Wednesday 28 December 2016

రామాయణము అయోధ్యకాండ -ఏబది ఎనిమిదవసర్గ

                        రామాయణము 

                 అయోధ్యకాండ -ఏబది ఎనిమిదవసర్గ 

 కొంతసేపటికి తేరుకున్న దశరధ మహారాజు శ్రీరాముని గురించి తెలుసుకొనుటకు సుమంత్రుడిని తనవద్దకు పిలిపించి "సుమంత్రా !అల్లారుముద్దుగా పెరిగిన నా గారాల కుమారుడు శ్రీరాముడు ఆ ఘోరారణ్యములో ఎక్కడ ఆసీనుడవుతున్నాడు . ఎక్కడ పరుండుతున్నాడు . ఏ ఆహారము తింటున్నాడు . అరణ్యములోకి వెళ్లునప్పుడు శ్రీరాముడు ఏమి చెప్పెను ? జనకుని ముద్దుల కూతురు సీత ఏమన్నది ?లక్ష్మణుడు ఏమనెను ?"అని అడిగెను . 
అప్పుడు సుమంత్రుడు "ప్రభూ !శ్రీరాముడు అరణ్యములో బండరాళ్ళమీద ఆసీనుడవుతున్నాడు . నేలపై తృణశయ్యపై నిద్రిస్తున్నాడు . శ్రీరాముడు నన్ను వీడి వెళ్లునప్పుడు మీకు సాష్టాంగ నమస్కారము చేశానని చెప్పమన్నాడు . తల్లులను కుశలమడమన్నాడు . భరతుడిని రాజ్యభారం జాగ్రత్తగా వహించి తల్లులను తండ్రిని జాగ్రత్తగా చూసుకొనమని చెప్పమన్నాడు . ఇంకనూ ధర్మబద్ధముగా నివసిస్తానన్నానని చెప్పు అని పలికెను . ఇక విదేహానందని ఏమి మాట్లాడక భర్తను చూచి కన్నీటిపర్యంతమయ్యెను . లక్ష్మణుడు మాత్రము మహారాజు తన మాటకు తిరుగులేదనా ఈ నిర్ణయము తీసుకొనెను . ఈ నిర్ణయము నేను అంగీకరింపను . ఇది అధర్మము . మహారాజు కైకేయి మోహములో పడి కన్నకొడుకుని అడవులపాలు చేసెను . ఇకనుండి రాముడే నాకు తండ్రి సమస్తము అని పలికెను . "
అని సుమంత్రుడు దశరధ మహారాజుతో చెప్పెను . 

రామాయణము అయోధ్యకాండ ఏబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment