రామాయణము
అరణ్యకాండ -ముప్పదిరెండవసర్గ
ఖరుడు ,త్రిశరుడు మొదలగు పదునాలుగు వేల రాక్షస వీరుల మరణమును స్వయముగా చూసిన శూర్పణఖ భయముతో గగ్గోలుపెడుతూ అచట నుండీ రావణుని లంకా నగరమువైపు పరుగిడెను . శూర్పణఖ లంకకు వచ్చు సమయమునకు రావణుడు పుష్పకము అను పేరు కల తన భవనము మంత్రులతో కూడి ఉండెను . మంత్రుల మధ్యలో సింహాసనంపై కూర్చుని వున్న రావణుడు దేవేంద్రుడు వలె వెలిగిపోతున్నాడు .
అట్టి సభలోకి ప్రవేశించిన శూర్పణఖ లక్ష్మణుని వలన తనకు కలిగిన వికృత రూపమును ప్రదర్శించుచు ,భయముతో వణుకుతున్నదై బిగ్గరగా ఏడుస్తూ ,గగ్గోలు పెడుతూ లంకాధిపతి అయిన రావణునితో ఈ విధముగా పలుకనారంభించెను .
అట్టి సభలోకి ప్రవేశించిన శూర్పణఖ లక్ష్మణుని వలన తనకు కలిగిన వికృత రూపమును ప్రదర్శించుచు ,భయముతో వణుకుతున్నదై బిగ్గరగా ఏడుస్తూ ,గగ్గోలు పెడుతూ లంకాధిపతి అయిన రావణునితో ఈ విధముగా పలుకనారంభించెను .
రామాయణము అరణ్యకాండ ముప్పదిరెండవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment