రామాయణము
అయోధ్యకాండ -అరువదియవసర్గ
అనంతరము కౌశల్యా దేవి భూతము ఆవహించినదానివలె పదేపదే వణుకుచు ప్రాణములేనిదాని వలె నేలపై పది సుమంత్రునితో "ఓ సుమంత్రా !సీతారామలక్ష్మణులు లేని ఈ అయోధ్యలో క్షణమైనా ఉండలేను . కనుక నన్ను వారి వద్ద దింపుము . వెంటనే రధమును వెనుతిప్పుము "అని పలుకుతూ బిగ్గరగా రోదించనారంభించెను . ఆమె మాటలు విన్న సుమంత్రుడు
అమ్మా !సీతారామలక్ష్మణుల గూర్చి నీవు బాధపడవలిసిన అవసరము లేదు . లక్ష్మణుడు ఎల్లప్పుడూ అప్రమత్తుడై శ్రీరామ పాదసేవ చేయుచున్నాడు . సీతా దేవి తన మనసు నందు రాముని నిలుపుకుని ఆ అరణ్య ప్రాంతములో సైతము అంతఃపురము వలె సంతోషముగా (భర్త చెంత వున్న కారణముగా )తిరుగుచున్నది . ఆమె అచట ఏమాత్రము ఇబ్బంది పడుటలేదు . రామలక్ష్మణులు నారచీరలు జటలు ధరించి మహర్షుల మార్గమును అనుసరించుచున్నారు . అచట లభించు కందమూలాదులనే సంతోషముగా శ్వీకరించుతున్నారు . తండ్రిగారి సత్య ప్రతిజ్ఞ నెరవేర్చుతున్నారు . పితృవాక్య పరిపాలనకు రూపమైన శ్రీరాముని చరితము ఆచంద్రార్కము నిలిచి ఉండును . "అని పలికెను .
సుమంత్రుడి మాటలు విన్నను కౌశల్యాదేవి శోకము వీడక రామా !,లక్ష్మణా !,సీతా !అని కలవరించుచు శోకమునే ఉండెను .
రామాయణము అయోధ్యకాండ అరువదియవ సర్గసమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment