . సముద్రముపై వారధి నిర్మించుట అద్భుతము . నాకు నమ్మశక్యంగా లేదు . ఆ వానర సైన్యము యొక్క సంఖ్యా బలము , దాని శక్తి సామర్ధ్యములు తెలుసుకోవలిసిన అవసరము నాకు ఏర్పడినది కావున మీరిరువురు వానర రూపములలో ఆ వానర సైన్యములోకి ప్రవేశించి , వారి సంఖ్య, బలా బలములు ,తెలుసుకొనండి . వారధి నిర్మించిన విధము తెలుసుకొనండి . రామలక్ష్మణులు ఇకపై ఏమి చేయబోతున్నారు ? మొదలగు సమస్త  విషయములను తెలుసుకుని రండి "అని పలికి వారిని పంపివేసెను . 
రావణుడి ఆజ్ఞ మేరకు వానరులుగా తమ రూపమును మార్చుకున్న శుకసారణులు వానర సైన్యములోకి ప్రవేశించిరి . అపారంగా ఉన్న ఆ సేనను చూడగానే వారికి కాళ్లలో వణుకు మొదలయ్యెను . వారు సైన్యమును లెక్కించుటకు ప్రయత్నించిరి కానీ ఫలితము లేకపోయెను . వారిని చూసిన విభీషణుడు గుర్తించి వెనువెంటనే వారిని తీసుకువెళ్లి శ్రీరాముడి పాదములపై పడవేసి "ప్రభూ !వీరు రావణుని మంత్రులు మన సైన్య బాలసామర్ధ్యములు తెలుసుకొనుటకు ఇచటికి మారువేషములో వచ్చినారు . వీరు వధార్హులు "అని పలికెను . శ్రీరాముడిని చూడగానే వారి గుండె జారిపోయెను . 
అప్పుడు శ్రీరాముడు వారి చూసి నవ్వుతూ "మీరు మా సైన్యమును చూసినారు కదా !మీరు ఇంకా ఏమయినా విషయములు తెలుసుకొనవలసినచో స్వేచ్ఛగా తెలుసుకొనవచ్చును . విభీషణుడు మిమ్ములను దగ్గరుండి తీసుకెళ్లి మీరు కోరిన వివరములు చూపిస్తాడు . మీరు మారు వేషములో వచ్చినప్పటికీ  దూతలు కాబట్టి మిమ్ములను వధించము . మీరు తెలుసుకోదలిచిన విషయములు తెలుసుకుని లంకకు వెళ్ళండి. లంకకు వెళ్లిన పిమ్మట మీ ప్రభువుతో నా సందేశము ఈ విధముగా తెలుపండి "ఓ రావణా! నీవు ఏ బలమును ,బలగమును చూసుకుని ,నేను లేని సమయములో సీతను అపహరించావో ఆ బలమును బలగమును తీసుకుని నా ఎదురుగా నిలువు (నన్ను శరణు వేడు ),లేనిచో నీ సైన్యముతో సహా నా బాణములకు నిన్ను బలి చేస్తాను   "అని పలికెను .
ఆ శుక సారణులు తిన్నగా లంకకు వెళ్లి రాముడి మాటలను యధాతధముగా రావణునికి వినిపించిరి . పిమ్మట వారు రావణునితో "రాజా !శ్రీరాముడు ,లక్ష్మణుడు ,సుగ్రీవుడు ,విభీషణుడు వీరు నలుగురు ప్రాణ మిత్రులుగా ఉండిరి . వారిని జయించుట ఎవ్వరికి సాధ్యము కాదు , సేన లేకపోయినా వారు నలుగురే మన లంకను జయించగల సమర్థులు . శ్రీరాముడి అస్త్ర సామర్ధ్యమును గమనించినచో ఆయన ఒక్కడే మన లంకా నగరమును గెలవగల సమర్థుడు అని  అనిపించుచున్నది . సేన అపారంగా ఉండి ,దుర్భేద్యముగా ఉన్నది . కావున సంధి చేసుకుని సీతాదేవిని అప్పగించుట మంచిది . "అని చెప్పిరి 

రామాయణము యుద్ధకాండ ఇరువదియైదవసర్గ సమాప్తము . 

                               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
 







రామాయణము యుద్ధకాండ -ఇరువదినాల్గవసర్గ

                                     రామాయణము 

                                  యుద్ధకాండ -ఇరువదినాల్గవసర్గ 

సముద్ర తీరమున అపారంగా మరో సముద్రమా అన్నట్టుగా వున్న వానరసైన్యము నకు లంకా నగరమునుండి రాక్షసుల కోలాహలం వినపడెను . అప్పుడు ఆ వానరులు కూడా బిగ్గరగా గర్జనలు చేసిరి . ఆ ధ్వని ,లంకా నగరంలోని రాక్షసులకు వినపడినది . ఆ లంకా నగరమును చూసిన శ్రీరాముడు సీతాదేవిని గుర్తుతెచ్చుకుని బాధపడెను . పిమ్మట ఆ ప్రభువు ,సైన్య రక్షణ కొరకు ఎవరెవరు ఎక్కడ ఉండాలో వ్యూహ రచన చేసెను . ఆప్రకారముగా సైన్యమును నిలబెట్టి మరే రాక్షసుడు ఆ సైన్యములోకి ప్రవేశించకుండా ఏర్పాట్లు చేసెను . 
లంకా నగరంలోకి తిరిగి వచ్చిన శుకుడిని చూసిన రావణుడు నవ్వుతూ "శుకా !నీవు ఎందుకిలా వున్నావు ?ఆ వానరుల చేతికి చిక్కినావా ఏమిటి ?"అని వేళాకోళముగా ప్రశ్నించెను . అప్పుడు శుకుడు అక్కడ జరిగిన వృత్తాన్తమును చెప్పి ,శ్రీరాముడి బలపరాక్రమములను ,అతడి ఔదార్యమును వివరించి చెప్పెను . అపారంగా ఉన్న వానర సైన్య బలము గురించి కూడా చెప్పి సీతాదేవిని శ్రీరాముడికి అప్పచెప్పమని హితవు చెప్పెను . 
అప్పుడు రావణుడు శుకుడితో "ఓ శుకా !సహస్రాక్షుడైన ఇంద్రుడు కానీ ,వరణుడు కానీ ,యముడు కానీ ,శంకరుడి మిత్రుడైన కుబేరుడు కానీ ,నన్ను ఎదిరించలేరు . మానవ మాత్రుడు శ్రీరాముడు ! ఆ విషయము తెలియని శ్రీరాముడు నాపైకి యుద్ధమునకు వచ్చుచున్నాడు . ఏదేమైనప్పటికీ సీతను మాత్రము అప్పగించుట మాత్రము చేయను . "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ ఇరువదినాల్గవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



రామాయణము యుద్ధకాండ -ఇరువదిమూఢవసర్గ

                                  రామాయణము 

                                  యుద్ధకాండ -ఇరువదిమూఢవసర్గ 

లంకను దాటిన పిమ్మట శ్రీరాముడు .లక్ష్మణుడు ,సుగ్రీవుడు సమస్త సేనతో కూడి సముద్ర తీరమునే విడిది చేసిరి . శకున శాస్త్ర నిపుణుడు ఐన శ్రీరాముడు ,శుభ శకునములు చూసి సంతోషించెను . 

రామాయణము యుద్ధకాండ ఇరువదిమూఢవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Wednesday 10 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువదిరెండవసర్గ

                                 రామాయణము 

                                యుద్ధకాండ -ఇరువదిరెండవసర్గ 

పిమ్మట రఘువరుడు సముద్రునితో "ఓ మహా సముద్రుడా !నేడే పాతాళ లోకము వరకు వ్యాపించి ఉన్న నిన్ను శుష్కింప చేసెదను . నీవు ఇంకి పోయిన తర్వాత వానరులంతా నడుచుకుంటూ ,లంకకు చేరుకుంటారు . సాగరుడా ! దానవులకు ఆశ్రయమిచ్చుట వలన వారి గుణములు నీకు కూడా అబ్బినట్టున్నవి . "అని పలికి ,బాణమును ఎక్కుపెట్టి బ్రహ్మాస్త్ర మంత్రము చదివేను . అప్పుడు లోకములన్నీ అల్లకల్లోలములు అయినవి . పర్వతము కదిలినవి . దిక్కులన్నిటా చీకట్లు వ్యాపించినవి . నక్షత్రములతో సహా సూర్యచంద్రులు వక్ర గతిన తిరుగసాగిరి . ఆకాశమున సుడిగాలులు తిరిగినవి . 
అప్పుడు సముద్రుడు భయముతో పారిపోవుచుండెను . పారిపోవు వాడి మీదకు బాణము ప్రయోగించరాదని భావించిన శ్రీరాముడు బాణము వేయక ఆగెను . అది గమనించిన సముద్రుడు దివ్య రూపములో వచ్చి శ్రీరాముని దయతలచమని నీటిని మరల్చి దారి ఇవ్వలేనని ప్రార్ధించెను . అప్పుడు శ్రీరాముడు "ఎక్కుపెట్టిన బాణము వృధాగా పోరాదు ఎక్కడ ప్రయోగించను ?"అని అడుగగా సముద్రుడు దొంగలు దోపిడీ దారులు వుండే ద్రుమకుల్యము అనే ప్రదేశము చూపెను . వెనువెంటనే శ్రీరాముడు బాణమును ప్రయోగించెను . అది పెద్దపెద్ద మంటలతో దగ్దమయ్యెను . 
అది చూసిన సముద్రుడు తనలో ఏది వేసినా తేలుస్తాననీ ,అలా సేతువు నిరమించుకోమని ,వానరులలో నీలుడు విశ్వకర్మ కుమారుడు ,అతడు చక్కగా సేతువు నిర్మించుటలో నిపుణుడు . అతడి సహాయముతో సేతువు నిర్మించుకుని లంకా నగరమునకు చేరమని ఎంతో మర్యాదగా పలికి ,అంతర్ధానమయ్యెను . అప్పుడు నీలుడి పర్యవేక్షణలో ,వానరులు పెకలించి  తెచ్చిన వృక్షములు ,కొమ్మలు బండరాళ్ల తో సేతువు నిర్మాణము చక్కగా పూర్తి అయినది . ఆ సేతువు మీదగా సకల సేనా లంకా నగరము వైపుగా సాగిపోవుచున్నది . అందులో కొందరు వానరులు సేతువుపై నడుస్తూ వెళ్తున్నారు . ఇంకొందరు గాలిలో ఎగురుతూ ,మరికొందరు గంతులేస్తూ ,మిగిలిన వాళ్ళు సముద్రపు నీళ్లలో ఈదుతూ సముద్రమును దాటిరి .యావత్ సైన్యముతో శ్రీరాముడు ,లక్ష్మణుడు ,సుగ్రీవుడు సముద్రము ఆవలి తీరమునకు చేరిరి . 

రామాయణము యుద్ధకాండ ఇరువదిరెండవసర్గ . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




రామాయణము యుద్ధకాండ -ఇరువదియొకటవసర్గ

                                 రామాయణము 

                                    యుద్ధకాండ -ఇరువదియొకటవసర్గ 

శుకుడు వెళ్లిపోయిన పిమ్మట ,శ్రీరాముడు సముద్రుడికి ఎదురుగా దర్భాసనముపై కూర్చుండెను . ఆ మహాప్రభువు పగలూ రాత్రి కూడా అక్కడే ఆ ఆసనంపై ఉండెను . మూడుదినములు గడిచెను . సముద్రములో ఏమాత్రము మార్పులేదు . సముద్రుడు శ్రీరామునికి ఎదురుగా వచ్చి నిలబడలేదు . సహనము నశించిన శ్రీరాముడు సముద్రుడిపై మిక్కిలి కోపించెను . అప్పుడు పక్కనే వున్న లక్ష్మణునితో "లక్ష్మణా !శాంతస్వభావము కలవారికి ఈ లోకములో కీర్తిప్రతిష్టలు అబ్బవు . యుద్దములో విజయము కూడా సిద్దించదు . నా శాంతమును చూసిన సముద్రుడు కూడా నన్ను అసమర్ధుడు గా భావించినట్టువున్నాడు . అతడికి నా ప్రతాపము చూపించి ,నా దారికి తెచ్చుకొనెదను "అని పలికెను . 
ఈ విధముగా లక్ష్మణునితో పలికి ,వెంటనే తన ధనస్సు తీసుకుని ధనుష్టంకారము చేసెను . ఆ ధనుష్టంకార ధ్వనికి లోకములన్నీ అల్లకల్లోలమయ్యెను . పిమ్మట శ్రీరాముడు విషతుల్యములైన బాణములను సముద్రములోకి ప్రవేశించెను . మిక్కిలి బయంకరములైన అలలతో వుండేసముద్రము ,ఆ బాణముల తాకిడికి ఇంకా బయంకరములు అయ్యెను . సముద్రములో ముసళ్లు ,తిమింగలములు ,చేపలు చచ్చి పైకి తేలేను . శ్రీరాముడు మరో బాణము ప్రయోగించుటకు సంసిద్ధుడవుతుండగా లక్ష్మణుడు శ్రీరాముని ధనుస్సుని తన చేతితో పట్టుకుని "అన్నా !ఆగు ఇక చాలు "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ ఇరువదియొకటవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


Monday 8 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువదియవసర్గ

                                     రామాయణము 

                                      యుద్ధకాండ -ఇరువదియవసర్గ 

శార్దూలుడు అను రాక్షసుడు సముద్రము దాటి ఆవలి తీరమున వున్న అపారమైన వానర సేనతో వున్న శ్రీరాముడిని, లక్ష్మణుడిని ,సుగ్రీవుడిని చూసాడు . వెనువెంటనే సముద్రమును దాటి లంకా నగరమునకు వెళ్లి రావణునితో "ప్రభూ !వానర భల్లూక యోధులతో కూడిన అపారమైన సేన లంకా నగరమునకు వచ్చుటకు సముద్రము ఆవలి తీరమున ఉన్నది . సముద్ర తీరమున వున్న ఆ మహా సేన మఱియొక సముద్రమా అన్నట్టుగా ఉన్నది . నేను ఆకాశమునుండి చూసి చెప్పిన మాటలు ఇవి . ఆ సేన యొక్క బలాబలములు తెలుసుకొనుటకు ,నీవు దూతలను పంపు . వారు ఆ సేనల పూర్తి  వివరములు తెలుసుకుని ,వస్తారు . అప్పుడు నీవు ఉచితమైన రీతిలో తదనంతర కార్యక్రమును(సామ ,బేధ దాన ,దండోపాయములు ) ఆలోచించుకొనవచ్చును . (సీతాదేవిని శ్రీరామునికి అప్పగించుట దానోపాయము ,సుగ్రీవుని మంచి మాటలతో నీ వైపు త్రిప్పుకొనుట సామోపాయము ,శ్రీరాముడికి సుగ్రీవునికి మధ్య విరోధము సృష్టించుట భేదోపాయము ,యుద్ధము దండోపాయము )శ్రీ రాముని విషయములో దండోపాయము పనిచేయదు . "అని పలికెను . 
                    శార్ధూలిడిమాటలు విన్న రావణుడు మిక్కిలి ఆందోళనకు లోనయ్యేను . పిమ్మట బాగుగా అలోచించి ,శుకుడు అను రాక్షసుడిని పిలిపించి అతడితో "శుకా ! నీవు సముద్రము ఆవలి తీరమున ఉన్న వానర రాజైన సుగ్రీవునితో నా మాటలు మధురముగా ఇలా చెప్పు "ఓ సుగ్రీవా నీవు వానరారాజువి . గొప్పవాడైన ఋక్షజుని కుమారుడివి . వాలి నాకు మిత్రుడు వాలికి సోదరుడవైన నీవు కూడా నాకు సోదరుడితో సమానుడివి . నీవు శ్రీరామునితో ఉండుట వలన ఎటువంటి ప్రయోజనము లేదు . అతడు మానవుడు అతడిని వదిలిన మాత్రమున నీకు జరుగు చెడు ఏమియు ఉండదు . శ్రీరాముడి భార్యను నేను అపహరించుట వలన నీకు వచ్చిన నష్టము ఏమి ?ఆలోచించుకొనుము . నా పక్షమున ఉండుము . వానరులు లంకా నగరములో ప్రవేశించలేరు . దేవగంధర్వులు కూడా లంకా నగరములో ప్రవేశించలేరు . ఇక వానరుల సంగతి చెప్పనేముంది ?కావున కిష్కింధకు మరలిపొమ్ము "అని నా పలుకులుగా తెలుపు "అని శుకుడిని ఆదేశించెను . 
శుకుడు వెనువెంటనే ఒక చిలక గా మారి ఆకాశములో ఎగురుతూ సుగ్రీవుడి వద్దకు చేరి ఆకాశములో వుండే రావణుని సందేశమును మొత్తము వినిపించెను . ఆటలు ఆ పలుకులు పలుకుతుండగానే వానరులలో కొందరు ఆకాశములోకి ఎగిరి , ఆపక్షి రెక్కలు పీకు దానిని బందించి సుగ్రీవుడి ఎదురు గా నిలిపేను . వానరుల దేబాలకు తట్టుకోలేక ,శ్రీరాముడితో దయతలిచి వదిలివేయమని అర్ధించెను . అతడి అభ్యర్ధన విన్న శ్రీరాముడు 'అతడిని కొట్టకండి 'అని పలికెను . అప్పుడు వానరులు అతడిని బాధించుట ఆపిరి . అప్పుడా శుకుడు మళ్లీ సుగ్రీవునితో "సుగ్రీవా !లోకకంటకుడైన రావణుని మాట వినకపోయినచో నీకు అతడి చేతిలో మరణము తప్పదు . నీ సందేశముగా అతడికి ఏమి చెప్పమంటావు "అని పలికెను . 
అప్పుడు సుగ్రీవు డు "మీ ప్రభువుతో ఇలా చెప్పు !ఓ దుష్ట వానరా !నీవు నాకు మిత్రుడవు కావు బందువువి కూడా కావు . నాకు పరమ ఆప్తుడైన శ్రీరామునకు నీవు శత్రువువు అందువలన నీవు కూడా నాకు శత్రువువే నీవు చేసిన దుష్ట కార్యములు జటాయువును చంపుట ,సీతామాతను అపహరించుట , ఈ కార్యములకు తప్పక ఫలితము అనుభవించవలసినదే . నేను అతి త్వరలోనే నా సేనతో సహా అక్కడికి వచ్చి నిన్ను సపరివారంగా నాశనము చేసెదను . శ్రీరాముని విషతుల్యములైన బాణములకు త్వరలోనే నీవు బాలి కాబోవుచున్నావు . "అని పలికెను . 
అప్పుడు యువరాజైన అంగదుడు "ప్రభూ !యితడు దూతగా నాకు అనిపించుట లేదు . యితడు గూఢచారి అని అనుమానము . అతడు మాట్లాడుతూనే మన బలగములను పరిశీలించుచున్నాడు . ఇతడిని లంకకు పంపక ఇక్కడే బంధించుట ఉత్తమమని నా ఉద్దేశ్యము "అని పలికెను అంగదుడి మాటలు విన్న వానరులు ఆరాక్షసుని పట్టుకు హింసించసాగిరి . అప్పుడు అతడు రామా !రామా !అని బిగ్గరగా అరవసాగెను . అప్పుడు శ్రీరాముడు "అతడిని విడిచిపెట్టండి . దూతను చంపుట యుక్తము కాదు" అని పలికెను . 
రామాయణము యుద్ధకాండ ఇరువదియవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Monday 1 July 2019

రామాయణము యుద్ధకాండ -పందొమ్మిదవసర్గ

                                       రామాయణము 

                                     యుద్ధకాండ -పందొమ్మిదవసర్గ 

సుగ్రీవుడి మాటలు విన్న విభీషణుడు తన అనుచరులతో కలిసి ,నేలపైకి దిగి శ్రీరాముని పాదముల చెంత వాలెను . పిదప శ్రీరామునితో "ప్రభూ !నేను రావణుని తమ్ముడిని . నా పేరు విభీషణుడు . మా అన్న వలన నీకు ఎంతో కష్టము కలిగెను . అతడి దురాగతములు చూడలేక నేను లంకను ,మా అన్నను ,నా భార్యా పిల్లలను ,నా స్నేహితులను ,మిత్రులను సమస్త సంపదలను వదిలి వచ్చినాను . ఇక నా జీవితమూ నీ అధీనము . "అని పలికెను . 
ఆ మాటలు విన్న కరుణాసముద్రుడైన శ్రీరాముడు విభీషనుడికి అభయమిచ్చెను . అతడిని ఓదార్చెను . పిమ్మట శ్రీరాముడు లంక లోని రాక్షసుల బలాబలములు తెలుపమని అడుగగా విభీషణుడు "ఓ రాకుమారా !లంకకు మా అన్న అయిన రావణుడు అధిపతి . అతడు బ్రహ్మను మెప్పించి దేవదానవగంధర్వులలో ఎవరిచేత చావులేకుండా వారము పొందెను . ఆ రావణునికి తమ్ముడు నాకు మరో అన్న ఐన కుంభకర్ణుడు గొప్ప యోధుడు యుద్ధమున ఇంద్రుడంతటి బలశాలి . 
ఓ రామా !ప్రహస్తుడనువాడు రావణుని సేనాధిపతి . కైలాసములో కుభేరునితో జరిగిన యుద్దములో కుభేరుడి సేనాధిపతి ఐన మణిభద్రుని ఇతడు ఓడించెను . రావణుని కుమారుడు ఇంద్రజిత్తు . అతడు యజ్ఞముద్వారా అగ్ని దేవుని సంతృప్తి పరిచి అమితమైన శక్తిని సంపాదించుకొనెను . రణరంగమున శత్రువులకు కనపడకుండా యితడు యుద్ధము చేస్తాడు . మహోదరుడు ,మహాపార్శ్వుడు ,అకంపనుడు అనువారు రావణుని సేనాధిపతులు . వారు యుద్దములో దిక్పాలకులతో సమానురు . లంక లో నివసించు కోట్లకొలదిగా కల రాక్షసులు కామరూపులు ,రక్తమాంసములను భక్షించువారు . రావణుని చేతిలో దేవతలతో సహా దీక్పాలురులందరూ పరాజితులై పారిపోయిరి . "అని పలికెను . 
విభీషణుడి మాటలు విన్న శ్రీరాముడు "విభీషణా !ఆ రావణుని ,అతడి సమస్త సేనలను అతడి మిత్రులని ,అతడి బంధువులను రణరంగమునకు బలి ఇచ్చి లంకకు నిన్ను రాజును చేస్తాను "అని పలికెను . శ్రీరాముడి మాటలు విన్న విభీషణుడు "ఆ రాక్షసులతో యుద్ధ విషయములో నేను యధాశక్తి సహాయపడగలను . నా ప్రాణములు ఒడ్డి అయినా ఆ రావణుని సైన్యముతో నీ తరుపున యుద్ధము చేస్తాను "అని పలికెను . 
ఆ మాటలు విన్న శ్రీరాముడు వెంటనే లక్ష్మణునిచే సముద్ర జలములను తెప్పించి ,సమస్త వానరుల సమక్షమంలో విభీషనుడికి పట్టాభిషేకము చేసెను . అప్పుడా సేన అందరూ బాగుబాగు అని ప్రశంసించిరి . పిదప హనుమ ,సుగ్రీవుడు ,విభీషణునితో అపారమైన సముద్రము దాటుటకు ఉపాయము అడిగెను . అప్పుడు విభీషణుడు "శ్రీరాముడు సముద్రుడిని వేడుకొనుటయే యుక్తము "అని పలికెను . అప్పుడా శ్రీరామ్ లక్ష్మణులు ,వానరులూ అందరూ చర్చించుకొని ,విభీషణుడు చెప్పిన ఉపాయము సరి అయినదే అని నిరణయించుకొనెను . పిదప శ్రీరాముడు సముద్రమునకు ఎదురుగా ఒక దర్భాసనముపై కూర్చొనెను . 

రామాయణము యుద్ధకాండ పందొమ్మిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





రామాయణము యుద్ధకాండ -పదునెనిమిదవసర్గ

                             రామాయణము 

                            యుద్ధకాండ -పదునెనిమిదవసర్గ 

వానర ప్రముఖుల అందరి మాటలు విన్న తదుపరి శ్రీరాముడు వారితో "శత్రువైనా అంజలిఘటించి ,దీనుడై శరణు వేడి అనుగ్రహించమని ప్రార్ధించినచో అతనికి హాని చేయరాదు . అతడిని ఆడుకొనవలెను . తమ ప్రాణములను ఒడ్డి అయినా వారిని కాపాడవలెను . 
భయపడి కానీ ఆపద్ధర్మము ఎరుగక కానీ ,లాభాపేక్షతో కానీ ,శక్తిగలవాడై యుండియు ఏదేని ఒక నెపముతో ఆ సారాను చొచ్చిన వారిని రక్షింపనిచో అతడు ఈ లోకమున నిందలపాలగుటయే కాక మీదు మిక్కిలి నరక బాధలను కూడా పొందును . శరణాగతుని రక్షింపకుండుట మహా దోషము . దాని వలన నరకము తప్పదు . 
నేను విభీషణునికి అభయమిచ్చుచున్నాను . అతనికే కాదు రావణుడే వచ్చి శరణు కోరినను ,వానికి కూడా అభయమిచ్చెదను . "అని పలికెను . ఆ మాటలు విన్న సుగ్రీవుడు శ్రీరాముని అనుమతితో ,విభీషణుడి వద్దకు వెళ్లి ,"శ్రీరామచంద్రుడు నీకు అభయమిచ్చినాడు "అని పలికెను . ఆ మాటలు విన్న విభీషణుడు పరమానంద భరితుడయ్యెను . 

రామాయణము యుద్ధకాండ పదునెనిమిదవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .