Monday 19 June 2017

                                            రామాయణము 

                                             అరణ్యకాండ -నలుబదియవసర్గ 

 మారీచుడు ఆ విధముగా హితోక్తి పలికినప్పటికీ చావు ఘడియలు సమీపించిన రావణుడు అతడి మాటలు ఏమాత్రమూ లక్ష్యపెట్టక "మారీచా !దుష్టుడు ,క్రూరస్వభావుడు ,మానవమాత్రుడు ఐన ఆ అల్పుడు గూర్చి నీవు పలికిన మాటలకు నేను ఏ మాత్రమూ బెదరను . నీవే కాదు దేవతలు సైతము నన్ను సీతాపహరణ యోచన నుండి మరల్చలేరు . 
ఇది తధ్యము . ఖరుడు మొదలగు రాక్షస వీరులను చంపిన రాముడిపై నేను తప్పక ప్రతీకారము తీర్చుకొనెదను . నీవు బంగారవర్ణపు లేడీగా మారి వారి ఆశ్రమం పరిసరాలలో చరించు . అప్పుడు సీత లేడిపై ఆశపడి రాముడిని ఆ లేడి కావలెనని కోరును . రాముడు దానికై పరిగెత్తును . అతడిని దూరముగా తీసుకెళ్లి ,నీవు శ్రీరాముడి కంఠ స్వరముతో ఆపద వచ్చినట్టుగా బిగ్గరగా అరువుము . అప్పుడు లక్ష్మణుడు సైతము అచటి నుండి రాముడు వెళ్లిన వైపుగా వెళ్ళును . ఆసమయములో నేను సునాయాసముగా సీతను అపహరించెదను . 
ఓ మారీచా !నేను చెప్పినట్టుగా చేసి తీరవలెను . ఇది నా ఆజ్ఞ నా ఆజ్ఞను అతిక్రమించినచో నిన్ను నేను చంపివేయుదును . లేడి వేషములో రాముని ఆశ్రమమునకు వెళ్ళినచో నీవు ఎటులైనను తప్పించుకొను అవకాశము కలదు . కానీ నా మాటను అతిక్రమించినచో నీకు మరణము తప్పదు ఇది సత్యము . "అని పలికెను . 

         రామాయణము అరణ్యకాండ నలుబదియవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  





   

No comments:

Post a Comment