Friday 28 June 2019

రామాయణము యుద్ధకాండ -పదిహేడవసర్గ

                                  రామాయణము 

                                     యుద్ధకాండ -పదిహేడవసర్గ 

విభీషణుడు ఆ విధముగా రావణునితో పలికి ,అక్కడ నుండి బయలుదేరి ,ఆకాశ మార్గములోనే ,రామలక్ష్మణులు సుగ్రీవాది వానరులు ఉన్న సముద్ర ఆవలి తీరమునకు చేరి ,ఆకాశములోనే నిలిచి తనను చూస్తున్న సుగ్రీవుడితో మిగిలిన వానరులతో "నా పేరు విభీషణుడు ,నేను రావణుని తమ్ముడిని ,పేరులో మాత్రమే కాక ప్రవర్తనలో కూడా దుర్మార్గుడైన ఆ రాక్షసుడు సీతాదేవిని అపహరించెను . దారిలో అడ్డు వచ్చిన జటాయువును చంపెను . నేను అనేకసార్లు అది మంచిపని కాదు ,సీతామాతను క్షేమముగా శ్రీరామచంద్రుడికి అప్పగించమని చెప్పివున్నాను . కానీ అతడు నా మాటలు పెడచెవిన పెట్టటమే కాకుండా నన్ను నానా దుర్భాషలాడేను . సభలో నన్ను అవమానించేను . అది తట్టుకోలేక నేను అతడిని వదిలి శ్రీరాముడిని శరణు వేడి ఆయన పక్షంలో చేరుటకు వచ్చి ఉన్నాను . ఈ విషయములు శ్రీరామునికి విన్నవించి ఆయన దర్శనమునకు నాకు అనుమతి ఇవ్వమని అడగండి "అని పలికెను . 
ఆ మాటలు విన్న సుగ్రీవుడు పరుగుపరుగున వెళ్లి శ్రీరామునికి విభీషణుడు వచ్చిన విషయము విన్నవించెను . పిదప శ్రీరాముడి ఆజ్ఞ మేరకు సుగ్రీవుడు విభీషుణుడు నమ్మదగినవాడు కాదని తెలిపెను , పిమ్మట శ్రీరాముడు మిగిలిన వానర ప్రముఖులను కూడా వారివారి అభిప్రాయములు తెలుపమని అడిగెను . అప్పుడు అక్కడ వున్న ప్రముఖులైన వానరులు ,జాంబవంతుడు తమతమ అభిప్రాయమును తెలిపిరి . చివరిలో హనుమ విభీషణుడిని నమ్మవచ్చునని తన అభిప్రాయమును తెలిపెను . 

రామాయణము యుద్ధకాండ పదిహేడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment