రామాయణము
అరణ్యకాండ -అరువదిరెండవసర్గ
శ్రీరాముడు సీతకొరకు అంతటా వెతికి వెతికి సీతా !సీతా !అని బిగ్గరగా అరుచుచు ఏడవసాగెను . పిమ్మట అతడు లక్ష్మణుని పట్టుకుని "లక్ష్మణా !సీతను రాక్షసులు చంపివేసి ఉండును . లేకుంటే ఆమె న ఎదుటికి రాకుండా ఇంతసేపు ఉండదు . లక్ష్మణా !సీత లేకుండా నేను బ్రతకజాలను . నా మాట విని నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్లు . అచటికి వెళ్లిన పిదప భరతుని కౌగలించుకుని అయోధ్యను పరిపాలించమని నా ఆజ్ఞగా చెప్పు . తల్లులని జాగ్రత్తగా చూసుకో . ముఖ్యముగా కౌసల్యా మాత ను జాగ్రత్తగా చూసుకో "అని పలికెను .
No comments:
Post a Comment