రామాయణము
యుద్ధకాండ -ముప్పదియైదవసర్గ
ఆజానుబాహుడైన శ్రీరాముడు శంకారావములతో ,భేరినాదములతో లంక వైపుగా వెళ్లసాగెను . రావణుడు ఆ ధ్వనులు విని క్షణకాలం ఇక ఇప్పుడు చేయవలసినది ఏమిటని ఆలోచించెను . పిమ్మట అతడు మంత్రుల వైపు చూసేను . రావణుడి తాత (రావణుడి తల్లి ఐన కైకసి కి తండ్రి )ఐన మాల్యవంతుడు అను రాక్షసుడు రావణుడు చేసినది తప్పని సీతాదేవిని శ్రీరాముడికి అప్పగించటమే మంచిదని . శ్రీరాముని తక్కువ అంచనా వేయవద్దని పరిపరి విధములుగా చెప్పెను . ఆ విధముగా చెప్పిన పిమ్మట రావణుడి మనోభావములను అంచనా వేయుచు రావణునే చూసేను .
రామాయణము యుద్ధకాండ ముప్పదియైదవసర్గ .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment