రామాయణము
అరణ్యకాండ -ఇరువది ఎనిమిదవసర్గ
అరివీర భయంకరుడైన ఖరుడు తన ఎదుటే శ్రీరాముడు త్రిశరుడు ,దూషణుడు ,ఇంకా తన పదునాలుగువేలమంది వీరులను ఒంటిచేత్తో పరిమార్చిన శ్రీరాముని చూసి ,భయముతో చెమటలు పోయగా ధైర్యము సడలిపోయెను . అయినను ధైర్యము కూర్చుకుని రణరంగము లోకి దిగి శ్రీరాముడిపై బాణములు వేయసాగెను . ఖరుడు తన వాడి బాణములతో శ్రీరాముని గాయ పరిచేను . శ్రీరాముని బాణము చాపము ,విరగగొట్టెను . శ్రీరాముని శరీరము నుండి రక్తము స్రవించసాగెను .
అంత శ్రీరాముడు క్రుద్ధుడై విష్ణుచాపమును ధరించి ,ఖరుడి ధనుర్భాణములు ,ముక్కలు చేసెను . అతని ధ్వజపతమును ధ్వంసము చేసెను . రధమును ధ్వంసము చేసెను . రాధా సారధిని చంపెను . ఖరుడిని గాయపరిచేను . దేవతలు ,ఋషులు అందరూ అది చూసి రాముని పొగడ సాగిరి .
రామాయణము అరణ్యకాండ ఇరువదియెనిమిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment