Saturday 31 December 2016

రామాయణము అయోధ్యకాండ -అరువదిమూడవసర్గ

                                      రామాయణము 

                                       అయోధ్యకాండ -అరువదిమూడవసర్గ    

తనయుడు దూరముఅగుటచే దశరథ మహారాజు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ,నిద్రాహారాలు మాని మాటిమాటికి రాముడిని కలవరిస్తూ ఉండెను . రాముడు అరణ్యమునకు వెళ్లిన 6వ రోజు రాత్రి తానూ చేసిన తప్పును గుర్తుతెచ్చుకుని కౌసల్యతో ఆ విషయమును ఈ విధముగా చెప్పనారంభించెను . 
"కౌశల్యా !ఎవరుచేసిన పాపఫలితమును వారు తప్పక అనుభవించవలసి ఉంటుంది . నేను చేసిన పాప ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను . నేను యవ్వనంలో వున్నప్పుడు, అప్పటికి మన వివాహము ఇంకా జరగలేదు . నేను యువరాజుగా ఉన్నాను . నన్ను చూసినవాఱందరు యువరాజు శబ్దవేది విద్యలో నిపుణుడు అని మెచ్చుకొనెడివారు . ఆ సమయములో ఒకరోజు రాత్రిపూట నేను నా శబ్దవేది విద్యను ప్రదర్శించవలెననే కోరికతో అరణ్యమునకు వేటకు వెళ్ళ్లాను . కటిక చీకటిలో పొదలమాటున కూర్చుని వున్నాను . అక్కడికి దగ్గరలో ఒక సరస్సు కలదు . పొదలమాటున కూర్చున్న నేను ,అణ్యములో సంచరించు జంతువుల అడుగుల చప్పుడు బట్టీ నా బాణములు ప్రయోగించి వాటిని చంపుతున్నాను . 
అప్పుడు అక్కడ దగ్గరలో వున్నా సరస్సులో నీటి చప్పుడు వినిపించింది . ఆ చప్పుడు ఏనుగు నీరుత్రాగిన చప్పుడుగా భ్రమించి విషసర్పము వంటి భయంకరమైన బాణమును ప్రయోగించాను . ఆ బాణము తగిలిన వెంటనే మనిషి అరుపులు "హా తల్లీ ,హా తండ్రీ !ఈ చీకటిలో ఎవడు నన్ను బాణముతో కొట్టెను ?నేను ఎవరికీ అన్యాయము చేసాను ?నేను చేసిన పాపమేమిటి ?"అని మాటలు వినిపించాయి ఆమాటలు విని నేను ఒక్క క్షణము అచేతుడను అయ్యాను .  ఆ క్షణము  లో నాకు ఏమిచేయాలో తోచలేదు . కాసేపటికి తేరుకుని వడివడిగా ఆ మాటలు వినపడిన ప్రదేశమునకు చేరుకొని చూడగా అక్కడ ఒక ముని కుమారుడు నా బాణము తగిలి రక్తపు మడుగులో పడి  వున్నాడు . అతడు నన్ను చూసి ఎవరునీవు ?నేను నీకు ఏమి అపకారము చేసాను . రాత్రిపూట కిరాతులు సైతము వేటాడారు అలాంటిది నీవు నన్ను ఎందుకు బాణముతో కొట్టావు ?మా తల్లితండ్రులు కాదు వృద్దులు గ్రుడ్డివారు వారి దాహము తీర్చుటకై ఇప్పుడు నేను ఇక్కడకు వచ్చాను . 
నేను చనిపోయిన విషయము కూడా వారికి చెప్పేది వారు లేరుకదా . నా మీదకల అపారమైన ప్రేమాభిమానముల కారణముగా వారును నేను మరణించిన పిదప మరణింతురు . నీవు ఒకే బాణమునకు మూడు ప్రాణములు తీసిన ఘనుడవు "అని పలుకగా నేను మిగుల దుఃఖిస్తూ "ఓ ముని కుమారా !నేను కావాలని నిన్ను కొట్టలేదు . ఏనుగు నీరు త్రాగుతున్నదని భ్రమించి బాణము వేసాను . నా దురదృష్టము కొద్దీ అది నీకు తగిలినది . అయ్యో !ఇప్పుడు నాకు భ్రహ్మహత్యా పాతకము చుట్టుకోబోనున్నది కాబోలు "అని నేను దుఃఖిస్తూ ఉండగా . ఆ ముని కుమారుడు 
"ఓ మాహారాజా !నీకు భ్రహ్మహత్యా పాతకము చుట్టుకొనదు . నేను బ్ర్రాహ్మణుడను కాను వైస్యుని వలన శూద్ర స్త్రీకి జన్మించాను . ముని వృత్తిని అవలింభించి వృద్ధులైన తల్లితండ్రులకు సేవ చేస్తూ జీవనము గడుపుతున్నాను . ఇక్కడకు దగ్గరలోనే మా తండ్రి ఆశ్రమము కలదు వారు నాకోసము దాహముతో ఎదురుచూస్తుంటారు . కావున నీటిని తీసుకెళ్లి వారికి ఇవ్వు . నీవు చెప్పకపోయినా దివ్యదృష్టిద్వారా జరిగినది తెలుసుకుని నీ వంశాన్నే శపించగలరు కావున నీవే వెళ్లి జరిగిన వృత్తాన్తమును వివరించుము . ఈ భాద ఓర్వలేకున్నాను . కావున ఈ బాణము తీసి పుణ్యము కట్టుకొనుము" . అని మిక్కిలి దీనంగా నన్ను వేడుకొనెను . ఆ ముని కుమారుని బాధ చూడలేక నేను ఆ బాంమౌను తీసివేయగా ఆమెని కుమారుడు ప్రాణములను వదిలివేసినాడు . అతడిని చూసి నేను మిక్కిలి విషాదమునకు గురి అయ్యాను . 

రామాయణము అయోధ్యకాండ అరువదిమూడవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Friday 30 December 2016

రామాయణము అయోధ్యకాండ -అరువది యొకటవసర్గ

                                       రామాయణము 

                                అయోధ్యకాండ -అరువది యొకటవసర్గ

రామ జననియైన కౌసల్య తనకు దుఃఖము తెచ్చిపెట్టిన ఆ మహారాజుపై కుద్దురాలై పలికిన పరుషవాక్యములు విని ఆ దశరధుడు మిగుల కృంగిపోయెను . "కౌశల్య పలుకులు సత్యములు చేయని దోషములు చేసితిని ఇపుడు చింతించి ప్రయోజనము ఏమున్నది ?అని అతడు చింతించసాగెను .   అలా చాలాసేపు ఏడ్చి ఈ పరిస్థితికి కారణమేమిటా ?అని ఆలోచిo చగా పూర్వము శబ్దబేది బాణము ద్వారా తెలియక తానూ చేసిన దుష్కృత్యము గుర్తుకు వచ్చెను ,  కౌశల్యతో  ఓ కౌశల్యా నీకు అంజలి ఘటించి వేడుకుంటున్నాను . నా పట్ల ప్రసన్నురాలివి కమ్ము . నేను కావాలని ఇదంతా చేయలేదు . జరిగిన దానికి నేనును జీవచ్ఛవంలా వున్నాను . ఈ పరిస్థితిలో నన్ను ఇలా తూలనాడడం న్యాయమా ?కైకేయిని కన్నెత్తి చూచుటకు కూడా నేను ఇష్టపడుటలేదు . నిన్ను దోసిలి ఒగ్గి అర్ధిస్తున్నాను . నన్ను క్షమించు "అని పలుకుతూ ఎడ్వానారంభించెను . 
ఆ మాటలు విన్న కౌసల్య తానూ చేసిన పనికి పశ్చాత్తాపపడి భర్త దోసిలి పట్టుకుని "భాదతో కోపముతో పిచ్చిదానినై ఎదో తెలియక మాట్లాడాను . కోపముతో వున్నా వారికి యుక్తాయుక్త విచక్షణ ఉండదు అంటారు . కనుక నేను పలికిన పలుకులకు నన్ను క్షమించండి . రాముడు అరణ్యవాసమునకు వెళ్లి నేటికీ 5 దినములు పూర్తి అయినది . నాకు 5 సంవత్సరములు గడిచినట్లుగా వున్నది . "అని పలికెను . 
సూర్యాస్తమయము అయి రాత్రి అయినది కౌసల్య మాట్లాడిన మాటలకు దశరధుడు కొంత ఊరడిల్లి దశరధుడు     నిద్రించెను . 

రామాయణము అయోధ్యకాండ అరువది యొకటవసర్గ సమాప్తము . 



శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



రామాయణము అయోధ్యకాండ -అరువది యొకటవసర్గ

                                     రామాయణము 

                                అయోధ్యకాండ -అరువది యొకటవసర్గ 

కౌసల్య దేవి ఏడుస్తూ తన భర్తతో "ఓ మహారాజా !రఘువంశుడైన దశరధుడు మిక్కిలి దయాళువు ,ఉదారపురుషుడు ,ప్రియభాషి అని ముల్లోకములలో మీ ఘానా కీర్తి వ్యాపించినది . కానీ  అడవులకు పంపి అంతకు మించి అపకీర్తి మూటకట్టుకున్నావు . సుఖములలో పుట్టి పెరిగిన రామలక్ష్మణులు దుఃఖములపాలై సీతతోకూడి అడవులలో కష్టములను ఎట్లు సహించుచున్నారో ?యవ్వనము అడుగిడిన సీత మిక్కిలి సుకుమారురాలు . సుఖములను అనుభవించవలిసిన ఈ తరుణములో ఆ జనక నందని చలికి ,ఎండకు  ఎలా తట్టుకోగలరు ?ఆమె ఇక్కడ రుచికరమైన ఆహారమును తింటూ ఆహ్లాదంగా సంగీతము వింటూ ఉండేది . అక్కడ కందమూలాదులను తింటూ భయంకరమైన మృగములను గర్జన వింటూ ఎంత భయపడుతోందో ?
శ్రీరాముడు మెత్తని దిండ్లను తలకింద పెట్టుకుని నిద్రించేవాడు . ఇప్పుడు కఠిన శిలలపై తన చేతినే తలగడగా చేసుకుని ఎలా నిద్రించుచున్నాడో ?శ్రీరాముని ముఖము పౌర్ణమి చంద్రుడు వలె ఎంతో చూడముచ్చటగా ఉండును అటువంటి మోమును మల్లి చూడగలనో  లేదో ? హృదయము వజ్ర  సమానమయినది . కావుననే శ్రీరాముడు దూరమైనను ముక్కలుకాక ఇంకను సజీవంగా వున్నది . ఓ రాజా !నీవు కైకేయి చెప్పుడు మాటలు విని ఏ మాత్రము ముందువెనకాలు ఆలోచించక జాలిలేనివాడవై సీతారామలక్ష్మణులు అడవుల పాలు చేసితివి . ఆ చిన్నారులు నీకారణముగా ఇప్పుడు అరణ్యములో దీనులై తిరుగుచున్నారు . 
శ్రీరాముడు   పదునాలుగు సంవత్సరములు వనవాసము పూర్తిచేసి వచ్చిన పిమ్మట భరతుడు ,కైకేయి రామునికి రాజ్యము ఇచ్చునో లేదో ,లేక వారు ఇచ్చినా రాజ్యమును రాముడు స్వీకరించునో లేదో?భార్యకు భర్తే రక్షణ నీవు కైకేయి మోజులోపడి  నన్ను పట్టిచ్చికోనప్పుడు నాకు రాముడే దిక్కు ఇప్పుడు నాకు ఆదిక్కును కూడా లేకుండా చేసావు . అన్ని విధములుగా నన్ను మృతప్రాయను చేసావు . నీవు చేసిన పని ఫలితముగా కేవలము నీ ముద్దులాభార్య కైక ,ఆమె కుమారుడు భరతుడు మాత్రమే సంతోషముగా వున్నారు . "అని పలికెను . 
కౌశల్య మాటలు విన్న మహారాజు మిగుల దుఃఖితుడై రామా !రామా !అని కలవరించుతూ ఏడవసాగెను . 

రామాయణము అయోధ్యకాండ అరువది యొకటవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Thursday 29 December 2016

రామాయణము అయోధ్యకాండ -అరువదియవసర్గ

                                    రామాయణము 

                             అయోధ్యకాండ -అరువదియవసర్గ 

అనంతరము కౌశల్యా దేవి భూతము ఆవహించినదానివలె పదేపదే వణుకుచు ప్రాణములేనిదాని వలె నేలపై పది సుమంత్రునితో "ఓ సుమంత్రా !సీతారామలక్ష్మణులు లేని ఈ అయోధ్యలో క్షణమైనా ఉండలేను . కనుక నన్ను వారి వద్ద దింపుము . వెంటనే రధమును వెనుతిప్పుము "అని పలుకుతూ బిగ్గరగా రోదించనారంభించెను . ఆమె మాటలు విన్న సుమంత్రుడు 
అమ్మా !సీతారామలక్ష్మణుల గూర్చి నీవు బాధపడవలిసిన  అవసరము లేదు . లక్ష్మణుడు ఎల్లప్పుడూ అప్రమత్తుడై శ్రీరామ పాదసేవ చేయుచున్నాడు . సీతా దేవి తన మనసు నందు రాముని నిలుపుకుని ఆ అరణ్య ప్రాంతములో సైతము అంతఃపురము వలె సంతోషముగా (భర్త చెంత వున్న కారణముగా )తిరుగుచున్నది . ఆమె అచట ఏమాత్రము ఇబ్బంది పడుటలేదు . రామలక్ష్మణులు నారచీరలు జటలు ధరించి మహర్షుల మార్గమును అనుసరించుచున్నారు . అచట లభించు కందమూలాదులనే సంతోషముగా శ్వీకరించుతున్నారు . తండ్రిగారి సత్య ప్రతిజ్ఞ నెరవేర్చుతున్నారు . పితృవాక్య పరిపాలనకు రూపమైన శ్రీరాముని చరితము ఆచంద్రార్కము నిలిచి ఉండును . "అని పలికెను . 
సుమంత్రుడి  మాటలు విన్నను కౌశల్యాదేవి శోకము వీడక రామా !,లక్ష్మణా !,సీతా !అని కలవరించుచు శోకమునే ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ అరువదియవ సర్గసమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




రామాయణము అయోధ్యకాండ -ఏబది తొమ్మిదవసర్గ

                                 రామాయణము 

                        అయోధ్యకాండ -ఏబది తొమ్మిదవసర్గ 

సుమంత్రుడు మాటలు విన్న దశరధుడు తిరిగి సుమంత్రుడితో "ఇంకనూ శ్రీరామలక్ష్మణుల గూర్చి నాకు తెలుపుము . రాముడు ని తప్ప ఏమి చూచుటకు నా మనసు అంగీకరించుటలేదు . రాముని గూర్చి తప్ప వేరే ఏ విషయములు వినుటకు నా వీనులు సిద్ధముగా లేవు . కావున నాకు ఇంకనూ వారి గుఱించి తెలుపుము " పలుకగా 
సుమంత్రుడు "ప్రభూ రామలక్ష్మణులు జటలను ,నారచీరలు ధరించి మునుల వలె వనములో ప్రవేశించిరి . లక్ష్మణుడు అప్రమత్తుడై తన అన్నావదినలకు నిరంతరమూ అప్రమత్తుడై సేవచేయుచు ఉండెను . ఆ అరణ్యములో ముందు లక్ష్మణుడు ,మధ్య సీత ,వెనుక రాముడు నడుస్తూ వెళ్లిరి . వారిని చూసి నేను చేసెడిది లేక తిరుగుముఖం పట్టితిని . నన్ను తన సేవకు రమ్మని  వన వాసులచేత కబురుచేస్తారేమో అని పెక్కు కాలము గుహుని వద్దే ఎదురు చూసితిని . ఆయన చిత్రకూటములో నివాసము ఏర్పరుచుకున్న విషయము తెలిసిన తరువాతనే నేను వెనుతిరిగి వచ్చితిని . రధాశ్వములు రాముడు లేని కారణముగా ముందుకు సాగుటకు మొరాయించినవి . అయోధ్యలోని జనులంతా దీనవధానులై కాళీ రధమును చూచుచుంటిరి . "అని పలుకగా 
దశరధుడు "దుష్టస్వభావము కల కైక ఈ విషయములో నన్ను మిక్కిలి వత్తిడి చేసెను . దీని గురించి ఆలోచనాపరులైన పెద్దలను కానీ ,మిత్రులను కానీ ,అమాత్యులను కానీ వేదశాస్త్ర పండితులను కానీ ,మేధావులైన పురప్రముఖులను కానీ సంప్రదించలేదు . స్త్రీ వ్యామోహములో పది తొందరపడి ఈ దుష్కార్యమునకు పాల్పడితిని . ఓ సుమంత్రా !ఇట్లు జరగవలెనని వున్నది కాబోలు . ఈ రాజ్యము ఇంకా నా ఏలుబడిలో ఉన్నట్లయితే నాకు రాముని చూడవలెనని వున్నది వెనువెంటనే రాముని ఇక్కడకు తీసుకురా .  కానీ పక్షములో నన్ను అక్కడకు తీసుకువెళ్ళు . నా బంగారు కొండ రాముడు ఇప్పుడు ఎక్కడఉన్నాడో ? ఎన్ని కష్టాలు పడుతున్నాడో ?శ్రీరాముని చూడకపోయినచే నేను చనిపోవుట తధ్యము . అని అపారమైన దుఃఖసాగరమున మునిగిన దశరధుడు కౌసల్యతో 
"కౌశల్యా శ్రీరాముడు దూరమగుటచే నేను శోక సాగరమున మునిగితిని . ఆ దుఃఖ సాగరము అంతకంతకూ పెరిగి నన్ను దహించివేయుచున్నది . నాకు ఈ క్షణమే సీతారామలక్ష్మణులను చూడవలెనని వున్నది . కానీ నా పాప ఫలితముగా ఆ భాగ్యము నాకు దొరకుటలేదు "అని విలపించుచు దశరధుడు మూర్చితుడయ్యెను . ఆయన మాటలు విన్న కౌశల్య ఎంతయో భయపడెను . 

రామాయణము అయోధ్యకాండ ఏబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



 

Wednesday 28 December 2016

రామాయణము అయోధ్యకాండ -ఏబది ఎనిమిదవసర్గ

                        రామాయణము 

                 అయోధ్యకాండ -ఏబది ఎనిమిదవసర్గ 

 కొంతసేపటికి తేరుకున్న దశరధ మహారాజు శ్రీరాముని గురించి తెలుసుకొనుటకు సుమంత్రుడిని తనవద్దకు పిలిపించి "సుమంత్రా !అల్లారుముద్దుగా పెరిగిన నా గారాల కుమారుడు శ్రీరాముడు ఆ ఘోరారణ్యములో ఎక్కడ ఆసీనుడవుతున్నాడు . ఎక్కడ పరుండుతున్నాడు . ఏ ఆహారము తింటున్నాడు . అరణ్యములోకి వెళ్లునప్పుడు శ్రీరాముడు ఏమి చెప్పెను ? జనకుని ముద్దుల కూతురు సీత ఏమన్నది ?లక్ష్మణుడు ఏమనెను ?"అని అడిగెను . 
అప్పుడు సుమంత్రుడు "ప్రభూ !శ్రీరాముడు అరణ్యములో బండరాళ్ళమీద ఆసీనుడవుతున్నాడు . నేలపై తృణశయ్యపై నిద్రిస్తున్నాడు . శ్రీరాముడు నన్ను వీడి వెళ్లునప్పుడు మీకు సాష్టాంగ నమస్కారము చేశానని చెప్పమన్నాడు . తల్లులను కుశలమడమన్నాడు . భరతుడిని రాజ్యభారం జాగ్రత్తగా వహించి తల్లులను తండ్రిని జాగ్రత్తగా చూసుకొనమని చెప్పమన్నాడు . ఇంకనూ ధర్మబద్ధముగా నివసిస్తానన్నానని చెప్పు అని పలికెను . ఇక విదేహానందని ఏమి మాట్లాడక భర్తను చూచి కన్నీటిపర్యంతమయ్యెను . లక్ష్మణుడు మాత్రము మహారాజు తన మాటకు తిరుగులేదనా ఈ నిర్ణయము తీసుకొనెను . ఈ నిర్ణయము నేను అంగీకరింపను . ఇది అధర్మము . మహారాజు కైకేయి మోహములో పడి కన్నకొడుకుని అడవులపాలు చేసెను . ఇకనుండి రాముడే నాకు తండ్రి సమస్తము అని పలికెను . "
అని సుమంత్రుడు దశరధ మహారాజుతో చెప్పెను . 

రామాయణము అయోధ్యకాండ ఏబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము అయోధ్యకాండ -ఏబదియేడవసర్గ

                             రామాయణము 

                        అయోధ్యకాండ -ఏబదియేడవసర్గ 

సీతారామలక్ష్మణులు గంగను దాటి వారు కనుమరుగయ్యేవరకు సుమంత్రుడు ,గుహుడు చూస్తూనే ఉండి ,వారు కనుమరుగయిన  పిదపవారిరువురు గుహుని ఇంటికి చేరి సీతారాంలక్ష్మణుల గురించి చర్చించుకొనిరి . సీతారామలక్ష్మణులు గంగను దాటుట ,భారద్వాజమాశ్రమాన్ని దర్శించుట ,పిదప చిత్రకూటము చేరుకొనుట మున్నగు విషయములన్నీ గుహుడు తన దూతల ద్వారా తెలుసుకొనెను . గుహుని ద్వారా ఆ సమాచారాన్ని సుమంత్రుడు తెలుసుకుని అయోధ్య కు తిరుగు ప్రయాణమయ్యెను . 
రాముడు లేక కాలి రధముతో వెళ్లిన తనను అయోధ్యావాసులు రాముడేడి అని అడిగితే ఏమి సమాధానము చెప్పగలను? అని తలచుకుని మిక్కిలి చింతించుచు 3 రోజులకు అయోధ్యకు చేరెను . రాముడు లేని అయోధ్య శూన్యములా కనిపించెను . శూన్యముగా వున్న రధమును చూసి ప్రజలు రాముడెక్కడ ?రాముడెక్కడ ?అని అడుగుతూ రధము వెంట పరుగులు తీయగా సుమంత్రుడు "నేను తనవెంట వస్తానన్నా వినకుండా అయోధ్యకు వెళ్ళు అని ఆ స్వామి పదేపదే చెప్పుటచే తప్పక నేను తిరిగి వచ్చాను . వారు గంగను దాటి ఆవలి తీరమునకు చేరిరి "అని చెప్పెను . 
సుమంత్రుడు మాటలు విన్న ప్రజలు మిక్కిలి దుఃఖితులై భోరుభోరున ఎడ్వసాగిరి . వారి ఆక్రన్దనలు విని తట్టుకోలేక సుమంత్రుడు వేగముగా రధమును నడిపి దశరధుని అంతః పురములో ప్రవేశించెను . అక్కడ కూడా అందరూ దీనవధనులై ఉండిరి . దశరధ మహారాజు మిక్కిలి కృంగిపోయి ఉండెను . సుమంత్రుడు ఆయనను చేరి జరిగిన వృత్తాన్తమును ఆయనకు వివరించెను . ఆ మాటలు విన్న దశరధుడు ఏడుస్తూ నేలపై పడి స్పృహ కోల్పోయెను . కౌశల్య మిగిలిన స్త్రీలతో కలసి దశరధుని లేపి పరుండబెట్టెను . కొంతసేపటికి తేరుకున్న దశరధుడు దుఃఖ భారంతో ఏమి మాట్లాడలేకపోయెను . అది చూసిన కౌశల్యా దేవి" మహారాజా !మీరు కైకేయి కోసము రాముని అడవులకు పంపారు . అతడు అక్కడ కష్టపడుతుంటాడు మీరు మీ ముద్దుల భార్యతో ఇక్కడ హాయిగా వుండండి . కనీసం రాముడు ఎలావున్నాడని అడగడానికి కూడా మీ నోరు రావడంలేదా ?కైకేయి అంటే మీకు భయము అనుకోవడానికి ఇక్కడ కైకేయి లేదుకదా . కనుక మీరు నిర్భయముగా సుమంత్రుడితో మాట్లాడవచ్చును . "
ఆ మాటలు విన్న దశరధుడు నేలపై పది ఏడవసాగెను . అది చూసిన అంతః పుర స్త్రీలు బిగ్గరగా ఎడ్వాసాగిరి . వారి ఏడ్పులు విని అయోధ్య ప్రజలుసైతం ఎడ్వాసాగిరి . ఆ విధముగా ఆ క్షణమున సమస్త అయోధ్య ఏడ్పులతో నిండిపోయెను . 

రామాయణము అయోధ్యకాండ ఏబదియేడవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


 






 

Tuesday 27 December 2016

రామాయణము అయోధ్యకాండ -ఏబదిఆరవసర్గ

                                          రామాయణము 

                                 అయోధ్యకాండ -ఏబదిఆరవసర్గ 

చక్కగా విశ్రమించిన తర్వాత సీతారాములు నిద్రలేచిరి . రాముడు లక్ష్మణుని నిద్రలేపేను . వారు మువ్వురు నిద్ర బడలిక తీర్చుకుని తిరిగి చిత్రకూట పర్వతము వైపు తమ ప్రయాణమును కొనసాగించిరి . ఆ దారి అత్యంత రామణీయముగా ఉండెను . మోదుగ చెట్లు విరబూసి తమ పూలను తామే మాలలుగా ధరించినట్లుగా వున్నవి చెట్లు కోసేవారు లేక పండ్లతో నిండి ఉండెను . ప్రతి చెట్టుకు తేనెతుట్టలు కలవు . 
సీతారామలక్ష్మణులు ఆవిధముగా ప్రకృతి దృశ్యములకు ముగ్దులవుతూ చిత్రకూటపర్వతము వద్దకు చేరుకొనిరి . ఆ పర్వత శోభను చూసి రాముడు పరమానందభరితుడయ్యాడు . అక్కడనే కల వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు వెళ్లి ఆయనకు ప్రణామము చేసి తమను తాము పరిచయము చేసుకొనిరి . వాల్మీకి మహర్షి వారిని సాదరముగా ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసెను . అక్కడ ఇంకను అనేకమంది మునుల ఆశ్రమములు కలవు . వాటికి దగ్గరలోనే ఎట్టయిన చిత్రకూటము మీద ఒక పర్ణశాలను నిర్మించమని రాముడు లక్ష్మణుని ఆదేశించెను . 
అన్నగారి ఆజ్ఞను అనుసరించి ఎండకు ,వానకు తట్టుకుని దృఢముగా నిలబడేలా ఒక దృఢమైన ,సుందరమైన పర్ణశాలను లక్ష్మణుడు నిర్మించెను . దానిని చూసిన రాముడు లక్ష్మణుని మెచ్చుకొనెను . రాముడు గృహాప్రేవేశమునకు విధ్యుక్తముగా చేయవలసిన హోమాది కార్యక్రమములను కావలిసిన వస్తువులను చెప్పి వాటిని తీసుకురమ్మని లక్ష్మణుని ఆదేశించెను . లక్ష్మణుడు అన్నగారు చెప్పిన వస్తువులను ఎంతో శ్రద్దా భక్తులతో సమకూర్చెను . అప్పుడు సీతారాములు విధ్యుక్తముగా చేయవలసిన హోమాది సకల కార్యక్రమములను త్రికరణ శుద్ధిగా ఆచరించి ఆ పర్ణశాలనందు ప్రవేశించిరి . 
ఎత్తయిన చెట్లతో ,ఏనుగుల గుంపులతో వివిధ రకాల పక్షులు ,మృగములు గుంపులు గుంపులుగా తిరుగుతున్న ,మందాకినీ నాదీ తీరమున కిలకిల పక్షులరావాలతో  పరమ రామణీయముగా ఉన్న ఆ చిత్రకూట పర్వతము మీద ఆ సీతారాములు హాయిగా విహరించుచు ఉండిరి . 

 రామాయణము అయోధ్యకాండ ఏబదిఆరవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ (తెలుగు )తెలుగుపండితులు . 



Monday 26 December 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబదియైదవసర్గ

                                           రామాయణము 

                                           అయోధ్యకాండ -నలుబదియైదవసర్గ 

శత్రు సంహారకులైన రామలక్ష్మణులు భారద్వాజముని ఆశ్రమములో ఆ రాత్రి గడిపి మరునాడు ఉదయము ఆ మునికి వీడ్కోలు పలికి ఆయన చెప్పిన చిత్రకూటము వైపు తమ ప్రయాణము సాగించిరి . పుతృడిని సాగనంపు తండ్రి వలె భారద్వాజముని శ్రీరాముడిని  చాలా దూరము అనుసరించెను . ప్రయాణ మార్గమును వివరించెను . గంగా యమునా సంగమము నుండి దక్షిణముగా సాగి యమునా నదిని దాటి అక్కడ కల శ్యామము అను పేరు కల మర్రి చెట్టుకు సీతాదేవిని నమస్కరించి శుభాశీస్సులు పొందమనిచెప్పెను , ఇంకా ముందుకు వెళ్లవలిసిన మార్గమును వివరించెను . 
ఆ విధముగా మార్గమును వివరించి పెక్కు దూరము అనుసరించి ఆ భరద్వాజముని వెనుతిరుగుటకు ఆగెను శ్రీరాముడు ఆయనకు నమస్కరించి వీడ్కోలు పలికెను . ఆయన చెప్పిన మార్గములో ముందుకు వెళ్తూ యమునా నదిని దాటుటకు నావను తయారుచేసుకుని అందు సీతాదేవి వస్త్రాభరణములు ,తమ తట్ట ,గుణపాము మొదలగు వస్తువులను పెట్టుకుని యమునను దాటిరి . అక్కడ నుండి కొంత దూరము ప్రయాణము చేసిన పిమ్మట నల్లని వర్ణము కల మఱ్ఱిచెట్టు కనిపించెను . సీతాదేవి దానికి ప్రదక్షిణ నమస్కారములు చేసెను . 
పిమ్మట ముందుకు సాగిరి అక్కడి ప్రక్రుతి పరమ రామణీయముగా వున్నది . అక్కడ తనకు కొత్తగా అందముగా కనిపించిన పూలను ,తీగలను సీత కోరుతుండగా రాముడు వాటిని తెచ్చిస్తూ ఉండెను . అలా ముందుకు సాగుతూ యమునా నాదీ తీరములో కందమూలాదులను భుజించి సమతల ప్రదేశములో నిద్రించెను . 

రామాయణము అయోధ్యకాండ నలుబది అయిదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





 

Sunday 25 December 2016

రామాయణము అయోధ్యకాండ -ఏబదినాలుగవసర్గ

                                     రామాయణము 

                                  అయోధ్యకాండ -ఏబదినాలుగవసర్గ 

సీతారామలక్ష్మణులు ఆ వృక్ష సమీపమున ప్రశాంతముగా విశ్రాంతి తీసుకొనిరి . ప్రాతః కాలమున బయలుదేరి గంగా యమునా నదుల తీరమున కల ప్రయాగ దగ్గరలోని భారద్వాజముని ఆశ్రమము వైపు నడవసాగిరి . మధ్యాహ్న సమయము వరకు నడవగా ఆశ్రమము చేరువకు చేరుకొనిరి . ఆశ్రమము వద్దకు వెళ్లి అనుమతి పొంది పర్ణశాలలో ప్రవేశించి మునికి నమస్కారము చేసిరి . 
పిమ్మట తమను తాము పరిచయము చేసుకొనిరి . భారద్వాజముని వారిని ఆశ్రమములోకి సాదరముగా ఆహ్వానించి వారికి అతిధి మర్యాదలు చేసిరి . శ్రీరాముడు భారద్వాజ మునితో" జనావాసమునకు దగ్గరగా ఉంటే వారు నిరంతరము దర్శనమునకు వచ్చెదరు . కావున జనములకు దూరముగా ప్రశాంత వనవాసము చేయగోరుతున్నాను . కావున అటువంటి ప్రదేశము ఏదేని ఉంటే తెలుపుడు "అని పలికెను . 
అపుడు ఆ ముని "రఘుకుల తిలకా !ఇక్కడికి దగ్గరలో చిత్రకూట పర్వతము అనే పర్వతము కలదు . అక్కడ వివిధ  జలపాతములు ,కోకిలస్వరములు ,జింకల గుంపులు ,మదగజములతో మిక్కిలి రమణీయముగా ఉండును . అది మీకు శ్రేయస్కరము ". అని పలికెను . సుఖముగా పెరిగిన సీతారాములు బడలిక చేత ఆరోజు రాత్రి భారద్వాజాశ్రములో విశ్రమించిరి . ప్రాతః కాలమున లేచి భారద్వాజముని చెప్పిన చిత్రకూట పర్వతము చేరుటకు సన్నద్దులయ్యిరి . 

రామాయణము అయోధ్యకాండ ఏబదినాలుగవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు )తెలుగు పండితులు . 









Friday 23 December 2016

రామాయణము అయోధ్యకాండ -ఏబది మూడవసర్గ

                                      రామాయణము 

                                  అయోధ్యకాండ -ఏబది మూడవసర్గ 

 శ్రీ రాముడు ఆ విధముగా కంద మూలాదులను భుజించి ,లక్ష్మణుడితో "లక్ష్మణా !మనము శయనించుటకు కావలిసిన శయ్యను ఇన్నాళ్లు సుమంత్రుడు సిద్దము చేసెను . ఇక నుండి మనమే మనకు కావసిన శయ్య మొదలగు వసతులను ఏర్పాటుచేసుకొనవలెను . అంతే కాక మన రక్షణ భాద్యత కూడా మనమే జాగరూపులమై వహించవలెను . ముఖ్యముగా సుకుమారి అయినసీతాదేవిని అప్రమత్తముగా కాపాడుకోవలెను . ప్రస్తుతము గడ్డి మొదలయినవాటితో శయ్యను ఏర్పాటు చేసుకొనెదము "అని పలికెను . 
తిరిగి అయోధ్యలోని పరిస్థితులను ,తాళులను ,దశరథ మహారాజును తలుచుకుని మిక్కిలి వ్యాకులచిత్తుడై ఇలా పలికెను . "లక్ష్మణా !మన తండ్రి దశరధుడు శయ్యపై ఎంతో బాధపడుతూ ఉండి వుంటారు . ఆ కైకేయి భరతుడి కోసం రాజుగారిని బతకనివ్వదేమో ?తలుచుకుంటేనే నాకు మనసు నిలవడంలేదు . మా మాత కౌశల్య ఎంతో  స్వభావురాలు . ఆమెను కావాలని ఆ కైక అందరి ముందు అవమానిస్తూ వుంది ఉండచ్చు . ఆ అవమానము లన్నీ భరిస్తూ ఆవిడ ఎలా బతకగలదో నాకు అర్ధము కావడంలేదు . ఇక సుమిత్రామాత కూడా మాతల్లి వలె నెమ్మదస్తురాలు . ఆమె ,నీవు నాకు మాతల్లికి సహాయముగా ఉన్న కారణముగా ఆమెను కూడా తన అధికారంతో ,సూటిపోటి మాటలతో గర్విష్టి అయినా కైక భాదిస్తూ ఉన్నదేమో ?
ఈ ఆలోచనలు నా మనసులో తిరుగుతుండగా నేను ఇక్కడ నిలవలేకపోతున్నా . లక్ష్మణా!ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే నీవు వెనువెంటనే బయలుదేరి అయోధ్యకు వెళ్లి ఆ వృద్ధులైన మన తల్లితండ్రులను జాగ్రత్తగా చూసుకొనుట మంచిదని నాకు అనిపిస్తోంది . కావున నీవు కష్ణమైనా ఆలోచించక బయలుదేరుము  . "అని పలికెను . అప్పుడు లక్ష్మణుడు "అన్నా !దశరథ మహారాజును జాగ్రత్తగా చూసుకొనుటకు ఆయన భార్యలు అయిన మన తల్లులు అప్రమత్తముగా వుంటారు . మన తల్లులను ఊరడించుటకు అంతః పురములో పెక్కు మంది మంచి మనసు కలవారు కలరు . కావున వారి గురించి వ్యాకుల పడవలసిన అవసరము లేదు . మిమ్ములను సీతామాతను ఒంటరిగా వదిలి అయోధ్యకు వెళ్ళలేను . కావున నాకు మీతో ఉండుటకు అనుమతిని ఇవ్వుము . "అని పలికెను . 
లక్ష్మణుడి మాటలకు ఊరడిల్లిన శ్రీరాముడు లక్ష్మణుడు తనతో అరణ్యవాసము చేయుటకు అనుమతిచ్చేను . రఘు వంశ వర్ధనులు ,మహా బలశాలురు అయిన రామలక్ష్మణులు ఆ నిర్జన ప్రదేశములో ఎత్తిభయము లేక పర్వత సానువులందు స్వేచ్ఛగా తిరిగాడు సింహములవలె సంచరించుచుండిరి . పిదప లక్ష్మణుడు ఏర్పరిచిన తృణ శయ్యపై సీతారాములు పరుండిరి . 

రామాయణము అయోధ్యకాండ ఏబదిమూడవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Thursday 22 December 2016

రామాయణము అయోధ్యకాండ -ఏబదిరెండవసర్గ

                                      రామాయణము 

                                       అయోధ్యకాండ -ఏబదిరెండవసర్గ 

ప్రాతః కాలమున సీతారాములు నిద్రలేచేను . రాముడు లక్ష్మణుని పిలిచి గంగా నది దాటుటకు ఏర్పాట్లు చేయమని చెప్పెను . లక్ష్మణుడు చేప్పడముతో ఆ ఏర్పాట్లు అన్నీ గుహుడు చేసెను . శ్రీ రాముడు సుమంత్రుని ఇక అయోధ్యకు వెళ్ళమని చెప్పెను . ఆ మాటలు విన్న సుమంత్రుడు కన్నీరుమున్నీరయ్యేను . శ్రీ రామునీతో సుమంత్రుడు 
"స్వామీ !నేనును మీ వెంట అరణ్యములకు వచ్చెదను . మీకు ముందుగా రధము నడుపుతూ మీకు క్రూరజంతువుల నుండి హాని కలుగకుండా రక్షణ చేసెదను . దయచేసి కాదనకుము . మీరు లేను అయోధ్యలో బతుకలేను . జనులు అడిగే ప్రశ్నలకు సమాధానము చెప్పలేను . వారి బాధ చూడలేను . ఆ దుష్ట కైకేయి ముందు చేతులు కట్టుకుని ఆమె ఆజ్ఞలను నిర్వర్తించలేను . కావున నేను కూడా మీతో ఉండి వనవాస సమయములో అత్యంత జాగరూకుడనై మిమ్ము రక్షించుకుని సమయము అయిన పిమ్మట అయోధ్యకు చేరెదను "అని పలికెను . 
అపుడు రాముడు "సుమంత్రా !అయోధ్య మంత్రులందరిలో నీవు ఉత్తముడవు . సుమంత్రా !నిన్ను అయోధ్య కు పంపుటకు కల ముఖ్య కారణము . నీవు కాలి రధముతో అయోధ్య కు వెళ్తేనే కైకేయి నేను అరణ్యాలకు వెళ్లానని పూర్తిగా నమ్ముతుంది . దశరథ మహారాజు నేను దగ్గర లేకపోవడంతో ఆయన దుఃఖభారములో మునిగిపోయి వుండివుంటారు . నీవు అక్కడి పరిస్తుతులు అన్నీ క్షుణ్ణముగా తెలిసినవాడివి . నీవు ఆయనకు తోడుగా ఉంటే నాకు కొంత ధైర్యముగా ఉంటుంది "అని పలికెను . శ్రీ రాముని మాటలు విన్న సుమంత్రుడు కన్నీరు మున్నీరు అయ్యెను .  . శ్రీరాముడు గుహునితో "మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము జటా ,వల్కల దారినై వనవాసము చేయవలెను . వల్కలములు అయోధ్యనుండి ధరించి వచ్చితిని . ఇప్పుడు జతలు ధరించుటకు మర్రి పాలు తెప్పింపుము "అని కోరగా గుహుడు అట్లే తెప్పించెను . వాటితో రామలక్ష్మణులు జటలు ధరించెను . అప్పుడు వారు చూచుటకు మునుల వలె చూడముచ్చటగా ఉండిరి . 
 గుహుడు నావను సిద్దము చేయగా సీతారామలక్ష్మణులు అందు ఎక్కెను . శ్రీరాముడు గుహునికి ,సుమంత్రునికి వెళ్ళుటకు అనుజ్ఞను ఇచ్చి నావలో ముందుకు సాగిపోయెను . సీతాదేవి గంగా మాటకు నమస్కరాము చేసి ప్రార్ధించెను . సీతారామలక్ష్మణులు గంగను దాటి అరణ్యము లో ప్రవేశించి నడువనారంభించిరి . వారు కనుమరుగయ్యేవరకు గుహుడు ,సుమంత్రుడు అలాగే నిలబడి చూస్తూ వారు సాంతం కనుమరుగయ్యాక భారంతో నిండిన గుండెలతో వెనుతిరిగెను . అరణ్యములో ముందు లక్ష్మణుడు మధ్యలో సీత వెనుక రాముడు నడుస్తూ ముందుకు సాగిరి . రామలక్ష్మణులు వనములలో నివసించు మునుల రక్షణార్ధము క్రూరమృగములను వేటాడెను . సాయంసమయములో కందమూలాదులను భుజించుటకు తెచ్చుకుని ,ఓ చెట్టు నీడకు చేరిరి . 

రామాయణము అయోధ్యకాండ ఏబదిరెండవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



 

Wednesday 21 December 2016

రామాయణము అయోధ్యకాండ -ఏబదిఒకటవసర్గ

                                       రామాయణము 

                                అయోధ్యకాండ -ఏబదిఒకటవసర్గ 

శ్రీ రాముడిపై కల సహజమైన అనురాగముతో లక్ష్మణుడు మేల్కొని ఉండుట గమనించిన గుహుడు "లక్ష్మణా !నీవు నిద్రించుము . నేను జాగరూపుడనై సీతారాములను చూచుకొనెదను . రాముడు యెడల నాకు అపార రెమభావము కలదు రాముడు నా మిత్రుడు కావున చింతించక హాయిగా నిద్రించుము . పైగా మహారాజు పుత్రుడు సుకుమారుడు అయినా శ్రీరాముడు నేలపై పరుండుట చూసిన వారికి నిద్రేలా పట్టును . నీవునూ రాజా కుమారుడవు . కావున ఈ రాత్రి సీతారాముల రక్షణ భారము నాకు అప్పగించి హాయిగా నిద్రించుము "అని పలికెను . 
అప్పుడు లక్ష్మణుడు గుహునితో "గుహా! నీ ఆదరాభిమానములకు మిక్కిలి సంతుష్టుడను అయ్యాను . కానీ నాకు అయోధ్యలోని  పరిస్థితి తలుచుకుంటే నిద్ర రావటం లేదు . అంతః  పురస్త్రీలందరూ ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళఇంకిపోయి మౌనముగా వుండివుంటారు . కౌశల్యా మాత ,దశరథ మహారాజు ,సుమిత్రా  మాత లను తలుచుకుంటేనే దుఃఖము ఆగడము లేదు వారు నేటి రాత్రి గడిచేసరికి జీవించివుంటారో లేదో అనుమానమే . సుమిత్రా మాత శత్రుజ్ఞుడి కోసం జీవించినా దశరథ మహారాజు ,కౌశల్యా మాతలు నిశ్చయముగా జీవించరు . ఆ సందేహమే నన్ను మిక్కిలి కలవరపరుచుచున్నది . 
వనవాస దీక్ష ముగిసి తిరిగి అయోధ్యకు వెళ్లువరకు ఆ మహారాజు క్షేమముగా ఉండునో లేదో . మళ్ళీ ఆయన దర్శన భాగ్యము కలుగునో లేదో "అంటూ పరిపరి విధములుగా బాదడుచున్న లక్ష్మణుడిని గుహుడు ఓదార్చెను . ఇంతలో తెల్లవారెను . 

           రామాయణము అయోధ్యకాండ ఏబది ఒకటవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  










Tuesday 20 December 2016

రామాయణము అయోధ్యకాండ -ఏబదియవసర్గము

                              రామాయణము 

                     అయోధ్యకాండ -ఏబదియవసర్గము 

ఆ విధముగా శ్రీరాముడు ముందుకు సాగుతూ కోశాలదేశ పొలిమేరలు దాటిన పిమ్మట వెనకకు  కోశాల రాజ్యమునకు నమస్కారము చేసి ,తండ్రిగారి ఋణము తీర్చుకుని తిరిగి నిన్ను  అక్కడి జానపదులకు నమస్కారము చేసి ముందుకు సాగెను . 
ఆ విధముగా పెక్కు దూరము ప్రయాణము చేసిన పిమ్మట స్వచ్ఛమైన జలములతో కూడిన పవిత్రమైన గంగా నది కనిపించెను . అక్కడి ప్రక్రుతి ఎంతో రామణీయముగా శోభాయమానంగా ఉండెను . అక్కడ దేవతలు గంగా స్నానములు ఆచరించుచు కనిపించిరి . ఆ ప్రదేశమును చూసిన శ్రీ రాముడు సుమంత్రుని రధము ఆపమని చెప్పి ఈ పూట ఇక్కడే  పలికెను . 
ఆ ప్రాంతమును పరిపాలించు రాజు పేరు గుహుడు అతడు ధర్మపరుడు ,నిషాదరాజు ,శ్రీరాముని భక్తుడు . అతడు శ్రీరాముడు సీతా ,లక్ష్మణ సమేతముగా తన రాజ్యమునకు వేంచేసిన విషయమును తెలుసుకుని తానె పరుగుపరుగున శ్రీరాముని చెంతకు వచ్చెను . శ్రీరాముడు గుహునికి ఎదురేగి ఆయనను కౌగలించుకొనెను . 
గుహుడు సీతారామలక్ష్మణులు రకరకముల పిండివంటలు ,రుచికరమైన పలురకములైన ఆహారపదార్ధములను ,పండ్లను పాయసములను ,రసములను ,వారి గుఱ్ఱములకు గడ్డిని సిద్ధము చేయించెను . ఇంకను వారు విశ్రమించుటకు పరుపులు ఏర్పాటుచేయించెను . శ్రీరాముడు వాటినన్నినింటిని సున్నితముగా తిరస్కరించి గుఱ్ఱములకు గడ్డిని మాత్రము గ్రహించెను . వనవాస దీక్షలో విందు భోజనమును ఆరగించరాదని తెలిపెను . సీతారాములు అనంతరము దర్భ శయ్య పై పవళించిరి . గుహుడు ,లక్ష్మణుడు వారి రక్షణార్ధము రేయంతా మెలుకువగా ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ ఏబదియవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ,తెలుగు పండితులు . 



 

Monday 19 December 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబదితొమ్మిదవసర్గ

                                           రామాయణము 

                                         అయోధ్యకాండ -నలుబదితొమ్మిదవసర్గ 

పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముడు వేకువజామున నదీ తీరమున ప్రజలను వదిలి వెళ్లిన పిమ్మట ,తండ్రి ఆజ్ఞను గుర్తుచేసుకుని సీతా లక్ష్మణులతో కూడి చాలా దూరము ప్రయాణము చేసెను . ఇన్తలో శుభొదయము అవగా  దక్షిణ దిశను కల వివిధ జన పదములను దాటుతూ ,అక్కడి పంట పొలాలను ,వనములను తిలకించుతూ ముందుకు సాగెను . 
ఆ విధముగా సీతా లక్ష్మణ సమేతుడై వనవాసమునకు వెళ్లుచున్న రాముడిని చూసిన అక్కడి ప్రజలు శ్రీరాముని వనవాసమునకు కారణమైన దశరథ మహారాజును నిందించుచుండిరి . వారి మాటలను వింటూ రాముడు ముందుకు సాగిపోయెను . అగస్త్యాశ్రమము దిశగా తన ప్రయాణమును సాగిo చేను . అక్కడి విశేషములను సీతాదేవికి  శ్రీరాముడు వివరించెను . 
సుమంత్రుడితో రాముడు " మఱల నా తల్లితండ్రుల దర్శన భాగ్యము ఎన్నాళ్లకు కలుగునో కదా ?సరయు నదీ తీరమున కల ఈ సుందర పుష్పవనములలో హాయిగా విహరించేది భాగ్యము తిరిగి ఎన్నాళ్లకు కలుగునో ?ఈ వనములలో మృగములను వేటాడు కోరిక నాకు లేదు  . కానీ దశరధమహారాజుకి వేట అంటే చాలా ఇష్టము . "అంటూ శ్రీరామచంద్రుడు వివిధ  గురించి సుమంత్రుడికి మృదుమధురంగా వివరించుచు  సుమంత్రుడు రధమును తోలుతుండగా రధము మీద ఆశీనుడైన శ్రీరాముడు ముందుకు సాగెను . 

రామాయణము అయోధ్యకాండ నలుబది తొమ్మిదవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





 

Sunday 18 December 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబది ఎనిమిదవసర్గ

                                       రామాయణము 

                                           అయోధ్యకాండ -నలుబది ఎనిమిదవసర్గ 

రాముడు లేని నగరము ,ఆ నగరవాసులు కళావిహీనులై ఉండెను . శ్రీరాముడు లేకుండా ఇంటికి చేరిన భర్తలను చూసి భార్యలు మాయావతి వాడు అంకుశముతో పొడిచినట్లు ,తమ సూటి ఓటి మాటలతో భర్తలను భాదించెను . 
కైకేయి చేతికి రాజ్యము వచ్చిన ఆవిడ దాసులుగా ఆవిడ అదుపాజ్ఞలలో బతకలేము రాముండు వున్న అడవికే వెళ్లిన యెడల పురుషుల భాద్యత అంతయు శ్రీరాముడు ,ఆడవారి భాద్యత అంతయు సీతాదేవి చూసుకొనగలదని ఆ పుర స్త్రీలందరూ అనుకొనుచుండిరి . 
ఆ రోజు అయోధ్యలో ఎవరు అగ్నికార్యములు చేయలేదు . హోమాది కార్యక్రమము చేయలేదు . వేయి మాటలేల? ఇళ్లల్లో పొయ్యి సయితము వెలిగించబడలేదు . ఒక్క పూట ముందు వరకు సంగీత ,వాయిద్య రకరకాల ధ్వనులతో మారుమ్రోగిన ఆ పురి ఇప్పుడు స్మశానం వలె ఎటు చూసినా ఏడ్పులు ,దీన వదనాలతో సంతోషమన్నది మచ్చుకైనా లేకుండా పోయెను . 
సంతోషముగా ఉన్న అయోధ్యా నగరములో అకస్మాత్తుగా దుఃఖము అలముకున్నట్లుగా సూర్యుడు అస్తమించడంతో వెలుగు ను తరిమివేసి చుట్టూ చీకట్లు అలముకొనెను . 

రామాయణము అయోధ్యకాండ నలుబది ఎనిమిదవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Saturday 17 December 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబదియేడవసర్గ

                                       రామాయణము 

                                        అయోధ్యకాండ -నలుబదియేడవసర్గ 

సూర్యోదయమయిన పిమ్మట జనులందరూ మేల్కొనిరి . అచట శ్రీరాముడు కనపడకపోవుటచే వారు శోకముతో నిశ్చేష్టులయ్యి  పోయిరి . వారు దుఃఖ భారంతో కన్నీరు కార్చుతూ శ్రీ రామునికై వెతికిరి . శ్రీరాముడు కనపడక పోవుటచే వారు మిగుల దుఃఖితులయ్యిరి .  ఆ పౌరులు దీనావదనాలతో తమను తాము వొళ్ళు తెలియకుండా నిద్రపోయినందుకు తిట్టుకొనెను . తిరిగి వారిలో వారు 
"శ్రీ రాముడు లేని ఈ బతుకులు ఎందుకు మనము కూడా ఇక్కడే ప్రాయోపవేశము చేసి ప్రాణములు వీడెదము . రాముడు  ఎక్కడ అని మనము తిరిగి వెళ్లిన తర్వాత అయోధ్యలోని వారు అడిగితే శ్రీరాముని వదిలి నిద్రపోయాము అని ఏ ముఖము పెట్టుకుని చెప్పాలి . అసలు వారికి మన ముఖము ఎలా చూపగలము ?అని పలురీతులుగా వాపోవుతూ లేగదూడలకు దూరమైనా పాడి ఆవులవలె విలపించెను . 
వారు ఎట్టకేలకు రధ చక్రముల జాడను కనిపెట్టి కొంత దూరము ముందుకు సాగిరి . పిమ్మట రథచక్రముల గుర్తులు కానరాకపోవుటచే అంతులేని విషాదంలో మునిగిపోయి "ఇదియేమి? ఇప్పుడు ఏమి చేయవలెను ?"అంటూ మిక్కిలి దుఃఖితులై చేసేది లేక తిరుగు ముఖము పట్టి అయోధ్యకు చేరిరి . వెళ్లిన వారితో శ్రీరాముడు తిరిగి రాకపోవుట చూసిన అయోధ్య ప్రజలందరూ కన్నులు వాచిపోవునట్లు కన్నీరు మున్నీరుగా విలపించిరి . 
ఆ సమయమున ఆనగరము చంద్రుడు లేని ఆకాశము  వలె ,నీరు లేని సముద్రము వలె చూసే వారికి కనిపించెను . అయోధ్యలోని జనులు ,పశుపక్షాదులు సైతము దుఃఖముతో నిండిన హృదయములలో భారముగా ఉండిరి . 

రామాయణము అయోధ్యకాండ నలుబదియేడవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Friday 16 December 2016

                                          రామాయణము 

                                  అయోధ్యకాండ -నలుబది ఆరవసర్గ 

తమసా నదీ తీరమునకు చేరిన పిదప సుమంత్రుడు సీతా రామలక్ష్మణులకు ఆకులతో శయ్యను  చేసెను . వారి వెంట పరిగిడి వచ్చిన జనులు సైతం ఆగి ఆదమరిచి అక్కడే ఆకులు ,అలములు శయ్యలుగా చేసుకుని నిద్రించసాగిరి . సీతారాములు సైతము ప్రయాణ బడలిక చేత ఆదమరచి నిదురించసాగిరి . 
లక్ష్మణుడు మాత్రము నిదురించక సుమంత్రుడితో రాముడి గుణగణముల గురించి వివరించసాగెను . ఆ రాత్రంతా వారిరువురు రామకథాగానముతో నిదురించకనే కాలక్షేపము చేసెను . తెల్లవారెను సీతారాములు నిద్రలేచెను . కానీ జనులు మాత్రము బడలికచే ఇంకా నిదురించసాగెను . 
అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు ,సుమంత్రుడితో" జనులు నా మీద ప్రేమాభిమానములతో చెట్లు ,పుట్లలో నానా భాదలు అనుభవించుచున్నారు . కనుక వీరు నిద్ర లేవకుండానే మనము ఇక్కడ నుండి వెళ్లిపోదాము . అప్పుడు వారికి మనము ఎటు వెళ్ళామో తెలియక అప్పుడైనా ఇంటికి వెళ్తారు . వారికి ఈ బాధలన్నీ తప్పుతాయి . అరణ్యవాసము నాకు మాత్రమే కానీ వీరందరికి కాదు . వీరు నా మీద వళ్ళ మాలిన ప్రేమతో ఇల్లు వాకిళ్లు ,భార్యా పిల్లలను సైతము వదిలి ఇబ్బందులు పడుచున్నారు . కావున మనము త్వరగా బయలుదేరి వెళ్ళెదము ."
అని పలికెను . సుమంత్రుడు రధమును సిద్దము చేసెను . సీతారామలక్ష్మణులు ఆ రధమును ఎక్కి ,సరయు నదిని దాటి అరణ్యప్రాంతములో ప్రవేశించిరి . 

రామాయణము అయోధ్యకాండ నలుబది ఆరవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  

Thursday 15 December 2016

రామాయణం అయోధ్యకాండ -నలుబదియైదవసర్గ

                                      రామాయణం 

                                      అయోధ్యకాండ -నలుబదియైదవసర్గ 

మహానుభావుడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారము దీక్షవహించి ,వనవాసములకు వెళ్లుచుండగా ,అయోధ్యావాసులందరూ భక్తి విశ్వాసములతో ఆయనను అనుసరించిరి . 
"త్వరలో తమకడకు రావలెను అని కోరుకొనువారు తమ ఆత్మీయులను ఎక్కువ దూరము అనుసరింపరాదు "అను నియమము ప్రకారము దశరథ మహారాజు ,అంతః పుర వాసులు అతి కష్టము మీది వెనుతిరిగిరి . కానీ శ్రీరాముని రధము వెంట పరుగిడు అయోధ్యావాసులు మాత్రము తమ ఇండ్లకు రాలేదు . 
ఆ పౌరులందరూ రామా !వెనుతిరుగుము అని అరుస్తూ రధము వెంట పరుగులు తీయ సాగిరి . శ్రీరాముడు వారిని చూచి "మీ ఆధారాభిమానములకు మిక్కిలి సంతోషము ,ఇంత ప్రేమను భరతుడి మీద చూపండి . అప్పుడు నాకు ఇంకా సంతోషము కలుగును . రాజా శాసనము నాకు మీకు శిరాశావహింపవలసినది . కావున నేను వెళ్లిన పిమ్మట మహారాజు మనసుకు ఊరట కలుగునట్లు మసలుకొనుడు అది నాకు తృప్తి కలిగించును "అని పలికెను . 
ఆ పౌరులలో వృద్దులు బ్రాహ్మణులు జ్ఞాన సంపన్నులు తపోబలము కలవారు ముసలి వారగుటచే దూరము నుండే "ఓ రామ రధాశ్వములారా !వనముల వైపు వెళ్ళకుము . శ్రీరాముని వనములకు కాక నగరమునకు తీసుకు రండు . మీ శ్రావణ శక్తి అద్భుతము కావున మా మాటలు విని మరలుడు "అని పలుకగా శ్రీరాముడు రధమును నిలిపి రధము దిగి వారి వద్దకు పాదచారుడై వచ్చి వారిని ఊరడించెను . తిరిగి ముందుకు సాగెను . 
శ్రీ రాముడి వనవాసము తనకు కూడా ఇష్టము లేదు అన్నట్లు తమసా నది తీరము వచ్చెను . సుమంత్రుడు రధమును ఆపి గుఱ్ఱములను తీసి వాటి అలసట తీర్చెను . 

రామాయణము నలుబది అయిదవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .