Sunday 23 July 2017

రామాయణము అరణ్యకాండ -అరువదియొకటవసర్గ

                                          రామాయణము 

                                          అరణ్యకాండ -అరువదియొకటవసర్గ 

శ్రీరాముడు చుట్టుపక్కల అంతయు వెతికి తిరిగి ఆశ్రమమునకు వచ్చెను . అచట చెల్లాచెదురుగా పది వున్నదర్భలు ,ఆసనములను చూసేను . అప్పుడు ఆ మాహానుభావుడు లక్ష్మణుని గట్టిగా పట్టుకుని "లక్ష్మణా !సీత ఏమయిపోయినది . రక్కసులెవరైనా ఆమెను భక్షించి ఉండునా ?లేక అపహరించివుండునా ?సుకుమారి ఆ రాకుమారి కి ఎట్టి కష్టము వచ్చినదో కదా !ఆమె ఎడబాటు నేను తట్టుకొనలేక మరణించుట తధ్యము . పిమ్మట నేను ఊర్ధ్వ లోకములకు వెళ్ళినచో అచట మన తండ్రి "నేను విధించిన 14 ఏండ్లు అరణ్యవాసము పూర్తిచేయకనే ఇలా వచ్చితివి " నన్ను ఛీ కొట్టుట తధ్యము . "అని పలికెను . 
అప్పుడు లక్ష్మణుడు అన్న ను ఓదార్చుచు "అన్నా !వదినగారికిఎత్తి అపకారము జరిగివుండదు . కంగారు పడకుము . మనిద్దరమూ కలసి వదినగారిని వెతుకుదాము .  అరణ్యములో పూలు కోయుటకో లేక స్నానము చేయుటకో ,విహారమునకో వదినగారు వెళ్ళివుండవచ్చు "అని చెప్పెను . అయినను రాముడు ఊరడిల్లక "లక్ష్మణా !మనము ఇప్పుడే అరణ్యమంతా వెతికినాము కదా !సీత జాడ లభించలేదు "అని దీనవధానుడై చుట్టుపక్కల కళ్ళతోనే వెతుకుచు నిస్సహాయుడై కంట నీరు ధారగా కారుచుండగా సీతా !సీతా !అని అరుచుచు ఉండెను . 

రామాయణము అరణ్యకాండ అరువదియొకటవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  








 

No comments:

Post a Comment