రామాయణము
అరణ్యకాండ -నలుబదియొకటవసర్గ
రావణుడు పలికిన మాటలు విన్న మారీచుడు కోపముతో "ఓ దుష్టబుద్ధి కల రావణా !నేను ఎంతగా చెప్పినప్పటికీ మరణమాసన్నమగుట చే నా మాటలు నీ చెవికి ఎక్కుటలేదు . నీ చేతిలో మరణించుట కంటే ,నీ శత్రువైన రాముని చేతిలో మరణించుట నాకు సంతోషము . నేను లేడి రూపధారుడనై అచటికి వెళ్లిన పిదప నా మరణము తధ్యము . నా మరణానంతరము నీ మరణమూ తధ్యము .
సీతాపహరము నీవు చేసినచో నీ బంధుపరివారముతో సహా నాశనమగుట తధ్యము "అని పలికెను .
రామాయణము అరణ్యకాండ నలుబదియొకటవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .
No comments:
Post a Comment