Saturday 31 December 2016

రామాయణము అయోధ్యకాండ -అరువదిమూడవసర్గ

                                      రామాయణము 

                                       అయోధ్యకాండ -అరువదిమూడవసర్గ    

తనయుడు దూరముఅగుటచే దశరథ మహారాజు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ,నిద్రాహారాలు మాని మాటిమాటికి రాముడిని కలవరిస్తూ ఉండెను . రాముడు అరణ్యమునకు వెళ్లిన 6వ రోజు రాత్రి తానూ చేసిన తప్పును గుర్తుతెచ్చుకుని కౌసల్యతో ఆ విషయమును ఈ విధముగా చెప్పనారంభించెను . 
"కౌశల్యా !ఎవరుచేసిన పాపఫలితమును వారు తప్పక అనుభవించవలసి ఉంటుంది . నేను చేసిన పాప ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను . నేను యవ్వనంలో వున్నప్పుడు, అప్పటికి మన వివాహము ఇంకా జరగలేదు . నేను యువరాజుగా ఉన్నాను . నన్ను చూసినవాఱందరు యువరాజు శబ్దవేది విద్యలో నిపుణుడు అని మెచ్చుకొనెడివారు . ఆ సమయములో ఒకరోజు రాత్రిపూట నేను నా శబ్దవేది విద్యను ప్రదర్శించవలెననే కోరికతో అరణ్యమునకు వేటకు వెళ్ళ్లాను . కటిక చీకటిలో పొదలమాటున కూర్చుని వున్నాను . అక్కడికి దగ్గరలో ఒక సరస్సు కలదు . పొదలమాటున కూర్చున్న నేను ,అణ్యములో సంచరించు జంతువుల అడుగుల చప్పుడు బట్టీ నా బాణములు ప్రయోగించి వాటిని చంపుతున్నాను . 
అప్పుడు అక్కడ దగ్గరలో వున్నా సరస్సులో నీటి చప్పుడు వినిపించింది . ఆ చప్పుడు ఏనుగు నీరుత్రాగిన చప్పుడుగా భ్రమించి విషసర్పము వంటి భయంకరమైన బాణమును ప్రయోగించాను . ఆ బాణము తగిలిన వెంటనే మనిషి అరుపులు "హా తల్లీ ,హా తండ్రీ !ఈ చీకటిలో ఎవడు నన్ను బాణముతో కొట్టెను ?నేను ఎవరికీ అన్యాయము చేసాను ?నేను చేసిన పాపమేమిటి ?"అని మాటలు వినిపించాయి ఆమాటలు విని నేను ఒక్క క్షణము అచేతుడను అయ్యాను .  ఆ క్షణము  లో నాకు ఏమిచేయాలో తోచలేదు . కాసేపటికి తేరుకుని వడివడిగా ఆ మాటలు వినపడిన ప్రదేశమునకు చేరుకొని చూడగా అక్కడ ఒక ముని కుమారుడు నా బాణము తగిలి రక్తపు మడుగులో పడి  వున్నాడు . అతడు నన్ను చూసి ఎవరునీవు ?నేను నీకు ఏమి అపకారము చేసాను . రాత్రిపూట కిరాతులు సైతము వేటాడారు అలాంటిది నీవు నన్ను ఎందుకు బాణముతో కొట్టావు ?మా తల్లితండ్రులు కాదు వృద్దులు గ్రుడ్డివారు వారి దాహము తీర్చుటకై ఇప్పుడు నేను ఇక్కడకు వచ్చాను . 
నేను చనిపోయిన విషయము కూడా వారికి చెప్పేది వారు లేరుకదా . నా మీదకల అపారమైన ప్రేమాభిమానముల కారణముగా వారును నేను మరణించిన పిదప మరణింతురు . నీవు ఒకే బాణమునకు మూడు ప్రాణములు తీసిన ఘనుడవు "అని పలుకగా నేను మిగుల దుఃఖిస్తూ "ఓ ముని కుమారా !నేను కావాలని నిన్ను కొట్టలేదు . ఏనుగు నీరు త్రాగుతున్నదని భ్రమించి బాణము వేసాను . నా దురదృష్టము కొద్దీ అది నీకు తగిలినది . అయ్యో !ఇప్పుడు నాకు భ్రహ్మహత్యా పాతకము చుట్టుకోబోనున్నది కాబోలు "అని నేను దుఃఖిస్తూ ఉండగా . ఆ ముని కుమారుడు 
"ఓ మాహారాజా !నీకు భ్రహ్మహత్యా పాతకము చుట్టుకొనదు . నేను బ్ర్రాహ్మణుడను కాను వైస్యుని వలన శూద్ర స్త్రీకి జన్మించాను . ముని వృత్తిని అవలింభించి వృద్ధులైన తల్లితండ్రులకు సేవ చేస్తూ జీవనము గడుపుతున్నాను . ఇక్కడకు దగ్గరలోనే మా తండ్రి ఆశ్రమము కలదు వారు నాకోసము దాహముతో ఎదురుచూస్తుంటారు . కావున నీటిని తీసుకెళ్లి వారికి ఇవ్వు . నీవు చెప్పకపోయినా దివ్యదృష్టిద్వారా జరిగినది తెలుసుకుని నీ వంశాన్నే శపించగలరు కావున నీవే వెళ్లి జరిగిన వృత్తాన్తమును వివరించుము . ఈ భాద ఓర్వలేకున్నాను . కావున ఈ బాణము తీసి పుణ్యము కట్టుకొనుము" . అని మిక్కిలి దీనంగా నన్ను వేడుకొనెను . ఆ ముని కుమారుని బాధ చూడలేక నేను ఆ బాంమౌను తీసివేయగా ఆమెని కుమారుడు ప్రాణములను వదిలివేసినాడు . అతడిని చూసి నేను మిక్కిలి విషాదమునకు గురి అయ్యాను . 

రామాయణము అయోధ్యకాండ అరువదిమూడవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment