రామాయణము
అరణ్యకాండ -ముప్పదియైదవసర్గ
శూర్పణఖ వచనములు విన్న రావణుడు సభలో వున్నా మంత్రులతో రాముని విషయమై చర్చించెను . పిదప మంత్రులను పంపివేసి సీతాపహరణము లో కల గుణదోషములను తర్కించుకొనెను . తన బలమును ,శ్రీరాముని బలమును పోల్చుకుని కడకు సీతాపహరణకే నిశ్చయించుకొనెను . అనుకున్నదే తడవుగా రధమును సిద్దము చేయించుకుని ఆకాశ మార్గమున అనేక ప్రాంతములను దాటుతూ అనేక రమణీయ ప్రదేశములు దర్శించుచు తుదకు మారీచుని ఆశ్రమమునకు చేరెను .
మారీచుడు ఆ రాక్షస రాజుకి ఎదురేగి స్వాగత సత్కారములు చేసి ,అతడితో "ఓ రాక్షస రాజా !లంక యందు అందరూ కుశలమే కదా మఱల ఒంటరిగా వెంటనే ఇచటకు వచ్చుటకు గల కారణము ఏమిటి ?"అని ప్రశ్నించగా వాక్చతురుడైన రావణుడు మారీచునితో ఇట్లనెను .
No comments:
Post a Comment