రామాయణము
అరణ్యకాండ -ఏబదియేడవసర్గ
బంగారుజింక రూపములో వున్న మారీచుని చంపి శ్రీరాముడు వెనుతిరిగి ఆశ్రమము వైపు వడివడిగా నడవసాగెను . ఆ మహానుభావుడు తన మనసులో "నాకు దుశ్శకునము లు కనిపించుచున్నవి . సీతాదేవి ఆశ్రమములో క్షేమముగానే ఉండును కదా !ఆ రాక్షసుడు మరణిస్తూ సీతా !లక్ష్మణా !అని బిగ్గరగా అరిచాడు . ఆ అరుపులు విని సీత నాకేదో ఆపద సంభవించిందని బయపడి లక్ష్మణుని నా వద్దకు తప్పక పంపును . అక్కడ ఆమె ఒక్కటే ఉంటుంది . "అని ఆలోచిస్తూ నడవసాగెను .
ఇంతలో దీనవధనుడైన లక్ష్మణుడు రాయుడికి ఎదురుపడెను . లక్ష్మణుని చూసిన రాముడు కంగారుపడి ,"లక్ష్మణా !మీ వదిన సీతను ఒక్కదాన్నే వదిలి నువ్వు ఎందుకు వచ్చావు ?"అని మందలించెను . అసురులు తిరిగే ఈ అరణ్యప్రాంతములో ఆమెను ఇలా వదిలి వచ్చుట క్షేమము కాదు . మనము చంపుటచే పగ పూనిన రాక్షసులు ఆమెను చంపుట తినివేయుట చేసివుండెను .
No comments:
Post a Comment