Tuesday 10 May 2016

భీమ శంకర జ్యోతిర్లింగం

                        భీమ శంకర జ్యోతిర్లింగం 

పవిత్ర పుణ్య క్షేత్రమైన ఈ భీమ శంకర జ్యోతిర్లింగం మహా రాష్ట్ర లోని పూనా లో భీమ నది ఒడ్డున వున్నది . భీమ రాక్షస సంహారం ఇక్కడ జరగడం వల్ల శివుడు భీమేశ్వర జ్యోతిర్లింగంగా ఇక్కడ ప్రసిద్ది పొందాడు.  భీ ముడనే మహా ప్రతాప శాలియైన  రాక్షసుడు  కామ రూప ప్రదేశం లో తన తల్లి తో కలిసి నివసిస్తూ ఉండేవాడు  ఆతను  రాక్షసేస్వరుడైన రావణుని కనిష్ట సోదరుడైన కుంభకర్ణుని కుమారుడు . అతని భాల్య దశలోనే తండ్రి శ్రీ రామ చంద్రుడి చేత  తన తండ్రి వదిన్చాబడ్డాడు అన్న విషయం  అతను యుక్త వయస్సు వచ్చిన తరువాత   తెలుసు కుంటాడు . అందుకు గాను శ్రీ రామ చంద్రుడి మీద పగ భూని తన  పగ ను  కోవడానికి  ఉపాయాలు ఆలొచిస్తూ  ఉంటాడు   అందుకై ఘోర తపస్సు  చేసి లోక  విజేతగా బ్రహ్మ దేవుడి నుండి వరము పొందుతాడు . తర్వాత కామ రూప దేశ రాజైన సుదక్షణ మహారాజుపై దండెత్తి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు . మహారాజుని అతని అనుచర వర్గాన్ని భందీలుగా చేసుకుంటాడు .   భీముని    కారాగారంలో  ఉన్న సుదక్షినుడు తనకి ఎదురుగా పార్ధివ శివలింగాన్ని ఉంచుకుని భగవానుని ధ్యానంలో  గడిపేవాడు . ఇది చుసిన రాక్షసుడు సహించలేక శివ లింగం పై కత్తి తీయగానే భీముడు భుడిదయ్యాడు ఈ అద్భుత కార్యాన్ని చూసిన ఋషులు  దేవతలు పరమేశ్వరుని " దేవ   దేవా లోక కళ్యాణార్ధం నీవు ఇక్కడే నివాసం వుండు నీ నివాసం వల్ల ఇది పవిత్ర ఫుణ్య క్షేత్రంగా ప్రసిద్దికేక్కుతుంది " అని ప్రార్ధించారు . అప్పటి నుండి అక్కడ భీమేశ్వరుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు . 



హర హర మహాదేవ శంభో శంకరా 





                                శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment