రామాయణము
అరణ్యకాండ -ముప్పదిఆరవసర్గ
రావణుడు మారీచునితో "మారీచా !నేను పలికే మాటలు శ్రద్దగా ఆలకింపుడు . నేను ఆపదలో వున్నాను . ఇప్పుడు నువ్వే నాకు దిక్కు . నా సోదరుడైన ఖరుడు ,భుజబలశాలి ఐన దూషణుడు ,నాతోబుట్టువు ఐన శూర్పణఖ ,మాంసభక్షుడు ,మిగుల పరాక్రమమంతుడు ఐన త్రిశరుడు గురి తప్పని యోధులైన రాక్షసవీరులు ,ఇంకను తదితర రాక్షసులు నా ఆదేశానుసారం జనస్థానము నందు స్థిరనివాసము కలిగియున్న విషయము నీవు ఎరుగుదువు కదా !
ఆ రాక్షస వీరులందరిని రాముడు ఏ విరోధము లేకుండానే సమరమున పరిమార్చెను . ఆ రాముడు క్రుద్ధుడైన తండ్రిచే వెడలగొట్టబడి భార్యాసహితుడై వనములకు చేరి ,తన బలము చూసుకుని రాక్షస వీరులను హతమార్చుట కాక నా సోదరి అగు శూర్పణఖ ముక్కు చెవులు కోసి అవమానించాడు . అందువలన ఆ శ్రీరాముని భార్యను అపహరించదలిచాను . ఓ మహా వీరుడా !నీవు ,కుంభకర్ణాదులు నా పక్కన నిలువగా యుద్ధరంగమున సమస్త దేవతలను నేను లక్ష్యపెట్టను. ఓ మారీచా!అందువలన నీవు నాకు సహాయకుడై యుండుము. నీవు సర్వసమర్థుడవు,పరాక్రమమునందును ,యుద్ధము చేయుటయందును,సమరోత్సాహమునందును నీవు సాటిలేనివాడవు. పైగా ఉపాయశాలివి, మహావీరుడవు , పలువిధములగు ఉపాయములను పన్నుట లో ఘటికుడవు అందువలన ఈ కార్యమును సాధించుటకై నేను నీ కడకు వచ్చితిని.
ఈ సందర్భమున నీవు సహాయపడవలసిన పద్దతిని తెలిపెదను. శ్రద్దగా విను. తెల్లని చుక్కలుగాలి చిత్రమైన ఒక బంగారులేడి రూపమును పొంది,ఆ రాముని ఆశ్రమమున సీతాయెదుట సంచరింపుము . అద్భుతమైన నీ మృగరూపమును జూచి,ఆమె మిగుల మోజు పడును. వెంటనే "ఈ బంగారలీడిని తెచ్చియుండు"అని ఆమె రామలక్ష్మణులను కోరును . అప్పుడు వారు దూరముగా వీళ్ళిపోగా ఆశ్రమమున ఒంటరిగా ఉన్న సీతను నిరాటంతముగా అవలీలగా చంద్ర కాంతులను రాహువు వాలే హరిచెదను.
అంతటా రాముడు భార్యావియోగకారణమున కృంగికృశించి పూవును అప్పుడు నేను తిరుగులేని మనోభాలముతో
నిస్సంశయముగా అతనిని దెబ్బతీయగలను .
శ్రీ రామునిపేరును వినినంతనే బుద్ధికుశలుడై మారీచుడు భయముతో వణికిపోయెను. అతని ముఖము వాడిపోయెను పెదవుల తడి ఆరిపోయెను అతడు ఎండిన పెదవులను నాలుకతో తడుపుకొనుచు,రెప్పపాటులేక
గ్రుడ్లప్పగించి చూచుచు మృతప్రాయుడయ్యెను . అతడు మిగుల ఆర్తుడై రావణుని వైపు చూడ సాగెను.
ఆ మారీచుడు ఇంతకుముందే మహాహవనమునందు శ్రీ రాముని పర్రక్రమమును రుచిచూచి యుండెను అందువలన అతనిమనస్సు బయ్యందోళనకు గురియయ్యెను . కనుక అతడు రావణునకు నమస్కరించి అతనికిని,
తనకును మేలు చీకుర్చునట్టి వాస్తవ విషయములను ఇట్లు పలికెను.
రామాయణము అరణ్యకాండ ముప్పదిఆరవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment