Friday 30 December 2016

రామాయణము అయోధ్యకాండ -అరువది యొకటవసర్గ

                                     రామాయణము 

                                అయోధ్యకాండ -అరువది యొకటవసర్గ 

కౌసల్య దేవి ఏడుస్తూ తన భర్తతో "ఓ మహారాజా !రఘువంశుడైన దశరధుడు మిక్కిలి దయాళువు ,ఉదారపురుషుడు ,ప్రియభాషి అని ముల్లోకములలో మీ ఘానా కీర్తి వ్యాపించినది . కానీ  అడవులకు పంపి అంతకు మించి అపకీర్తి మూటకట్టుకున్నావు . సుఖములలో పుట్టి పెరిగిన రామలక్ష్మణులు దుఃఖములపాలై సీతతోకూడి అడవులలో కష్టములను ఎట్లు సహించుచున్నారో ?యవ్వనము అడుగిడిన సీత మిక్కిలి సుకుమారురాలు . సుఖములను అనుభవించవలిసిన ఈ తరుణములో ఆ జనక నందని చలికి ,ఎండకు  ఎలా తట్టుకోగలరు ?ఆమె ఇక్కడ రుచికరమైన ఆహారమును తింటూ ఆహ్లాదంగా సంగీతము వింటూ ఉండేది . అక్కడ కందమూలాదులను తింటూ భయంకరమైన మృగములను గర్జన వింటూ ఎంత భయపడుతోందో ?
శ్రీరాముడు మెత్తని దిండ్లను తలకింద పెట్టుకుని నిద్రించేవాడు . ఇప్పుడు కఠిన శిలలపై తన చేతినే తలగడగా చేసుకుని ఎలా నిద్రించుచున్నాడో ?శ్రీరాముని ముఖము పౌర్ణమి చంద్రుడు వలె ఎంతో చూడముచ్చటగా ఉండును అటువంటి మోమును మల్లి చూడగలనో  లేదో ? హృదయము వజ్ర  సమానమయినది . కావుననే శ్రీరాముడు దూరమైనను ముక్కలుకాక ఇంకను సజీవంగా వున్నది . ఓ రాజా !నీవు కైకేయి చెప్పుడు మాటలు విని ఏ మాత్రము ముందువెనకాలు ఆలోచించక జాలిలేనివాడవై సీతారామలక్ష్మణులు అడవుల పాలు చేసితివి . ఆ చిన్నారులు నీకారణముగా ఇప్పుడు అరణ్యములో దీనులై తిరుగుచున్నారు . 
శ్రీరాముడు   పదునాలుగు సంవత్సరములు వనవాసము పూర్తిచేసి వచ్చిన పిమ్మట భరతుడు ,కైకేయి రామునికి రాజ్యము ఇచ్చునో లేదో ,లేక వారు ఇచ్చినా రాజ్యమును రాముడు స్వీకరించునో లేదో?భార్యకు భర్తే రక్షణ నీవు కైకేయి మోజులోపడి  నన్ను పట్టిచ్చికోనప్పుడు నాకు రాముడే దిక్కు ఇప్పుడు నాకు ఆదిక్కును కూడా లేకుండా చేసావు . అన్ని విధములుగా నన్ను మృతప్రాయను చేసావు . నీవు చేసిన పని ఫలితముగా కేవలము నీ ముద్దులాభార్య కైక ,ఆమె కుమారుడు భరతుడు మాత్రమే సంతోషముగా వున్నారు . "అని పలికెను . 
కౌశల్య మాటలు విన్న మహారాజు మిగుల దుఃఖితుడై రామా !రామా !అని కలవరించుతూ ఏడవసాగెను . 

రామాయణము అయోధ్యకాండ అరువది యొకటవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment