రామాయణము
అరణ్యకాండ -ఏబది ఎనిమిదవసర్గ
రాముడు సీతాదేవికి ఏ ఆపద సంభవించిందో అని భయపడుతూ లక్ష్మణునితో కలిసి వడివడిగా ఆశ్రమమువైపు నడవసాగెను . ఆయన మిక్కిలి అలసిపోయినప్పటికీ సీతాదేవిపై కల అపారమైన ప్రేమ వలన ఆయన ఎచ్చటా విశ్రమించకుండా తన నడక సాగించెను . బడలిక చేత ఆయన ముఖము మిక్కిలి వాడి ఉండెను .
ఆ విధముగా రామ్లష్మణులు ఇరువురూ పరుగులాంటి నడకతో ఆశ్రమము చేరి సీతాదేవి కొరకు ఆశ్రమము అంతా వెతికేను . ఆశ్రమము చుట్టుపక్కలా ,సీతాదేవి తానూ కలిసి తిరిగిన విహారప్రాంతములు అన్నియు వెతికేను . కానీ ఫలితం శూన్యం . పిమ్మట శ్రీరాముడు సీతాదేవి కనిపించక క్షణకాలం శ్రీరాముడు నిస్చేస్తుడయ్యెను .
No comments:
Post a Comment