Saturday 17 June 2017

రామాయణము అరణ్యకాండ - ముప్పదిఎనిమిదవ సర్గ

                                     రామాయణము 

                                          అరణ్యకాండ   - ముప్పదిఎనిమిదవ  సర్గ 

నేను ఒకానొకప్పుడు  పర్వత సమానమైన  శరీరము  గలిగి,  వేయిఏనుగుల  బలముగలవాడనై,  పరాక్రమ  గర్వముతో  ఈ  భూమిపై  సంచరించుచుంటిని  నల్లని మేఘమువలె  ఒప్పుచు  మేలిమి  బంగారు  కుండలములను  కిరీటమును  ధరించి  పరిఘ  అను  ఆయుధమును  చేతబట్టి, దండకారణ్యమున  ఋషుల  మాంసములను  భక్షించుచు  తిరుగసాగితిని. 
ఆ విశ్వామిత్రమహాముని  శ్రీ  రాముని, పరమప్రీతితో  వెంటనిడుకుని,  తన  ఆశ్రమమునకు  చేరెను. పిమ్మట  ఆ మహర్షి  దండకారణ్యమునందలి  తన ఆశ్రమమున  యజ్ఞ  దీక్షను   గైకొనెను.  అప్పుడు  శ్రీ  రాముడు  తన అద్భుతమైన  ధనస్సును  చేతబట్టి  టంకార మొనర్చుచు   యజ్ఞరక్షణకై  సర్వసంపన్నద్ధుడై  నిలిచెను. 
ఆసమయమున  శ్రీ రాముడు  సర్వశుభలక్షణములు  గలిగి,  కిశోరదశ యందేయుండెను  ఇంకను  యవ్వన   మంకురింపలేదు. తామరరేకులవంటికన్నులు  గల్గియున్న  అతడు  బ్రహ్మచర్యసూచకములైన  ఏక్వాస్త్రమును  శిఖము  ధరించియుండెను.  అతడు  ధనుర్దారియై,    బంగారు  ,ఆభరణములను దాల్చి,  తన  అపూర్వశోభలతో  ఉదయించుచున్న  బాలచంద్రునివలె  ఒప్పుచు  దండకారణ్యమున  ప్రకాశింపజేయుచుండెను.  
నేను మేఘమువలె  నల్లని  శరీరముగలవాడనయి  మేలిమి  బంగారు  కుండలములను  దాల్చి  అదే  సమయమున  ఆ  ఆశ్రమముకడకు   చేరితిని.  నేను  మిగులఁబలశాలియై    యుండుటయేగాక    దేవతలచేతను  చావులేకుండునట్లు  వరములను  పొందియుండుటచే  మిక్కిలి  గర్వితుడనై  ఆయుధమును  చేబూని   యుంటిని  అట్టి నన్ను జూచి  శ్రీ రాముడు  ఏ మాత్రము  చలింపక  ధనస్సును  ఎక్కుపెట్టేను  
శ్రీ రాముని  సౌర్యపరాక్రమములను  నేను  "యితడు  బాలుడే  గదా "అని  తలచి  ఆయనను  సరకుగొనక (లక్ష్య పెట్టక ) త్వరత్వరగా  విశ్వామిత్రుని  యజ్ఞ వేదిక వద్దకు   పరుగు పెట్టితిని. 
ఇంతలో ఆ రఘువరుడు   శత్రుసంహారకమై  ఒక  వాడిబాణమును  నాపై   ప్రయోగించెను .  ఆ  బాణము  యొక్క  దెబ్బకు  నేను  నూరుయోజనములదూరమునున్న  సముద్రములో  పడిపోతిని.  నాయనా! రావాణా!  ఆ వీరుడు  నన్ను  హతమార్చుటకు  సమర్దుడేయైనను  అప్పుడు  చంపదలంపక  ప్రాణములతో  వదిలిపెట్టను. ఆయన బాణము వేగము  నెట్టినీయబడి  స్పృహలేనివాడనై  గంభీరమైన సముద్రమున  పడితిని  చాలాకాలనమునకు  స్పృహ వచ్చినా పిమ్మట  తిన్నగా  లంకకు చేరితిని. 
ఓ  రావణ! ఆయన  కృపవలన  బ్రతికిబయటపడి  ఇప్పుడు  ఇట్లుంటిని  బాలుడై న  శ్రీ రాముడు  పూర్తిగా  అస్త్రవిద్యలను  నీర్వేకున్నాను  ఎట్టి క్లిష్టకార్యములనైనను  అవలీలగా  చేయగలసమర్దుడు  కనుక  నాడు  నా  షహాయకులందఱను  ఆ వీరుని  చేతిలో  నిహతులైరి  అందువలన  నేను  నిన్ను  ఇట్లు  నివారించుచుంటిని  అయినను  ఆయనతో త్వరలోనే తీరుని  ఆపదలపాలగుట  తద్థ్యము . 
ఓ  రాక్షసరాజా! సీతాదేవికొరకై  నీవు  రామునితో  యుద్ధమునకు  సిద్దమైనచో  భోగవిలాసములలో  తెలియాడుచున్నవారను  సామాజికములై  ఉత్సవములలో  నిమగ్నులైన వారను  అగు  రాక్షసులను  సంతమమును  అనర్థములను  తెచ్చిపెట్టినవాడవగుదువు  మరియు  హర్మ్యములతోడును  ప్రసాదములతోడును  బారులుతీరి, వివిధములగు  రత్నములతో అలంకృతమై ,కళకళలాడుచున్న లంకా పట్టణము సర్వ నాశనమై పోవుటను నీవు చూడగలవు . 
ఓ రాజా !పరసతులను ఆశించుట కంటే మించిన పాపము మరియొకటి లేదు . నీ అధీనములో వున్న వేలకొలది యువతులతో సుఖించుట నీకు మేలు . నీ కులము ను ,గౌరవమును ,ఐశ్వర్యము ను ,రాజ్యమును ,నీకు మిగుల ఇష్టమైన నీ ప్రాణములను కాపాడుకొనుము . ఓ రావణా !నీ మేలు కోరి నేని ఇంతగా నివారించుచున్నను సీతాదేవిని బలవంతముగా అపహరించినచో నీ చతురంగ బలములన్నియు క్షీణించును . నీ ఆత్మీయులందరూ నశింతురు . కడకు నీవును శ్రీరాముని బాణములకు ఆహుతిఅయి మృత్యువాతబడుదువు . "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ ముప్పది ఎనిమిదవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 











No comments:

Post a Comment