Thursday 6 July 2017

రామాయణము అరణ్యకాండ -నలుబది ఎనిమిదవసర్గ

                                     రామాయణము 

                                   అరణ్యకాండ -నలుబది ఎనిమిదవసర్గ 

సీతా దేవిని బయపెట్టుటకై అప్పుడు రావణుడు "ఓ సుందరీ !కుబేరుడు సవతి సోదరుడు . అతడిపై యుద్ధము గెలిచి ,అతడి లంకా నగరమును ,పుష్పకమును స్వాధీనము చేసుకున్నాను . అది ఎచ్చటికైనను పయనించగలదు . ఆకాశమార్గములో కూడా వెళ్లగలదు .  రాజధాని అగు లంకా నగరము చుట్టూ సముద్రముతో శత్రు దుర్భేద్యముగా ఉండును . ఆ నగరమంతయు బంగారము మణులతో అలంకరింపబడి శోభాయమానంగా ఉండును . నా చేతిలో ఓడిన కుబేరుడు కైలాస గిరిలో తలదాచుకొనెను . నీవు అచటికి వచ్చినచో అచటి వైభోగములు ,ఆనందములు చూసి రాముడిని తలవనైనాతలవవు . నా పరాక్రమము ముందు మానవమాత్రుడైన రాముడు ఏపాటికి సరికాడు . 
నేను సంస్థ రాక్షసులకు రాజుని . నా పేరు తలచినా ,నన్ను చూసినా దేవతలు ,గంధర్వులు .యక్షులు మానవులు మొదలగు సమస్త జాతుల వారు గడగడ వణుకుదురు . వాయువు ,సూర్యచంద్రులు ,అగ్ని సముద్రుడు కూడా నేనున్నచోట తమ ప్రతాపమును చూపించుటకు బయపడెదరు . నీ అదృష్టము కొలది నేను  చేరితిని . కనుక నన్ను శ్వీకరింపుము . "అని పలికెను ఆ నిర్జనవనప్రదేశమున రావణుడు ఇట్లు పలుకగా సీతాదేవి మిగుల కృద్ధురాలై కన్నులెర్రజేజుచు ఆ రాక్షసరాజుతో 
"సమస్త ప్రాణులకు పూజ్యుడు మహాత్ముడు అయిన కుబేరునికి సోదరుడవు అయివుండి కూడా ఇట్టి పాపకృత్యములు ఏల చేయుచున్నావు ?ఓ రావణా !నీవు క్రూరుడవు . ఇంద్రియసుఖలోలుడవు . నీ బుడ్డి పెడదారిన పట్టినది అట్టి నిన్ను ప్రభువుగా పొందిన రాక్షసులందరూ నీ మూలకంగా తప్పక నశింతురు . ఎవడైనను ఇంద్రుడి భార్య అయిన శచీదేవిని అపహరించి ప్రాణములతో ఉండవచ్చునో కానీ ,శ్రీరాముడి భార్య అయిన నన్ను అపహరించిన యెడల వారి ప్రాంమౌలా మీద ఆశ వదులుకోవలసినదే :అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ నలుబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  








 

No comments:

Post a Comment