Saturday 8 July 2017

రామాయణము అరణ్యకాండ -నలుబదితొమ్మిదవసర్గ

                                       రామాయణము 

                                  అరణ్యకాండ -నలుబదితొమ్మిదవసర్గ 

 సీతాదేవి పలుకులు విని రావణుడు తీవ్ర అసహనమునకు లోనై చేతులు పిసుకుకొనుచు తన అసలు రూపమును చూపెను . 

అనంతరము సీతాదేవితో మరల గట్టిగా "ఓ సీతా !నీవు పతి వ్యామోహములో పడి నా సౌర్యపరాక్రమములు సరిగా వినినట్టులేవు . నేను నా భుజబలముతో ఈ భూమండలమును పైకెత్తగలను . సముద్రజలమును అమాంతం తాగెయ్యగలను . రణరంగమున నిల్చి మృత్యు దేవతను పరిమార్చగలను . నేను కోరుకొనిన రూపము ధరింపగలను . నీవు దేనిని కోరినా ఇవ్వగలను . కనుక నన్ను పతిగా శ్వీకరింపుము . "
అని పలికిన రావణుడి రూపము చూచుటకు భయంకరముగా ఉండెను . కళ్ళు అగ్ని గోళముల వలె ఉండెను . పళ్ళు పటపట కోరుకుచు "ఓ కల్యాణీ !నీకు తగిన భర్త నుం నేనే . కలకాలం నీవు నాతోనే ఉండిపొమ్ము . నిన్ను సంతోష పరుచుతూ ,నీ ప్రశంసలు పొందదగినవాడను . నీకు నేనెన్నడూ అప్రియము కలిగింపను . రాముడు అల్పాయుష్కుడు ,రాజ్యభ్రష్టుడు అతడిలో ఏమి గొప్పతనము చూసి అతడిపై అనురాగము కలిగివున్నావు . "ఇలా మాట్లాడి ఆ దుష్టుడు తన ఎడమ చేతితో సీతాదేవి తలను ,కుడి చేతితో ఆమె పాదములను పట్టుకుని ఆమెను ఎత్తుకొనెను . 

మృత్యువు వలె భయంకరుడైన ఆ రావణుని చూసి వనదేవతల కూడా భయముతో పరుగులు తీసిరి . అంతవరకూ అదృశ్యముగా వున్న రావణుని రధము అచట ప్రత్యక్షమయ్యెను . రావణుడు సీతాదేవిని ఆవిధముగా ఎట్టి రథముపై ఉంచెను . రావణుడు అట్లు తీసుకునిపోవుటకు సిద్దపడగా ఆ సీతాదేవి తన భర్తను స్మరించి 'రామా !రామా !అని బిగ్గరగా అరవసాగెను . కామార్తుడైన రావణుడు తనను తిరస్కరించుచుతప్పించుకొనుటకు  మెలికలు తిరిగితున్న సీతను పట్టుకుని రథములో ఆకాశములో ఎగరసాగెను . 
సీతాదేవి బిగ్గరగా ఏడ్చుచు రామా !లక్ష్మణా !అని బిగ్గరగా అరవసాగెను . రావణునితో "దుష్టుడా !ఆయువుతీరినవాడవై ఈ పాపకృత్యమునకు పాల్పడినావు . నీవు కష్టములపాలై మరణించుట తధ్యము . "అని పలికెను . ఇంకనూ "అయ్యో రాముడి భార్యనైన నన్ను ఈ దుర్మాత్ముడు తీసుకొనిపోవుచున్నాడు . ఇప్పుడు కైకేయి ఆమె యొక్క బంధువుల కోరికలు నెరవేరి వారి మనసులు కుదుటపడివుండవచ్చును . దండకారణ్యమున బాగుగా పుష్పించిన ఓ గన్నేరుమొక్కలారా !రావణుడు సీతను అపహరించిపోవుచున్నాడు అని వెంటనే రాముడికి తెలుపుము . ఓ గోదావరీ మాతా !నీకు నమస్కారము చేయుచున్నాను . నన్ను రావణుడు అపహరించాడని రాముడికి తెలుపుము . అంటూ కనిపించిన చెట్టుకూ పుట్టకూ మొక్కుతూ రాముడికి చెప్పమని విలవిలలాడుతూ ఏడవసాగెను . 

సీతాదేవి మిక్కిలి దుఃఖితయై దయనీయవచనములతో ఇట్లు విలపించుచు ఆ సమయమున చెట్టుపైకల జాటాయి పక్షిని చూసేను . ఆ జాతాయువుతో గద్గద స్వరముతో ఆక్రందించుచు "పూజ్యుడైన ఓ జటాయువు !పాపకర్ముడైన ఈ రాక్షసరాజు నన్ను అపహరించుకునిపోతున్నాడు . దయచూడుము . ఈ నిశాచరుడు క్రూరుడు . బలశాలి ,విజయగర్వంతో ఉన్నాడు . సాయుధుడు ,పైగా దుర్మాత్ముడు అట్టి ఇతనిని ఎదుర్కొనుట నీకు అశక్యము కావున నీవు శీఘ్రముగా వెళ్లి నన్ను అపహరించుకుపోవు విషయము రామలక్ష్మణులకు తెలుపు "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ నలుబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .    










 
 

No comments:

Post a Comment