రామాయణము
యుద్ధకాండ -పదునెనిమిదవసర్గ
వానర ప్రముఖుల అందరి మాటలు విన్న తదుపరి శ్రీరాముడు వారితో "శత్రువైనా అంజలిఘటించి ,దీనుడై శరణు వేడి అనుగ్రహించమని ప్రార్ధించినచో అతనికి హాని చేయరాదు . అతడిని ఆడుకొనవలెను . తమ ప్రాణములను ఒడ్డి అయినా వారిని కాపాడవలెను .
భయపడి కానీ ఆపద్ధర్మము ఎరుగక కానీ ,లాభాపేక్షతో కానీ ,శక్తిగలవాడై యుండియు ఏదేని ఒక నెపముతో ఆ సారాను చొచ్చిన వారిని రక్షింపనిచో అతడు ఈ లోకమున నిందలపాలగుటయే కాక మీదు మిక్కిలి నరక బాధలను కూడా పొందును . శరణాగతుని రక్షింపకుండుట మహా దోషము . దాని వలన నరకము తప్పదు .
నేను విభీషణునికి అభయమిచ్చుచున్నాను . అతనికే కాదు రావణుడే వచ్చి శరణు కోరినను ,వానికి కూడా అభయమిచ్చెదను . "అని పలికెను . ఆ మాటలు విన్న సుగ్రీవుడు శ్రీరాముని అనుమతితో ,విభీషణుడి వద్దకు వెళ్లి ,"శ్రీరామచంద్రుడు నీకు అభయమిచ్చినాడు "అని పలికెను . ఆ మాటలు విన్న విభీషణుడు పరమానంద భరితుడయ్యెను .
రామాయణము యుద్ధకాండ పదునెనిమిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment