Wednesday 10 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువదియొకటవసర్గ

                                 రామాయణము 

                                    యుద్ధకాండ -ఇరువదియొకటవసర్గ 

శుకుడు వెళ్లిపోయిన పిమ్మట ,శ్రీరాముడు సముద్రుడికి ఎదురుగా దర్భాసనముపై కూర్చుండెను . ఆ మహాప్రభువు పగలూ రాత్రి కూడా అక్కడే ఆ ఆసనంపై ఉండెను . మూడుదినములు గడిచెను . సముద్రములో ఏమాత్రము మార్పులేదు . సముద్రుడు శ్రీరామునికి ఎదురుగా వచ్చి నిలబడలేదు . సహనము నశించిన శ్రీరాముడు సముద్రుడిపై మిక్కిలి కోపించెను . అప్పుడు పక్కనే వున్న లక్ష్మణునితో "లక్ష్మణా !శాంతస్వభావము కలవారికి ఈ లోకములో కీర్తిప్రతిష్టలు అబ్బవు . యుద్దములో విజయము కూడా సిద్దించదు . నా శాంతమును చూసిన సముద్రుడు కూడా నన్ను అసమర్ధుడు గా భావించినట్టువున్నాడు . అతడికి నా ప్రతాపము చూపించి ,నా దారికి తెచ్చుకొనెదను "అని పలికెను . 
ఈ విధముగా లక్ష్మణునితో పలికి ,వెంటనే తన ధనస్సు తీసుకుని ధనుష్టంకారము చేసెను . ఆ ధనుష్టంకార ధ్వనికి లోకములన్నీ అల్లకల్లోలమయ్యెను . పిమ్మట శ్రీరాముడు విషతుల్యములైన బాణములను సముద్రములోకి ప్రవేశించెను . మిక్కిలి బయంకరములైన అలలతో వుండేసముద్రము ,ఆ బాణముల తాకిడికి ఇంకా బయంకరములు అయ్యెను . సముద్రములో ముసళ్లు ,తిమింగలములు ,చేపలు చచ్చి పైకి తేలేను . శ్రీరాముడు మరో బాణము ప్రయోగించుటకు సంసిద్ధుడవుతుండగా లక్ష్మణుడు శ్రీరాముని ధనుస్సుని తన చేతితో పట్టుకుని "అన్నా !ఆగు ఇక చాలు "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ ఇరువదియొకటవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


No comments:

Post a Comment