రామాయణము
అయోధ్యకాండ -అరువది యొకటవసర్గ
రామ జననియైన కౌసల్య తనకు దుఃఖము తెచ్చిపెట్టిన ఆ మహారాజుపై కుద్దురాలై పలికిన పరుషవాక్యములు విని ఆ దశరధుడు మిగుల కృంగిపోయెను . "కౌశల్య పలుకులు సత్యములు చేయని దోషములు చేసితిని ఇపుడు చింతించి ప్రయోజనము ఏమున్నది ?అని అతడు చింతించసాగెను . అలా చాలాసేపు ఏడ్చి ఈ పరిస్థితికి కారణమేమిటా ?అని ఆలోచిo చగా పూర్వము శబ్దబేది బాణము ద్వారా తెలియక తానూ చేసిన దుష్కృత్యము గుర్తుకు వచ్చెను , కౌశల్యతో ఓ కౌశల్యా నీకు అంజలి ఘటించి వేడుకుంటున్నాను . నా పట్ల ప్రసన్నురాలివి కమ్ము . నేను కావాలని ఇదంతా చేయలేదు . జరిగిన దానికి నేనును జీవచ్ఛవంలా వున్నాను . ఈ పరిస్థితిలో నన్ను ఇలా తూలనాడడం న్యాయమా ?కైకేయిని కన్నెత్తి చూచుటకు కూడా నేను ఇష్టపడుటలేదు . నిన్ను దోసిలి ఒగ్గి అర్ధిస్తున్నాను . నన్ను క్షమించు "అని పలుకుతూ ఎడ్వానారంభించెను .
ఆ మాటలు విన్న కౌసల్య తానూ చేసిన పనికి పశ్చాత్తాపపడి భర్త దోసిలి పట్టుకుని "భాదతో కోపముతో పిచ్చిదానినై ఎదో తెలియక మాట్లాడాను . కోపముతో వున్నా వారికి యుక్తాయుక్త విచక్షణ ఉండదు అంటారు . కనుక నేను పలికిన పలుకులకు నన్ను క్షమించండి . రాముడు అరణ్యవాసమునకు వెళ్లి నేటికీ 5 దినములు పూర్తి అయినది . నాకు 5 సంవత్సరములు గడిచినట్లుగా వున్నది . "అని పలికెను .
సూర్యాస్తమయము అయి రాత్రి అయినది కౌసల్య మాట్లాడిన మాటలకు దశరధుడు కొంత ఊరడిల్లి దశరధుడు నిద్రించెను .
రామాయణము అయోధ్యకాండ అరువది యొకటవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment