Tuesday 31 May 2016

రామాయణము ద్వితీయోధ్యాయం

                              రామాయణము      

                          ద్వితీయోధ్యాయం 


గౌతముడు పలికెను 

ఓ విప్రా కార్తీక మాసము నందలి శుక్ల పక్షమున పాడ్యమి నుండి 9 దినములు భక్తి శ్రద్దలతో సాధారణముగా రామాయణ కదా అమృతము గ్రోలుము . నేటి నుండి 12 సంవత్సరముల కాలము ముగియగానే ఈ రాక్షసత్వము నుండి నీకు విముక్తి లభించును . అంతవరకును ఈ శాప ఫలితమును అనుభవించ వలసిందే . 

                               సౌదాసుడు వచించెను 

వెంటనే విప్రుడైన ఆ సౌదాసుడు గురువు పలికిన అనుగ్రహ వచనములకు సంప్రీతుడై ఆయన పాదములకు నమస్కరించి ఇట్లు విన్నవించెను . ఓ గురువరా ఈ రామాయణమును రచించిన మహాత్ముడు ఎవరు ఇందలి వృత్తాంతము ఎవరిదీ ?మొదలగు విషయములను అన్నింటిని సంగ్రహముగా తెల్పుము . 

గౌతముడు పలికెను 

ఓ విప్రుడా వినుము రామాయణ మహా కావ్యమును వాల్మీకి మహర్షి రచించెను . ఆ రామ వృత్తాంతము శ్రద్ధాదారములతో విన్నవాడు తన పాపములనుండి విముక్తుడై మరల తన రూపమును పొందును . దేవా కార్యార్దమై శ్రీ మహా విష్ణువు శ్రీ రాముడిగా ఈ లోకమున అవతరించెను అతడు రావణాది రాక్షసులను హతమార్చెను ఆ మహాత్ముని చరితమును వినుము . మహిమాన్వితమైన ఆ రామాయణము సమస్త పాపములను రూపుమాపును దానిని కార్తీక శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు విన్నచో మహా పుణ్య ఫలము లభించును . అని పలికి తఫో భళా సంపన్నుడై గౌతమ ముని తన ఆశ్రమముకు వెళ్ళెను . రాక్షస శరీరము ప్రాప్తించిన కారణముగా ఆ విప్రుడు మిగుల దుఖితుడయ్యేను అతడు నిత్యము అమితమైన ఆకలి దప్పులతో అలమటించుచుండెను . అందువలన అతనిలో కోపము ఎక్కువయ్యెను . అతడు నల్ల త్రాచు పామువలె భయంకరుడై నిర్జనములైన వన ప్రదేశములలో తిరుగసాగెను . వివిధములగు ప్రసిద్దములైన క్రూర మృగములు మనుష్యులు సర్పములు పక్షులు వానరములు మొదలగు ప్రాణులు అన్నింటిని అతడు భక్షిన్చుచుండెను . ఓ విప్రులారా ఆ రాక్షసుని కారణముగా అనేకములైన ఎముకలతోడను పసుపు ఎరుపు కలెభరములుథొను రక్తమును త్రాగేడి భూతప్రేతములతోడను నిండి అచటి ప్రదేశము లన్నియు భయంకరముగా ఉండెను . అతడు నూరు యోజనముల వైశాల్యము గల ఆ భూభాగము అంతయును 6 మాసములలోనే మిగుల కలుషిత మొనర్చి పిమ్మట మరియొక వనముకు వెళ్ళెను అక్కడ కూడా అతడు నిత్యము నారా మాంసమునే భాక్షింపు చు ఉండెను . సకల ప్రాణులకు భయంకరుడై వున్నా ఆ రాక్షసుడు క్రమముగా నర్మదా నదీ తీరము చేరెను ఇంత లోపల మిగుల ధార్మికుడైన ఒకానొక విప్రుడు అచటికి వచ్చెను . అచ్చటికి వచ్చిన ఆ బ్రాహ్మణుడి పేరు గర్గుడు అతడు సుప్రసిద్దుడు కళింగ దేశమునకు చెందినవాడు . అతడు తన భుజముపైన గంగా జలముతో నిండిన పాత్రను మోయుచు విశ్వేశ్వరుని స్తుతించుచు శ్రీ రాముని నామములను గానము చేయుచు మిక్కిలి సంతోషముతో అచటికి చేరెను . రాక్షసుడిగా మారి యున్న ఆ సౌదాసుడు అచటికి విచ్చేసిన ఆ మునీశ్వరుని చూసి నాకు నేటికి కావలిసిన ఆహారము లభించినది అని అనుకోనచు అతడు చేతులు పైకెత్తి ఆ మునిని సమీపించెను ఆ గర్గ మహర్షి కీర్థించుచున్న దైవ నామములను విని అతడు దూరముననే నిలబడి పోయెను ఆ బ్రాహ్మణోత్తముని చంపుటకు ఆశక్తుడై ఆ రాక్షసుడు ఆయనతో ఇట్లు పలికెను . 

రాక్షసుడు పలికెను 

ఏమాశ్చర్యము ఓ మునివరా !మహాత్ముడవైన నీకు నమస్కారము మీ దైవ నామస్మరణ ప్రభావమున నావంటి రాక్షసులు కుడా దూరముననే నిలిచి పోవుచున్నారు . నేను ఇదివరలో లెక్కలేనంత మంది బ్రాహ్మణులను భక్షిన్చియుంటిని . 
ఓ బ్రాహ్మణుడా దివ్య నామము అనే ఆయుధమే నీకు భద్రకవచమై మహా భయము నుండి నిన్ను కాపాడుచున్నది . రాక్షసులమైన మేము కుడా పరమ శాంతిని పొందు చుంటిమి భగవంతుని మహిమ నిజముగా ఎంత గొప్పది . ఓ మహాత్మా నీవు అన్ని విధములుగా రాగ ద్వేషములు లేనట్టి బ్రాహ్మనోత్తముడవు కనుక నీవు రామ కధను తెలిపి దాని ప్రభావముతో మహా పాపినైన నన్ను ఈ రాక్షస రూపము నుండి విముక్తుని గావింపుము . 
ఓ మునీశ్వరా నేను ఇదివరలో నా గురువును అవమానించితిని . తత్ఫలితముగా రాక్షస శరీరమును పొందుము అని శపింప భడితిని . పిమ్మట గురువు నన్ను అనుగ్రహించి నాతో ఇట్లు వచించెను . 
పూర్వ కాలమున వాల్మీకి మహర్షి శ్రీ రామ గాధను ఓక మహా కావ్యముగా రచించెను . కార్తీకమాస శుక్ల పక్షము నందు 9 దినములు ప్రయత్న పూర్వకముగా దీనిని వినుత వలన మహా పుణ్య ఫలము లభించును ఇంకను ఆ మహాత్ముడు మనోహరమైన శుభప్రదమైన వచనములను ఇట్లు పలికెను పాడ్యమి నుండి 9 దినములు రామాయణ కదా అమృతమును గ్రోలవలెను అని అప్పుడు ఆ రాక్షసుడు ఆమునితో" సర్వ శాస్తార్ధ కోవిద మహాత్మా ,పూజ్యుడవైన ఓ గార్గ మహర్షి అందువలన ఆ పవిత్ర కధను వినిపించి పాపాత్ముడైన నన్ను శాప విముక్తుడిని గావించి రక్షింపుము" అని విన్నవించెను . 

గార్గ మహర్షి పలికెను 

మహాతుడవైన ఓ రాక్షసోత్తమా నీ భుద్ది పవిత్రమైనది . శ్రీ రామును ధ్యానము నందే నిరతులైన వారిని ఎవ్వరును భాదిమ్పజాలరు రామ భక్త పరులు వున్నా చోట త్రిమూర్తులైన బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులు వుందురు . రామాయణ ప్రవచనము శ్రవణము చేయుచుండేడి నరులున్న చోట దేవతలు సిద్దులు మొదలగు దివ్య జాతుల వారును వుందురు అందువల్లన కార్తీక మాసము నందలి శుక్ల పక్షము నందు 9 దినములు అనుక్షణము సావదానవుడవై రామాయణ గాధను వినుము . ఆ పవిత్ర రామాయణ వృత్తాంతమును విన్నంత మాథ్రమునె ఆ సౌదాసుని రాక్షసత్వము తొలగిపోయెను . అంతట అతడు రాక్షస స్వభావములనుండి బయట పడి దేవతా సముడు అయ్యెను . పిదప ఆ బ్రాహ్మణోత్తముడు కోటి సూర్య కాంతులతో ప్రకాశించెను . అంతట శ్రీ రామ చంద్రుడు శంక చక్రములను ,గదను ధరించి అభయ హస్తములతో అచట ప్రత్యక్షమై విప్రోత్తముడైన సౌదాసుని కొనియాడిన పిమ్మట ఆ ప్రభువు పరందామముకు చేరెను . 

నారదుడు వచించెను 

ఓ విప్రులారా అందువలన రామ కదా అమృతమును అస్వాదిమ్పుడు . ఈ రామాయణ గాధను భక్తితో పతించెఇ వారు ,వినేది వారు గంగా స్నాన ఫలమును పొందెదరు . 


 ద్వుతీయోద్యయః సమాప్తః 




శశి ,

ఎం . ఎ ?(తెలుగు ),తెలుగు పండితులు 





















Monday 30 May 2016

రామాయణము ద్వితియోధ్యాయః

                   రామాయణము 

                               ద్వితియోధ్యాయః 

                     ఋషులు వచించిరి 

పూజ్యుడైన ఓ మహాముని మహాత్ముడైన నారద మహర్షి రామాయణము అందలి సమస్తమైన ధర్మములను సనత్కుమారునకు ఎట్లు వివరించెను . ఆ ఇద్దరు బ్రహ్మవాదులు ఎ క్షేత్రమున ఎట్లు కలుసుకొనిరి . నారద మహర్షి ఆయనకు తెలిపిన విశేషములు ఏమిటి వాటిని అన్నింటిని మాకు వివరింపుము . 

                      సూత మహర్షి పలికెను 

మహాత్ములైన సనకాదులు సృష్టి కర్త ఐన బ్రహ్మ దేవునకు మానస పుత్రులు వారు అహంకార మమకారములు ఎమాత్రమును లేని వారు . వారు జితేనద్రియులు . సనక సనందన ,సనత్కుమార సనాతనులు అనునవి వారి పేర్లు ఆ మహాత్ములు విష్ణు భక్తులు సర్వదా బ్రహ్మ ద్యానము నందే నిమగ్నులై ఉండెడివారు . వారు సత్య వచనులు ,మోక్ష కాంక్ష కలవారు . సహస్ర సూర్య కాంతులతో వెలుగొన్దుచున్దురు . 
మహా తేజో మూర్తులు బ్రహ్మదేవుని కుమారులైన సనకాదులు ఒకానొకప్పుడు బ్రహ్మదేవుని సభను వీక్షించుటకై మేరు శృంగమునకు వెళ్ళిరి . అచట వారు విష్ణు పాదము నుండి జన్మించిన పవిత్ర గంగా నదిని చూచిరి . పిదప తేజో నిదులైన ఆ మునులు" సీత "అను గల ఆ నదిలో స్నానము చేయుటకు సిద్దపడిరి . 
ఓ విప్రోత్తములారా !ఇంతలో దేవర్షి ఐన నారద మహా ముని శ్రీ మహా విష్ణువు యొక్క నారాయణాది నామములను కీర్తించుచు అచటికి చేరెను . 
నారాయణా !అచ్యుతా !అనంతా !వాసు దేవా ! జనార్ధనా ! యజ్ఞేశ !యజ్ఞ పురుష !రామా !విష్ణు ! నీకు నమస్కారములు . అని హరి నామములను వుచ్చరించుచు సమస్త జగత్తును పావనమొనర్చుచు ఆ ముని లోక పావని ఐన గంగా నదిని స్తుతించుచు అచ్చటికి విచ్చేసెను . 
ఆ విధముగా అచటికి విచ్చేసిన ఆ మునిని చూచి తేజో ముర్తులైన ఆ సనకాదులు యధోచితముగా ఆయనను సత్కరించిరి . అంతట నారదుడు వారికి అభివందనము వొనర్చెను . 
వారు బ్రహ్మ సభలో సుఖాసీనులైన పిమ్మట నారాయణ నామ స్మరణము అందే నిమగ్నుడై వున్న నారద మహా మునిని చూచి సనత్కుమారుడు ఇట్లు నుడివెను . 

          సనత్కుమారుడు వచించెను 

సర్వజ్ఞుడవు ఐన ఓ నారద మహర్షి నీవు వేద వేదాంగము లను బాగుగా ఎరిగిన వాడవు . ముని లోకమునకే వన్నె తెచ్చేది వాడవు . నీవు హరి భక్తులలో అగ్రేసరుడవు నిన్ను మించిన విష్ణు భక్తుడు మరియోకడు లేడు . ఆ శ్రీ మహా విష్ణువు నుండియే ఈ సమస్త చరాచర జగత్తు వెలువడినది . ఆయన పాదము నుండియే ఈ గంగా నది ఆవిర్భవించింది . అట్టి హరిని  గూర్చిన జ్ఞానము ఎట్లు కలుగును . మాపై దయ వుంచి ఈ విషయములని అన్నింటిని సమగ్రముగా వివరింపుము . 

నారదుడు పలికెను 

ఆ శ్రీ మహా విష్ణువు దేవా దేవుడు పరాత్పరుడు ఆయన నివాస స్థానమైన పరందామము సర్వోత్కృష్టమైనది . అతడు సుగుణ స్వరూపుడు ,జ్ఞానము ,అజ్ఞానము,ధర్మమూ ,అధర్మము ,విద్య ,అవిద్య ఇవన్నియు ఆయన స్వరూపములే . సకల జీవులకు ఆయన ఆత్మ స్వరూపుడు . అట్టి మహా విష్ణువుకు అనుక్షణము నమస్కరింతును . 
త్రేతా యుగమున ఈ లోకము నందు రఘు వంశమున అవతరించిన శ్రీ రాముడు మాహా విష్ణువే . అతడు రాక్షసులను సంహరించెను . పాపములను రూపు మాపెను . తన భుజ బలము చేతనే ధర్మమును రక్షించెను . భూ బారమును తొలగించుట ఆయనకు వినోదము . అట్టి ఆ అది దేవునికి నమస్కరించుచున్నాను .  
అతడు ఒక్కడే నాలుగు (రామ ,లక్ష్మణ ,భరత,శతృజ్ఞులు )రూపములలో అవతరించెను . వానరోత్తములతో కూడి రాక్షస సమూహములను హతమార్చెను . దశరద కుమారుడైన అట్టి శ్రీ రాముడికి నమస్కరింతును . 

మహాత్ముడు ఐన శ్రీ రాముని యొక్క చరితములు అనేకములు . ఆయన నామములను లెక్కించుటకు ఎన్ని సంవత్సరముల కాలమైనను  చాలదు ఆయన మహిమను పూర్తిగా ఎరుంగు టకు మనువులకును ,మహర్షులకును అసాధ్యము . ఇక నావంటి అల్పుని విషయము చెప్పనేల ?ఆయన పవిత్ర నామములను విన్ననంతనే మహా పాపాత్ములు  అగుదురు . ఇక అట్టి మహాత్ముని గూర్చి అల్ప బుద్దినైన నేను ఎట్లు వివరింప గలను . 
ఓ బ్రాహ్మనోత్తములారా ఘోరమైన ఈ కలియుగమున రామాయణ పఠణ ,శ్రవణముల అందు నిరతులైన వారు మాత్రమే ధన్యాత్ములగుదురు . వారికి నేను నిత్యము  నమస్కరింతును . భగవన్నామ మహిమను ఎరుంగ గోరువారు చైత్ర ,కార్తీక ,మాఘ మాసములయందు శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు 9 దినములు రామాయణ కదామృతము ఆస్వాదిమ్పవలెను . 

సనత్కుమారుడు పలికెను 

ఓ మునోత్తమా సమస్త ధర్మముల ఫలములను ప్రసాదించునట్టి రామాయణమును ఎవరు రచించిరి ? గౌతముడు సౌదాసుని ఎందులకు శపించెను ?  రామాయణ ప్రభావము చే అతడు మరల ఎట్లు శాప విముక్తుడయ్యేను . ఓ మునీశ్వరా మీకు నాపై దయ ఉన్నచో నన్ను అనుహ్రహించి ఈ విషయములను అన్నింటిని మాకు సమగ్రముగా తెల్పుడు . ఎందుకనగా ఈ రామాయణ కద తెల్పేది వారి యొక్క వినేది వారి యొక్క సమస్త పాపములను రూపుమాపునట్టిది  ఈ గాధ . 

నారదుడు పలికెను 

ఓ విప్రోత్తమా ! శ్రద్దగా వినుము . ఈ రామాయణము వాల్మీకి మహర్షి ముఖము నుండి వెలువడినది . మహిమాన్వితమైన ఈ కదామ్రుతము 9 దినములు ఆస్వాదించుట ఎంతయో శ్రేయస్కరము . 
కృత యుగము నందు ఒక విప్రుడు కలడు  . అతని పేరు సోమదత్తుడు . అతడు ధర్మ కర్మలను అనుచరించుటలో గొప్పవాడు ,ధర్మ నిరతుడు . 
అతడు బ్రహ్మ వాది  ఐన గౌతముని వలన మనోహరమైన గంగా నదీ తీరము నందు సకల ధర్మములను వినెను . . మరియు అతడికి గౌతముడు పురాణములను ,శాస్త్రములను భోదించెను . ఇంకను ఆ సోమదత్తుడు వివిదములగు ధర్మ రహస్యముల గూర్చి ఆ మహర్షి నుండి తెలుసుకొనెను . 
ఒకానొక సమయమున ఆ సోమధత్తుడు పరమేశ్వరుని సేవలో నిమగ్నుడై ఉండెను . ఆ సమయములో అతని గురువైన గౌతముడు అక్కడికి విచ్చేసెను . కాని సోమదత్తుడు(సౌదాసుడు )దైవ సేవలో మునిగి ఉన్నందున లేచి ఆయనకు నమస్కరించలేదు . శాంతస్వరూపుడు బుద్ధిశాలిఐన గౌతముడు సౌదాసుని చూసి "ఇతడు నేను భోధించిన రీతిగా ధర్మ కార్యములనే చేయుచున్నాడు . అని సంతోషించెను . జగద్గురువు మహాదేవుడైన శివుని వుపాసిన్చినట్టి గౌతముడు అచటికి వచ్చినప్పటికిని ఆ సౌదాసుడు లేచి నిలబడి తన గురువును గౌరవిమ్పలేదు . ఇట్లు చేయుట మహాపచారము అని తలంచి సర్వ ధర్మజ్ఞుడు ,సర్వదర్శి దేవదేవుడైన పరమ శివుడు గురువును అవమానించిన  ఇతనికి రాక్షసత్వం ప్రాప్తించును గాక అని శపించెను . అంతట సౌదాసుడు పశ్చాత్తాపముతో అంజలి గటించి న్యాయ కోవిధుదైన గౌతమునితో ఓ పూజ్య మహర్షి గురు దేవా మీ యెడ నేనోనర్చిన మహాపరాధములన్నింటిని క్షమింపుడు . అని వేడుకొనెను . 

శశి ,

                                            ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు 
















x

రామాయణం ప్రధమోద్యాయః

                       రామాయణం    ప్రధమోద్యాయః 

సూతుడు మునులతో ఇంకనూ ఇట్లనెను 

ఓ ద్విజోత్తములారా !శ్రీ మద్రామాయణము ధర్మార్ధ కర్మ మోక్ష ఫల ప్రాప్తికి సాధనము . ఇందలి వృత్తాంతం పవిత్రమైనది ,మానవులెల్లరు భక్తి నిరతులై వినదగినది . 
పూర్వ జన్మలయందలిపాపములనుండి విముక్తులైన వారికి  మాత్రమే ఈ జన్మలో రామాయణము అందు ప్రీతీ జనించును . ఇది తధ్యము . 
పాప బంధనములలో చిక్కుకోనిన వాడు రామాయణ వృత్తాంతము ప్రారంభము కాగానే దాని యెడ నిరాదరణ చూపును . నిమ్న జాతికి చెందిన  గాధలను వినుటలో ఆశక్తి చూపును . తత్ఫలితముగా ఆ మార్గములోనే పయనించును . 
కనుక ఓ బ్రాహ్మనోత్తములారా !'రామాయణం 'అను పేరు గల సర్వ శ్రేష్ట కావ్యము వినుడు . దానిని వినుట  వలన మానవునికి జనన మరణ భయములు దూరమగును .  వార్ధక్య భీతుయు వుండదు . అతడు పాప రహితుడై ముక్తిని పొందును . 
ఆ రామభద్రుని వృత్తాంతం ప్రముఖమైనది . సర్వ శ్రేష్టమైనది . వరములను ఇచ్చునది . తన యొక్క ప్రభావముచే సమస్త లోకములను వికసింపు చేయునది . ఆ అది కావ్యము కోరిన కోర్కెలు దీర్చు కల్పవృక్షము . కావున ఆ కావ్య గాధను విన్న మానవులు పరమ పదము చేరుదురు . 




ఓ మహర్షులారా !కార్తీకమునందును ,మాఘమునందును చైత్రమాసము నందును ,శుక్లపక్ష పాడ్యమి మొదలుకుని తొమ్మిది దినములు పగటి పూట అమృత తుల్యమైన రామాయణ గాధను శ్రవణము చేయుట మంచిది . శుభదాయకమైన శ్రీ రామ వృత్తాంతమును ఈ విధముగా ఆస్వాదించిన వానికి ఉత్తములైన మనొరధములన్నీ సిద్ధించును . అతడు సకల పాపముల నుండియు ముక్తుడగును మరియు అతనితో పాటు పూర్వులైన 10 తరముల వారునూ ,తరువాత 10 తరముల వారును పరందామమును చేరుదురు . అట్లు చేరిన వారికి ఇక ఎన్నడును దుఖములే వుండవు . 

చైత్ర ,కార్తీక ,మాఘ మాసములయందు గల శుక్ల పక్షముల యందు 9 దినములలో రామాయణమును పారాయణము చేయుట ఎక్కువ ఫలమును ఇచ్చును . అట్లే దీక్షతో దానిని శ్రావణము చేయుట వలన కుడా ఆ ఫలితమును పొందవచ్చును . 
ఆది కావ్యమైన రామాయణము స్వర్గ సుఖములను ప్రసాదించును మోక్షమును ప్రాప్తింప చేయును . ఘోరమైన కలియుగము నందు వర్నాశ్రామాది ధర్మములన్నియు అడుగంటును అందువలన జనులు ఇహపర లాభాములకై వరుసగా 9 దినములు రామాయణ కదా శ్రవణము చేయవలెను . ఓ మహర్షులారా దుర్భరమైన ఈ కలియుగమున రామనామ జపపరులైన వారు రామనామ ప్రభావముచే క్రుతార్ధులగుదురు . వారిని కలియుగ బాధలు అంటవు . రామాయణ కధ పఠన ,శ్రవనములు జరిగెడి గృహము ఒక పుణ్య తీర్ధమై ఉండును . దుష్టులు సైతము ఆ ఇంట అడుగిడినచో వారి పాపములు సైతము అంతరించును . 
ఓ తపో ధనులారా శ్రీ మద్రామాయణమును భక్తి శ్రద్దలతో శ్రవణము చేయు నంత వరకు జనుల యొక్క దేహములు పాప భూయిష్టములై ఉండును . 
రామాయణ గాధను పఠన శ్రవణము లు చేసెడి బుద్ధి కలుగుత దుర్లభము . కోట్లకొలది జన్మల పుణ్య ఫల ప్రభావముననే ఆ జనులకు ఆ అదృష్టము పట్టును . 
ఓ ద్విజోత్తములారా చైత్ర ,కార్తీక ,మాఘ మాసముల యందు శుక్ల పక్షమున క్రమముగా 9 దినములు రామాయణ గాధను వినుత వలననే సౌదాసుడు శాప విముక్తుడయ్యెను . 
గౌతమ మహర్షిని అవమానించుట చే కలిగిన శాపముల వలన సౌదాసుడు అను వానికి రాక్షస రూపము ప్రాప్తించెను . రామాయణ శ్రవణ ప్రబావమున అతనికి ఆ శాపము నుండి విముక్తి లభించెను రామ భక్తి తత్పరుడై ఈ గాధను సావధానముగా వినిన మనుజుడు మహా పాపములనుండే గాక ఉప పాతకముల నుండియు విముక్తుడగును. 


     ఇతి ప్రధమోధ్యాయః సమాప్తః 


                 శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 













Sunday 29 May 2016

రామాయణం ప్రధమోధ్యాయః

                  రామాయణం 

                     వాల్మీకి విరచిత శ్రీ మధ్రామాయణం 

                            ప్రధమోధ్యాయః 

శ్రీ రామః శరణం సమస్త జగతాం రామం వినా కా గతీ 
రామేణ ,ప్రతి హాన్యతే కలిమలం రామాయ కార్యం నమః !
రామాత్ త్రస్యతి కాలభీమభుజగో రామస్య స్వరం వశే 
రామే భక్తిర ఖండితా భవతు మే రామ !త్వమేవాశ్రయః !

ఈ సమస్త జగత్తుకి శ్రీ రాముడే శరణ్యుడు . ఇహ పర లాభములకి మనకు రాముడే గతి . శ్రీ రాముని స్మరణ వల్లననే కలిదోషములన్నియు నశించును . సమస్త కార్యములును సిద్దించుటకై ఆయనకు నమస్కరింతును . భయంకరమైన కాల సర్పము శ్రీ రాముని కి భీతిల్లును . సమస్త జగత్తు శ్రీ రాముడి ఆధీనములోనే ఉండును . శ్రీ రాముని అందే నా అచంచలమైన భక్తి కుదురుకుని వుండు గాక . ఓ రామా నీవే నాకు దిక్కు . 


శ్రీ రామచంద్రుడు చిత్రకూట నివాసి ,సీతాదేవి యొక్క ఆనందమునకు నెలవైన వాడు . భక్తులకు అభయమిచ్చువాడు . పరమానంద స్వరూపుడు . అట్టి ప్రభువుకు ప్రణమిల్లెదను . 

లోక సాధకులైన బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులు  శ్రీ రాముని యొక్క అంశలే . పరమ పవిత్రుడు ,సచ్చిదానంద స్వరూపుడు . ఆది దేవుడైన శ్రీ రాముని నేను సర్వదా భజింతును . 

ఋషులు సూతునితో యిట్లనిరి 

ఓ పూజ్యుడా !నీవు గొప్ప విద్వాంసుడివి . మేము అడిగిన విషయములు అన్నిటిని చక్కగా విశదపరిచితివి . సంసార బంధములలో చిక్కుకున్న వారికి దుఖములు అనంతములు . ఈ సంసార బంధముల నుండి విముక్తి కలిగించువారెవరు ?వైదిక ధర్మములు అన్నియు కలియుగమున అనాదరణకు గురి అగునని నీవే చెప్పి ఉంటివి . అధర్మ మార్గములను అనుసరించేది వారికి సంభవించు తీవ్ర వేదనల గూర్చి నీవు తేట తెల్లము గావించితివి . "ఘోరమైన కలియుగము ప్రారంభమైనంతనే వైదిక ధర్మములు లుప్తమగును ,నాసికత్వం పెచ్చు పెరుగును . "అని పెద్దలందరు పేర్కొని యుండిరి . కలియుగమునందు జనులు కామాతురులు ,పొట్టివారు ,లోభులు అయివుందురు . వారు ధర్మమును ,అట్లే భగవంతుని కూడా ఆశ్రయింపక ,తమలో తాము ఒకరిపై ఒకరు ఆధారపడి వుందురు . కలియుగమున అందరు అల్పాయుష్కులు ,అధిక సంతానం కలవారు అగుదురు . స్త్రీలు తమ సౌందర్య పోశానలకే ప్రాధాన్యమిత్తురు . వారు స్వార్జితము మీద ఆధారపడి జీవించుటకు ప్రాకులాడుచుందురు . లావణ్యమును సాధనముగా చేసుకుని వేశ్యా వృత్తిని అవలంభించుటకు సిద్ధపడుచున్డురు . 
కలియుగమున వనితలు తరచుగా వ్యర్ధ సంభాషణము చేయుచు వుందురు . భిక్షాటులైన సన్యాసులు కుడా బంధు మిత్రుల సంబంధములలో చిక్కుకొని యుందురు . ఓ బ్రహ్మ జ్ఞాని ఘోరమైన ఈ కలియుగమున పాపాత్ములకు మనస్సుద్ది లేని వారికి నిష్కృతి ఎట్లు లభించును . ఓ దయానిదీ సర్వజ్ఞా !సూతా !దేవేశ్వరుడు ,దేవదేవుడు జగన్నాధుడు ఐన శ్రీరాముని సంతృప్తి పరచు ఉపాయము తెలుపుము . 

ఓ మహానుభావా !ఓ సూతా !ఈ విషయములు అన్నిటిని తేట తెల్లము గావింపుము . నీ వచనామృతము ఎవరికి తృప్తి గూర్చదు . 

సూతుడు ఇట్లనెను 

ఓ రుషీశ్వరులారా మీరు కోరిన విషయములన్నిటిని పూర్వము నారద మహర్షి సనత్కుమారునికి తెలిపి ఉండెను . ఇప్పుడు నేను మీకు తెలిపెదను సావధానముగా వినండి . శ్రీ మద్ రామాయణము ఒక మాహా కావ్యము . అది సర్వ వేదముల సారము మహా పాపములను సైతము అది రూపు మాపును . దుష్ట గ్రహ బాధలను తొలగించును . 
రామచంద్రుని గుణగణములను వర్ణించునట్టి ఈ కావ్యము దుస్స్వప్నములను తొలగించును . దుఖములను తొలగించును . ఇది ఐహిక భోగాబాగ్యములనే కాక మోక్ష ఫలములను గూడా ప్రాప్తింప చేయును . సకల శుభములను కలిగిమ్పచేయును . ఇది ప్రశంసా వహమైనది . ఓ మునులారా ఇది ధర్మార్ధ కామ మోక్షములనెడి చతుర్విధ పురుషార్ధ మహా ఫలములను ప్రసాదించునట్టి పెన్నిది . సాటిలేని ఈ కావ్యము ఫుణ్య ఫలమును ఒసంగును . మీరు ఈ విషయములను ఏకాగ్ర చిత్తులై వినుడు . గోహత్యాది మహా పాపములను చేసినవారు గాని అట్టి పాపాత్ములతో సాంగత్యము చేసిన వారు కాని ఋషి ప్రోక్తమైన ఈ కావ్యమును వినినచొ పవిత్రులగుదురు . 
 రామాయణ విషయమున భక్తి శ్రద్దలు గలవారు సమస్తములైన సాస్త్రార్ధాముల అందు ఆరితేరుదురు . వారి వలన లోకమునకు మేలు కలుగుచుండును . ఈ విధముగా వారు క్రుతార్దులగుదురు . 





                                శశి ,

    ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 



















Tuesday 17 May 2016

ఘుష్మేశ్వర జ్యోతిర్లింగం

                    ఘుష్మేశ్వర జ్యోతిర్లింగం 



ఘుష్మేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో వుంది . ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇదే ఆకరి జ్యోతిర్లింగం . దీనికి ఘుశ్మేశ్వరుడు ఘ్రునేశ్వరుడు అనే పేర్లు కుడా వున్నాయి . ఈ జ్యోతిర్లింగాన్ని గురించి ఓ పురాణ గాధ ప్రచారంలో వుంది . దక్షిణ దేశంలో దేవగిరి పర్వత సమీపంలో సుదాముడు అనే అత్యంత తేజశ్శాలి ,తపో నిష్టా గరిష్టుడు అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు . అతని బార్య పేరు సుదేహ ,వారిద్దరూ అన్యోన్యంగా ఎంతో ప్రేమా వుంటూ సంసార జీవితం సాగిస్తూ వుండేవారు . కాని ఎంత కాలానికి వారికి సంతానం మాత్రం కలుగలేదు . సుదేహ సంతానం కావాలని ఎంతగానో పరితపించిపోయింది . 
   సంతానం కోసం ఆమె పట్టుపట్టి సుదాముడికి తన చెల్లితో రెండో వివాహం జరిపించింది . భార్య సుదేహ కోరిక ,పట్టుదలపై ఆమె చెల్లెలు ఘుశ్మను పెళ్ళిచేసుకుంటాడు సుదాముడు . ఆమె శివభగవానుని భక్తురాలు . ఆ పరమేశ్వరుడి కరుణ వలన ఆమెకు పుత్రుడు జనియించాడు . ఇది సుదేహకు అసూయ కలిగించింది . చివరకు ఆమె ఆ బాలుడిని అంతం చేసేందుకు కుడా వెనుకాడలేదు . ఘుశ్మ అన్నింటికీ భగవానుడు వున్నాడనుకుని శివార్చనలో నిమగ్నమైనది . శివుడు ప్రత్యక్షమై ఆమె బిడ్డను ఆమెకు తిరి ఇవ్వటమే కాక ఇంతటి అకృత్యానికి పాల్పడిన సుదేహను శపించబోతుంటే ఘుశ్మ అడ్డుతగిలి తన సోదరిని క్షమించమని వేడుకుంది . అంతే కాదు లోక కళ్యాణార్ధం ఆ దేవా దేవుడిని అక్కడే కొలువై ఉండమని కోరింది ఆమె కోరికను మన్నించిన శివుడు అక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిసాడు . ఘుశ్మా దేవి ద్వారా ఆరాధించబడ్డ కారణంగా శివుడు అక్కడ ఘుష్మేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ది పొందాడు . 


సర్వే జనా సుఖినో భవంతు 


                                      శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 






Monday 16 May 2016

రామేశ్వర జ్యోతిర్లింగం

          రామేశ్వర జ్యోతిర్లింగం 

శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు లోని రామేశ్వరం లో వుంది . పురుషోత్తముడు అయిన శ్రీ రాముడే స్వయంగా ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ట చేసెను . సీతాన్వేషణలో శ్రీరామడు లంకకు పయనమై వెళుతుండగా దాహార్తుడై హిందు మహా సముద్రం చివరకు చేరుకున్నాడు . అక్కడ దాహం తీర్చుకోబోగా ఆకాశవాణి మాటలు ఈ విధముగా వినిపిస్తాయి . "నన్ను పూజించాకుండానే జలపానం చేస్తున్నావా "అని అప్పుడు రాముడు   ఇసుకతో శివ లింగాన్ని తయారు చేసి భక్తితో పూజిస్తాడు . అందుకు సంతుష్టుడైన శివుడు ప్రత్యక్షమై రావణుడి చర నుండి సీతను త్వరలోనే విడిపిస్తావు అని  ఆశీస్సులు అందిస్తాడు . ఈ జ్యోతిర్లింగం గురించి మరో కద కుడా ప్రచారంలో వుంది . రావణ వధానంతరం తనను దర్శించడానికి వచ్చిన ఋషి ,ముని పుంగవులతో రాముడు "రావణుని వధించిన పాపానికి ఏదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి "అని కోరతాడు . వారంతా శివ లింగాన్ని ప్రతిష్టించమని చెబుతారు . హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడానికి కైలాసానికి వెళ్ళాడు సమయము మించిపోతోందని సీతా దేవి సైకత లింగాన్ని చేయగా రాముడు సీతా సమేతుడై సైకతలింగాన్ని ప్రతిష్ట చేస్తాడు . కైలాసం నుండి వచ్చిన హనుమంతుడు అప్పటికే ప్రతిష్ట అయిపోవడం చూసి అలుకవహించాగా శ్రీ రాముడు ఆన్జనేయుడిని అనునయిస్తూ నీకు వీలయితే సైకత లింగాన్ని పెకలించమని చెబుతాడు . సైకత లింగాన్ని పెకలించ ప్రయత్నించిన హనుమంతుడు పెకలించలేకపోగా ఆమడ దూరంలో పడి  మూర్ఛ పోతాడు . మూర్చ నుండి తేరుకున్న హనుమంతుడు శివ మహిమను తెలుసుకుని పూజిస్తాడు . అప్పటి నుండి  భక్త వత్సలుడు భక్తుల పూజలు అందుకుంటూ వారి కోరికలను తీరుస్తున్నాడు . 



 హర హర మహాదేవ శంభో శంకరా . 


                                      శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 







Sunday 15 May 2016

నాగేశ్వర జ్యోతిర్లింగం

              నాగేశ్వర జ్యోతిర్లింగం 

శివ భగవానుడి సుప్రసిద్ద జ్యోతిర్లింగమైన  నాగేశ్వరజ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రం లోని ద్వారకలో వుంది . పూర్వం సుప్రియుడు అనే పేరుగల గొప్ప ధర్మాత్ముడు ,సదాచారుడు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు . అతడు పరమేశ్వరుడి కి అపార భక్తుడు . సుప్రియుడు ఎల్లప్పుడూ ఈశుడి అర్చనలో ,ఆరాధనలో ,ధ్యాన నిమగ్నుడై ఉండేవాడు . తన సమస్త కర్మలు శివునికే అర్పిస్తూ మనోవాక్కాయ కర్మల ద్వారా పరిపూర్ణంగా శివ ద్యానంలోనే గడిపేవాడు . ఇతని శివ భక్తిని చూసి దారుకుడు అనే రాక్షసుడు సహించలేకపోయాడు . అతని శివ పూజలని ఎలాగైనా నిరోధించాలని చూస్తూ ఉంటాడు . ఒకసారి సుప్రియుడు ఒక పడవలో ప్రయాణం చేయడం దారకుడి కంట పడింది . అదే అదనుగా భావించి పడవను ముట్టడించి ,సుప్రియుడిని ,మిగిలిన యాత్రికులని భందీలుగా చేసి తన రాజధాని లోని కారాగృహంలో భందించాడు . అల భందించడం వల్ల సుప్రియుడి శివ పూజలను నిరొధించగలిగాను అనుకుంటాడు . కాని సుప్రియుడు కారాగృహంలో కుడా నియమానుసారం శివ పూజలు చేస్తుంటాడు . అది తెలుసుకున్న దారకుడు కోపం పట్టలేక సుప్రియుడిని సంహరించబోతే శివుడు జ్యోతిర్లింగా రూపంలో ప్రత్యక్షమై సుప్రియుడికి పాశుపతాస్త్రాన్ని అందిస్తాడు . ఆ అస్త్రం తో సుప్రియుడు దారకుడిని సంహరిస్తాడు . శివ భగవానుడి అదేశానుసారమే ఈ జ్యోతిర్లింగానికి నాగేశ్వర జ్యోతిర్లింగం అనే పేరు వచ్చింది . అప్పటి నుండి శంకరుడు భక్తుల పూజలు అందుకుంటూ వారి  నెరవేరుస్తూ  వున్నాడు . 

హర హర మహాదేవ శంభో శంకరా 


                                   శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 








Saturday 14 May 2016

వైద్యనాధ జ్యోతిర్లింగం

             వైద్యనాధ జ్యోతిర్లింగం 

ప్రసిద్దమైన శ్రీ వైద్యనాధ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని భిర్ జిల్లాలోని పార్లిలో నెలకొనివుంది . ఒకసారి రాక్షస రాజు రావణాసురుడు హిమాలయానికి వెళ్లి శివ భగవానుడి దర్శనార్ధం ఘోర తపస్సుని చేసెను . ఆ తపస్సులో ఒకదాని తర్వాత ఒకటిగా తన శిరస్సులని ఖండించి శివలింగానికి అర్పణ చేసెను . ఆ విధంగా తన తొమ్మిది తలలను ఖండించి శివార్పణం చేసి ,పదవ తలను కూడా శివలింగానికి అర్పించబోవగా పరమేశ్వరుడు అత్యంత ప్రసన్నుడై అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు . శిరస్సుని ఖండించబోతున్న రావణుడి చేయిని పట్టుకుని అతని చర్యను నివారించి ,అంతకు ముందు తనకు సమర్పించిన తొమ్మిది తలలను యదా స్థానంలో ఉండేలా అనుగ్రహిస్తాడు . నీ తపస్సుకు మెచ్చానని ఏదైనా వరం కోరుకోమని ఆనతి ఇస్తాడు . అప్పుడు రావణుడు తనకు ప్రీతిపాత్రమైన శివలింగాన్ని తన రాజధాని లంకా నగరానికి తీసుకేల్లెందుకు అనుమతిని ఇవ్వమని కోరతాడు . ఆ వరం అనుగ్రహించి శివుడు ఓ షరతు కూడా పెడతాడు . మార్గ మద్యలో ఎక్కడా లింగానిని కింద పెట్టకుడదని ఆ షరతు . రావణుడు ఆ షరతుకు అంగీకరించి శివలింగాన్ని తీసుకుని లంకా నగరానికి పయనమవుతాడు . మార్గ మద్యం లో అనుకోని పరిస్థుతులలో ఓ గోపా బాలుని చేతిలో శివలింగం పెడతాడు . ఆ బాలుడికి శివలింగం భారంగా తోచడం చేత తప్పనిసరి పరిస్థుతులలో నేలపై పెడతాడు . ఆ తర్వాత రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని పైకెత్తలేకపోయాడు . అలా ఆ శివ లింగం వైద్యనాధ పేరుతో అక్కడే ప్రతిష్టించబడి పూజలు అందుకుంటోంది . 



హర హర మహాదేవ శంభో శంకరా 

                                                            శశి ,

                               ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 







                            

Thursday 12 May 2016

త్రయంభకేశ్వర జ్యోతిర్లింగం

               త్రయంభకేశ్వర జ్యోతిర్లింగం 



శ్రీ త్రయంభకేశ్వర జ్యోతిర్లింగం మహా రాష్ట్ర లోని నాసిక్ లో వుంది . శివ పురాణం లో ఈ జ్యోతిర్లింగానికి ఎంతో విశిష్ట స్థానం వుంది . ఒకసారి గౌతమ మహర్షి ఆశ్రమంలో నివసించే బ్రాహ్మణ పత్నులకు గౌతముని పైన ఆయన ధర్మ పత్ని అహల్య పైన అసూయ కలుగుతుంది . అప్పుడు వారందరూ తమ భర్తలను గౌతమ మహర్షికి అపకారం కలిగించేలా ప్రేరేపించారు . దీనికోసం బ్రాహ్మణులు అందరు గణపతిని ఆరాధన చేసి ప్రసన్నుడిని చేసుకుని గౌతముడిని ఆశ్రమం నుండి వెడల గొట్టే ఉపాయం అడుగుతారు . గణపతి విధి లేని పరిస్థితులలో గోవు రూపం దాల్చి గౌతముడి పొలానికి చేరి అక్కడ మేస్తుంటాడు . పొలం లోని పంటను అంతా నాశనం చేస్తున్న గోవుని చూసి గౌతముడు సుకుమారంగా ఓ గడ్డి పరకతో దానిని అదిలిస్తాడు . ఆ స్పర్శకే గోవు ప్రాణాలు విడుస్తుంది . గౌతముడు ఎంతో భాద పడి ఏదయినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటాడు . అప్పుడు శివుడు ప్రత్యక్షమై దుష్టులైన గౌతముడి ఆశ్రమ వాసులని అంతమొందిన్చాలనుకోగా గౌతముడు వారి తప్పులను మన్నించమని వేడుకుంటాడు . గౌతమ మహర్షి మాటలతో ఆగ్రహాన్ని విడిచిన శంకరుడు గోదావరిని పిలిచి అక్కడ నివాసం ఏర్పరుచుకోమంటాడు . గోదావరి అందుకు అంగీకరించి శివుడిని కుడా అక్కడే ఉండమని వేడుకోవడంతో శివుడు జ్యోతిర్లింగ రూపంలో వెలుస్తాడు . అప్పటి నుండి నాసిక్ లో శివ భగవానుడు త్రయంభకేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు . 


సర్వే జనా సుఖినో భవంతు . 

                                       శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 







Wednesday 11 May 2016

కాశి విశ్వనాధ జ్యోతిర్లింగం

          కాశి విశ్వనాధ జ్యోతిర్లింగం 

ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశ్వనాధ జ్యోతిర్లింగం ఒకటి  . హిందువులు పరమ పవిత్రం    భావించి  ఒక్కసారయినా దర్శించాలని అనుకునే దివ్య క్షేత్రం కాశి .  కాశి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో వుంది . ప్రళయ కాలం లో కుడా కాశి కి ఎ కొంచుం కూడా  విపత్తు  సంభవించదు . ఆ సమయం లో పరమేశ్వరుడు  తన నివాస స్థలమైన ఈ నగరాన్ని తన త్రిశూలం పై నిలుపుతాడు . సృష్టికి తొలి స్థలంగా ఈ నగరాన్ని పేర్కొంటారు . 


విష్ణు భగవానుడు  ఇక్కడే తపస్సు చేసెను . అగస్త్య మహర్షి ఇక్కడే శివుని గూర్చి తపస్సు చేసి శివుడిని సంతుష్టుడిని చేసుకొనెను . ఈ పరమ పవిత్ర నగరానికి ఉత్తరాన ఓంకారఖండం ,దక్షిణాన కేదారఖండం ,మద్యలో విశ్వేశ్వర ఖండం వున్నాయి . శక్తి మాత తపస్సు   చేసుకోవడానికి పరమేశ్వరుడు ఈ నగరాన్ని సృష్టించి తాను కుడా ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిసాడు . వారణాశి లో గంగా నదీ తీరం లో జ్యోతిర్లింగా రూపంలో శివభగవానుదు కాశి విశ్వనాదునిగా అనంత భక్త కోటి చేత విశేషమైన పూజలు అందుకుంటున్నాడు . ఇక్కడ గంగ హారతి ప్రసిద్ధం . 

 హర హర మహాదేవ శంభో శంకర 


శశి ,

                             ఎం . ఎ ( తెలుగు ),తెలుగు పండితులు . 















Tuesday 10 May 2016

భీమ శంకర జ్యోతిర్లింగం

                        భీమ శంకర జ్యోతిర్లింగం 

పవిత్ర పుణ్య క్షేత్రమైన ఈ భీమ శంకర జ్యోతిర్లింగం మహా రాష్ట్ర లోని పూనా లో భీమ నది ఒడ్డున వున్నది . భీమ రాక్షస సంహారం ఇక్కడ జరగడం వల్ల శివుడు భీమేశ్వర జ్యోతిర్లింగంగా ఇక్కడ ప్రసిద్ది పొందాడు.  భీ ముడనే మహా ప్రతాప శాలియైన  రాక్షసుడు  కామ రూప ప్రదేశం లో తన తల్లి తో కలిసి నివసిస్తూ ఉండేవాడు  ఆతను  రాక్షసేస్వరుడైన రావణుని కనిష్ట సోదరుడైన కుంభకర్ణుని కుమారుడు . అతని భాల్య దశలోనే తండ్రి శ్రీ రామ చంద్రుడి చేత  తన తండ్రి వదిన్చాబడ్డాడు అన్న విషయం  అతను యుక్త వయస్సు వచ్చిన తరువాత   తెలుసు కుంటాడు . అందుకు గాను శ్రీ రామ చంద్రుడి మీద పగ భూని తన  పగ ను  కోవడానికి  ఉపాయాలు ఆలొచిస్తూ  ఉంటాడు   అందుకై ఘోర తపస్సు  చేసి లోక  విజేతగా బ్రహ్మ దేవుడి నుండి వరము పొందుతాడు . తర్వాత కామ రూప దేశ రాజైన సుదక్షణ మహారాజుపై దండెత్తి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు . మహారాజుని అతని అనుచర వర్గాన్ని భందీలుగా చేసుకుంటాడు .   భీముని    కారాగారంలో  ఉన్న సుదక్షినుడు తనకి ఎదురుగా పార్ధివ శివలింగాన్ని ఉంచుకుని భగవానుని ధ్యానంలో  గడిపేవాడు . ఇది చుసిన రాక్షసుడు సహించలేక శివ లింగం పై కత్తి తీయగానే భీముడు భుడిదయ్యాడు ఈ అద్భుత కార్యాన్ని చూసిన ఋషులు  దేవతలు పరమేశ్వరుని " దేవ   దేవా లోక కళ్యాణార్ధం నీవు ఇక్కడే నివాసం వుండు నీ నివాసం వల్ల ఇది పవిత్ర ఫుణ్య క్షేత్రంగా ప్రసిద్దికేక్కుతుంది " అని ప్రార్ధించారు . అప్పటి నుండి అక్కడ భీమేశ్వరుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు . 



హర హర మహాదేవ శంభో శంకరా 





                                శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 





Monday 9 May 2016

కేదారనాధ జ్యోతిర్లింగం

            కేదారనాధ జ్యోతిర్లింగం 

ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత పుణ్య క్షేత్రంగా ప్రసిద్ది చెందిన శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం పర్వత రాజైన హిమవంతుని కేదారనామక శిఖరం పై వుంది .  ప్రకృతి శోభ ఆహ్లాద కరంగా వుంటుంది ఈ శిఖరం పశ్చిమ భాగంలో పుణ్యమతి మందాకినీ నదీ తీరంలో అవతరించిన కేదారేశ్వర మహా దేవ మందిరం వుంటుంది. శిఖరం తూర్పున అలకనందా నది యొక్క సుందర తీరంలో భదరీనాధుని ప్రసిద్ద మందిరం వుంది . అలకనందా నది మందాకినీ నదులు రెండు క్రిందకి వచ్చి రుద్రప్రయాగలో సంగమిస్తాయి . ఈ విధంగా పరమ పవిత్ర గంగ  నదీ  స్నానం చేసే భక్తులకు కేదారేశ్వర ,భదరీనాధు ల చరణాలు కడిగిన జలాల స్పర్శ లభిస్తుంది . 
     హిమాలయాలలోని కేదారశిఖరం పైన ధర్మ కుమారులైన నర నారాయణులు అనేక సంవత్సరాలు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేసారు . తపస్సు చేసినన్నాళ్లు ఒంటికాలిమీద నిలబడి నిరాహారులై శివనామ స్మరణ చేసారు . వారి భక్తీ లోని  తపస్సు లోని నియమ నిష్టలకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమై ఎం వరం కావాలో కోరుకోమన్నాడు . అప్పుడు నర నారాయణులు " నీవు లింగ రూపంలో ఇక్కడే ప్రతిష్టితమవ్వాలి . నీ నివాసంతో ఈ ప్రాంతమంతా పరం పవిత్రమవుతుంది ". అని భక్తి తో చేతులు జోడించారు . 
  శివ భగవానుడు వారి కోరికను మన్నించి మందాకినీ నదీ తీరంలో నర నారాయణులు తనను ప్రార్ధించిన ప్రదేశంలో లింగ రూపంలో వెలుస్తాడు . ఈ మహా శివ జ్యోతిర్లింగం పర్వత రాజైన హిమవంతుని కేదార నామ శిఖరం పై ఉండడంతో ఇది కేదార జ్యోతిర్లింగం గా ప్రసిద్ది చెందింది . 


హర హర మహాదేవ శంభో శంకరా . 


                                              శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 










Sunday 8 May 2016

ఓంకారేశ్వర జ్యోతిర్లింగం

           ఓంకారేశ్వర జ్యోతిర్లింగం 





ఓంకార జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లోని పవిత్ర నర్మదా నదీ తీరంలో వుంది.  ఈ ప్రదేశంలో నర్మదా నది రెండు పాయలుగా చీలి మధ్యప్రదేశం ఒక ద్వీపంగా ఏర్పడింది . ఈ ద్వీపాన్ని మాంధాత పర్వతమని ,శివపురి అని అంటారు . నది నుండి ఒక పాయ ఉత్తరం వైపుగా మరో పాయ దక్షిణం వైపుగా ప్రవహిస్తుంది . దక్షిణంవైపు ప్రవహించేదే ప్రధాన పాయగా గుర్తించబడుతోంది . మాంధాత పర్వతం మీద ఓంకారేశ్వర జ్యోతిర్లింగా దేవాలయం నెలకొని వున్నది . ప్రాచీన కాలంలో మాంధాత మహారాజు ఈ పర్వతం మీద గొప్ప తపస్సు చేసి శివ భగవానుని ప్రసన్నం చేసుకున్నాడు . ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి రెండు స్వరూపాలు వున్నాయి ఒకదానిని అమరేశ్వర నామంతో పిలుస్తారు . ఇది నర్మదా నది దక్షిణ తీరంలో ఓంకారేశ్వరుడికి కొద్ది దూరంలో వుంటుంది . వేరు వేరుగా వున్నా రెండింటిని ఒకటిగానే పరిగనిస్తారు . వీటికో పురాణ గాద వుంది . ఒకసారి నారద మహర్షి వింధ్య పర్వతం మీద తపస్సు చేస్తుండగా అతనికి వింధ్య పర్వతం కన్నా పెద్దది ఈ ప్రపంచంలోనే లేదన్నంతగా కనబడటమే కాక ఇది ఓ పెద్ద మానవాకారంలో కనబడుతుంది . అయితే నారదుడు మేరు పర్వతమే వింధ్య పర్వతం కన్నా పెద్దది అంటాడు . దానితో వింధ్య పర్వతుడు నర్మదా నది ఒడ్డున శివుని గురించి గొప్ప తపస్సు చేస్తాడు . వింధ్య తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం అనుగ్రహిస్తాడు . వింద్యాచాలానికి వరమిచ్చే వేల సమస్త ఋషులు, మునిగణంఇక్కడికి విచ్చేస్తారు . వారి ప్రార్ధనల ప్రకారం శివ భగవానుడు తన ఓంకారేశ్వర నామక లింగాన్ని రెండు భాగాలుగా చేసాడు . అలా ఒకదానికి ఓంకారేశ్వరుడు  ,రెండో దానికి అమరేశ్వరుడు అనే పేర్లు వచ్చాయి. 

హర హర మహాదేవ  శంభో శంకరా . 


                                             శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 











Saturday 7 May 2016

మహా కాళేశ్వర జ్యోతిర్లింగం

             మహా కాళేశ్వర జ్యోతిర్లింగం 



పరమ  పవిత్రమైన మహా కాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరం లో వుంది . క్షిప్రానదీ తీరంలో ఉన్న ఈ ఉజ్జయినీ నగరానికి "అవంతికాపురి "అనే పేరు కూడా వుంది . ఇది భారతదేశం లోని పరమ పవిత్రమైన సప్త నగరాలలో ఒకటి . ఈ జ్యోతిర్లింగం గురించి ఓ పురాణ గాధ ప్రచారం లో వుంది . పూర్వం అవంతికా పురంలో వేదాధ్యాయనా పరుడు తఫో నిష్టా గరిష్టుడు ,అత్యంత తేజశ్శాలి అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు . అతనికి శివ భక్తులు అయిన నలుగురు కుమారులు వున్నారు . అక్కడికి సమీపంలోని రత్నమాల పర్వతాలపై దూషణుడు అనే దుష్ట రాక్షసుడు తిరుగుతుండేవాడు . అతడు బ్రాహ్మణుల తపస్సుకు భంగం చేయాలన్న తలంపు తో అక్కడకు వచ్చాడు ఆ రాక్షసుడు బ్రహ్మ వరాలు పొందిన మహా శక్తి శాలి కుడా . వర గర్వంతో దూషణుడు చేసే అకృత్యాలు ఎవరు భారిమ్పలేనివిగా ఉండేవి .  దుష్ట దూషణుడు ఉజ్జయిని నగరాన్ని ముట్టడించి అక్కడంతా అల్లకల్లోలం సృష్టిస్తాడు . శివ భక్తులైన బ్రాహ్మకుమారులు నలుగురు తమ నగరాన్ని రక్షించమని శంకరుని శరణు కోరారు . వారలా శివుని ప్రార్ధించడం సహించలేని రాక్షసుడు ఉగ్రుడై వారు నలుగురిని అంతం చేయాలని అనుకుంటుండగా భక్త వత్సలుడు అయిన శివుడు తన హుంకారంతో ఆ రాక్షసుడిని అక్కడికక్కడే భాస్మమోనర్చాడు . భగవంతుడు అక్కడ హుంకార సహితంగా ప్రత్యక్ష మవడం వల్ల ఆయనకు మహా కాలుడు అనే పేరు వచ్చింది . అందువల్లే శివుడు అక్కడ మహ కాలేశ్వరుదు పేరుతో జ్యోతిర్లింగముగా వెలిసి భక్తుల కోరికలను తీరుస్తున్నాడు . 



హర హర మహాదేవ శంభో శంకరా . 


                                                  శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 







Friday 6 May 2016

మల్లికార్జున జ్యోతిర్లింగం

          మల్లికార్జున జ్యోతిర్లింగం

శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో శ్రీశైల శిఖరం పై వుంది . ఇది దక్షిణ కైలాసం గా పేరుగాంచింది . ఈ జ్యోతిర్లింగం గురించి శ్రీశైల మహత్యం గురించి పురాణ గాధలున్నాయి . శివుని కుమారులైన కార్తికేయుడు ,గణపతి తమకు వివాహము జరిపించమని తల్లితండ్రులైన పార్వతి పరమేశ్వరుల వద్దకు వెళ్తారు . ఎవరికీ వారు ముందుగా తమ వివాహమే జరిపించమని పట్టు పడతారు దానితో వారిద్దరికీ పార్వతీ పరమేశ్వరులు ఓ పరిక్ష పెడతారు . ఇద్దరిలో ఎవరు ముందుగా సమస్త భూమండలాన్ని చుట్టి వస్తారో వారికి ముందు వివాహం చేస్తామని చెబుతారు . కార్తికేయుడైన కుమారస్వామి  తన నెమలి వాహనాన్ని తీసుకుని ప్రదక్షణ చేసి రావాలని త్వరత్వరగా బయలుదేరి వెళతాడు . గణపతి స్తులకాయుడు అవటం వలన అందులో ఆయన వాహనం మూషికము అవడం వలన కుమారస్వామి  లాగా వేగిరపడక ఎదురుగా ఉన్న తల్లితండ్రులకు ప్రదక్షన చేయడం కంటే శాస్త్ర సమ్మతం అయినది ఏది ఉంటుందని సూక్షం తో తెలుసుకుని వారి చుట్టూ ఏడుసార్లు ప్రదక్షణ చేస్తాడు . కుమారస్వామి తన భుప్రదక్షణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసరికి వినాయకుడికి సిద్ది ,భుద్ది అనే ఇరువురు  వివాహం జరుగుతుంది . ఈ సంగటన కు కోపం పట్టలేని కుమారస్వామి క్రౌంచ పర్వతం మీదకు వెళ్ళిపోతాడు . కుమారుని అలక తీర్చడానికి తల్లి పార్వతి దేవి కుడా అతని వెంటే వెళ్ళింది . ఆమె వెనుకనే శంకరుడు కుడా వెళ్లి అక్కడ జ్యోతిర్లింగంగా వెలిసాడు . అప్పటి నుండి మల్లికార్జున జ్యోతిర్లింగం పేరుతో ప్రసిద్ది పొందాడు . ఈ లింగాన్ని మల్లికాపుష్పాలతో అర్చన చేసే సాంప్రదాయం వుంది . 

                                                          శ్రీశైల శిఖరం 

హర మహాదేవ శంభో శంకరా 

                                     శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు 






Thursday 5 May 2016

ద్వాదశ జ్యోతిర్లింగములు సోమనాధ జ్యోతిర్లింగం

                   ద్వాదశ జ్యోతిర్లింగములు 

                            సోమనాధ జ్యోతిర్లింగం 

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ సోమనాధ ఆలయం గుజరాత్ లోని "కథియవాడ "క్షేత్రం లోని సముద్ర తీరం లో వుంది . దీనినే ఇదివరకు "ప్రభాస క్షేత్రం "అని కూడా పిలిచేవారు . ఇక్కడి జ్యోతిర్లింగం గురించి ఒక పురాణ గాధ వుంది . 
    దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహము చేసాడు . కాని చంద్రుడు  మాత్రం దక్షుడి చిన్న కుమార్తె అయిన రోహిణి పైనే ఎక్కువ ప్రేమానురాగాలతో ఉండేవాడు . ఇది గమనించిన దక్షుడు తన అల్లుడికి ఎన్నో విధాల నచ్చచెప్ప చూసాడు . కానీ ప్రయోజనం లేకుండా పోయింది . దానితో ఉగ్రుడైన దక్షుడు చంద్రుని భయంకరమైన క్ష్యయ వ్యాధి గ్రస్తుడవు కమ్మని శపించాడు . ఆ శాపానికి చంద్రుడు సమస్త జగముపై తన సుదాశీలత్వాన్ని వర్షించే శక్తిని కోల్పోయాడు . అప్పుడు బ్రహ్మ దేవుడు చంద్రుడితో ప్రభాస క్షేత్రం లో మ్రుత్యుంజయుడైన శివుడిని ఆరాధిస్తే శాపవిమోచన మవడమే కాకుండా వ్యాధి నుండి విముక్తి లభిస్తుందని చెభుతాడు . శివుడికై చంద్రుడు తపస్సు చేయగా అమరత్వం కలిగేలా వరము ఇచ్చి దక్షుడి మాట ప్రకారము నెలలో 15 రోజులు నీ కళ తగ్గిపోతు వస్తుంది మరో 15 రోజులు నీ కళ రోజు రోజుకి పెరుగుతూ వెన్నెల వెలుగులు చిందిస్తావు . అని పరమేశ్వరుడు చెప్పగా చంద్రుడు సంతోషించి పార్వతీ దేవితో కూడి ఈ క్షెథ్రమన్దె నివసించమని శివుడిని కోరాడు . చంద్రుడి కోరిక మేరకు శివుడు జ్యోతిర్లింగ రూపంలో పార్వతి సమేతుడై ఈ సోమనాధ క్షేత్రంలోనే నివాసం ఏర్పరుచుకున్నాడు . చంద్రుడిని సోముడు అంటారు . చంద్రుడు శివుడిని తన నాదుడిగా భావించి తపస్సు చేసాడు కావున ఈ క్షేత్రానికి సోమనాధ క్షేత్రమనే పేరు స్తిరపడింది . 




సర్వే . జనా సుఖినో భవంతు . 
  

                                     శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 









Tuesday 3 May 2016

కుబేర వృత్తాంతం

                  కుబేర వృత్తాంతం 


పద్మ కల్పమందు పౌలస్త్యునకు అరిందముడు విశ్రవసుడను పేరున జన్మించెను . విస్రవసునకు వైశ్రవనుండు పుట్టెను . వైశ్రవనుండు ఘోర తపస్సు ఆచరించ శివుడు ప్రత్యక్షమై విశ్వకర్మ చే సముద్ర మధ్యంబున నిర్మింప చేసి దానికి  వైశ్రవనుని  ప్రభువును చేసెను . తర్వాత కొన్నాళ్ళకు వైశ్రవనుని సవతి తమ్ముడు అగు రావణాసురుడు వైశ్రవనుని తరిమివేసి లంక ను ఆక్రమించెను . అప్పుడు వైశ్రవనుడు పూర్వము శివుడు తన కొనగోటితో బ్రహ్మ శిరస్సుని నరికిన ప్రదేశంలో కాశి నగరమును ఏర్పరుచుకుని అందు లింగ ప్రతిష్ట కావించి పరదేవతా ప్రతిష్ట కావించి , ఉపవాసముతో ఒంటి కాలిపై నిలబడి ఘోర తపస్సు చేసెను . అంత కొన్ని దినములకు అతను చిక్కి శల్యమై ఎముకలు చర్మము మాత్రమే మిగిలెను . తపో వేడికి భయపడిన దేవతలు శివుడిని ప్రార్ధించ శివుడు ప్రత్యక్షమయ్యెను . వైశ్రవనుడిని వారము కోరుకోమనగా అతడు "శివా ఎల్లవేళలా నిన్ను పూజించు ఏకాగ్రతను ప్రసాధింపుము నీవు నాకు మిత్రుడుగా ఈ నగర మందే వుండు "అని కోరగా శివుడు సంతోషించి అతడిని యక్ష కిన్నేరులకు అధిపతిని చేసెను . కుబేరుడు అనే పేరుతో అలకాపురమును పాలించమని వరము ప్రసాదించెను . నవనిధుల నిషేపము గురించి చెప్పి మానవులకు ధనము ప్రసాదిస్తు ఉండమని ఆదేశించి అతని పూర్వ జన్మ వ్రుత్తాన్తములను తెలిపి అద్రుశ్యుడు అయ్యెను . ఆ కాశీ నగరములో పరమేశ్వరుడు బ్రహ్మచారిగా కొంత కాలము తపాస్సు చేసెను . పిదప కొంత కాలమునకు ఆత్మ శక్తి సతీ భవాని అనే పేరుతో పుట్టి శివుడిని వివాహము చేసుకొనెను . సతీ దేవి మరణా ననంతరం ఆమె చెవి ఈ నగరములో పడి అచట విశాలాక్షి పేరుతో వెలుగొన్దెను . తదనంతరం ఆమే పార్వతి పేరుతో జనించి శివుడిని చేరెను . 




సర్వే జనా సుఖినో భవంతు . 


                                                      శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 













కుబేర వృత్తాంతం

       కుబేర వృత్తాంతం (పార్ట్ -1)



కాంపిల్యము అను ఒక నగరమున వేద వేదాంగములు అధ్యయనము చేసి,సకల సద్గుణములు కలిగిన యజ్ఞదత్తుడు అను బ్రాహ్మణుడు నివసించుచుండెను . అతని కుమారుడు గుణనిధి గారాభముచే దుష్ట స్నేహితులను కలిగి సకల దురవ్యసనములకు లోనై  ఉండేవాడు . అతని తల్లి కొడుకు మీద ప్రేమతో అతడి దురవ్యసనములను భర్తకు తెలియకుండా రహస్యముగా వుంచేది . గుణనిధి ఒకరోజున జూదములో తన రత్నపు ఉంగరమును పోగోట్టుకొనేను . యజ్ఞదత్తుడు  రాజుగారి కొలువు నుండి వస్తూ తన కుమారుడు గుణనిధి ఉంగరమును ఒక జూదరి ధరించుట చూసి అతడిని నిందించెను . అతడు గుణనిధి దురవ్యసనముల గురించి తెలుపగా ఎంతో భాద పడుతూ ,ఇంటికి వచ్చి భార్యను నిందించెను . 
  గుణనిధి తన గురించి తండ్రికి తెలిసిందని తెలిసి బయముతో ఇల్లువదిలి పారిపోయెను . దూర దేశాలకు పోతూ ,మార్గ మద్యలో ఒక సరోవర తీరములో విశ్రమించి ,తర్వాత ఆ సరస్సులోని నీటిని తాగి తన తప్పును తలచుకొని భాదపడెను . ఆ దారిలో పరమ శివ భక్తుడు ఒకడు శివుడికి నైవేద్యము పెట్టడానికై అనేక రకముల పిండి వంటలను తీసుకుని వెళ్తుండగా గుణనిధి ఆకలి వలన అతడిని వెంబడించెను . ఆకలి భాదతో ఆ ఆహారమును ఎలాగైనా దొంగాలించాలని అక్కడే వేచి ఉండెను . నాడు మహా శివరాత్రి పర్వదినము అవటం వల్ల అందరు జాగారము చేస్తున్నారు . వారు నిద్రపోవువరకు వేచి వుండి గుణనిధి వారంతా నిద్రించిన తర్వాత శివాలయములోకి వెళ్లి ప్రసాద పాత్రను దొంగలించి పోవుచుండగా అతడి అడుగుల చప్పుడుకు ఒక భక్తుడికి మెలకువ వచ్చి దొంగ దొంగ అని అరవగా రాజ భటులు అతడిని వెంభడించి భానములతో కొట్టెను . దానితో గుణనిధి ప్రాణము పోయెను . గుణనిధి ప్రాణములు పోయినంతనే యమపురి నుండి యమభటులు ,కైలాసము నుండి శివ భటులు వచ్చారు . శివరాత్రి పర్వదినమున పరమశివుని దర్శించి లింగోద్భవ కాలము వరకు వేచివుండి ,శివ ప్రసాదమునకై పరితపించుతచే శివానుగ్రహమునకు పాత్రుడయ్యాడని శివ భటులు యమభటులకు ధర్మ సుక్ష్మములను వివరించి గుణనిధి ని కైలాసమునకు తీసుకుపోయెను . 
గుణనిధి శివాజ్ఞ ప్రకారము కలింగాధిపథి అగు నరిందముడు అనే రాజుకు కుమారుడై జన్మించి పూర్వ జన్మ వాసనా ప్రభావము వలన ,శివానుగ్రహము వలన బాల్యము నుండి శివభక్తుడై శివ ధర్మములోనరించుచు యుక్త వయస్కుడై రాజు అయ్యెను . సకల జన రంజకముగా పాలించుచు ,సత్కార్యములనోనరించుచు ,సంమార్గాములో పుణ్యము గడించి మరణించెను . ఆ ఫున్య ఫలము చేత అతడు అలకానగారాదీశుడై ,శివుడికి పరమ మిత్రుడై సిరులను పొంది కుబేరుడు అనే పేరుతో ప్రసిద్దుడయ్యేను . 


                               శశి ,

ఎం . ఎ ,(తెలుగు ),తెలుగు పండితులు . 








Monday 2 May 2016

సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -8 )

              సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -8 )

ఆ విధముగా సతీ దేవి దేహమును విడువక పరమేశ్వరుడు వైరాగ్యములో మునిగి పోయి లోకమును, ఎవ్వరుని పట్టించుకోకుండా ఉండెను . ఆయన వైరాగ్యమును తొలగించమని దేవతలు అందరు విష్ణుమూర్తి ని వేడుకోగా విష్ణుమూర్తి జగత్ కళ్యాణార్ధం సతీ దేవి దేహమును సుదర్శన చక్రముతో చేదించెను . ఆ సమయములో సతీదేవి దేహమునుండి ఒక సర్వ లోక భయప్రదం అగు జ్యాల వెలువడి జ్యాలాముఖి నామమున నేటికి ఆ జ్యాల నిర్విరామముగా వెలుగుతూనే వుంది . పరమ పవిత్రమైన సతీ దేహము సుదర్శన చక్రము వలన 108ప్రదేశములలో భాగములు పడెను . వాటిలో 18 ముఖ్యమైనవి అవే అష్టాదశ శక్తి పీటాలు 

ఆవిధముగా తనువు చాలించిన సతీ దేవి హిమవత్ పర్వత రాజు పుత్రికగా జన్మించి సదా శివుని ఆరాధించి ఆతడిని భర్తగా పొందెను . 

                   శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 









Sunday 1 May 2016

           సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -8)

దక్షుడి యజ్ఞం  విధముగా భగ్నమవుటచే చిన్నాభిన్నులైన రుత్వికులు ,మునిగణములు బ్రహ్మ  సహా వైకుంఠ మునకు వెళ్లి దామోదరుడిని మొక్కి దేవతలను , రక్షింపమని వేడుకొనిరి . విష్ణుమూర్తి లక్ష్మీ దేవితో సహా కైలాసమునకు వెళ్ళిరి . ఆ సమయములో పరమేశ్వరుడు భాదతో నారాయణుడి మంత్రము పటించుచు ఉండెను . వీరభాద్రాది గణములు అందరు శివుని కొలుచుచు వుండిరి . అప్పుడు విష్ణుమూర్తి శివుడిని విచారము వీడమని ప్రస్తుత కార్యక్రమము ఆలోచింపమని కోరెను . దక్షుడు తన పాపములకు ఫలితము అనుభవించెను . దక్ష యజ్ఞము పూర్తి కాని పక్షములో లోకములో కరువు కాటకములు ఏర్పడి సృష్టి కార్యక్రమమునకు భంగము వాటిల్లును . లోక కళ్యాణం కోసం దక్ష యజ్ఞము పూర్తి అగునట్లు చేయమని హరి అడుగుట చేత ,దయాళువు భక్త సులభుడు అగు శంకరుడు ,సరే అని తన గణముతో ,వచ్చిన వారందరితో దక్ష యజ్ఞ వాటికకు వెళ్ళెను . దక్షుడి శిరము కనిపించకపోవడంతో ఉత్తరముగా శిరస్సు వుంచి పడుకున్న గొర్రె తల నరికి తెప్పించి దానిని దక్షుడి దేహమునకు అతికించెను . పరమేశ్వరుడి కరుణా కటాక్షములతో దక్షుడు నిద్ర మేల్కొనినట్లులేచి కూర్చుండెను . ఎదురుగా ఉన్న శివుడిని చూసి నమస్కరించి చనిపోయిన కూతురును తలచుకుని మనసంతా భాదతో నిండిపోగా మాట్లాడలేకున్నా ,దైర్యము తెచ్చుకుని శివుడిని స్తుతించెను . 
అప్పుడు శివుడు దక్షుడికి హితవు చెప్పి శివకేశవులు ఒకటే అని చెప్పి యజ్ఞము పూర్తి చేయమని చెప్పెను . దక్షుడు దేవతలందరికీ హవిస్సులు ఇచ్చి సంపూర్ణ భాగము శివుడికి ఇచ్చి యజ్ఞము పూర్తి చేసెను . అంత బ్రహ్మ విష్ణువు ,అకిల దేవతలు ,మునీంద్రులు ,సంతోషముతో శివుడి కీర్తిని పొగుడుతూ గానము చేస్తూ వారి వారి నివాస స్థలములకు వెళ్ళెను . శివుడు  మండుతున్న సతీ దేవి దేహమును చూసి భాద అదికమవగా ఆ మండుతున్న దేహమును భూజమున ధరించి వెళ్ళిపోయెను . 


  



                                                శశి ,

ఎమ్. ఎ (తెలుగు ),తెలుగు పండితులు