సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -8 )
ఆ విధముగా సతీ దేవి దేహమును విడువక పరమేశ్వరుడు వైరాగ్యములో మునిగి పోయి లోకమును, ఎవ్వరుని పట్టించుకోకుండా ఉండెను . ఆయన వైరాగ్యమును తొలగించమని దేవతలు అందరు విష్ణుమూర్తి ని వేడుకోగా విష్ణుమూర్తి జగత్ కళ్యాణార్ధం సతీ దేవి దేహమును సుదర్శన చక్రముతో చేదించెను . ఆ సమయములో సతీదేవి దేహమునుండి ఒక సర్వ లోక భయప్రదం అగు జ్యాల వెలువడి జ్యాలాముఖి నామమున నేటికి ఆ జ్యాల నిర్విరామముగా వెలుగుతూనే వుంది . పరమ పవిత్రమైన సతీ దేహము సుదర్శన చక్రము వలన 108ప్రదేశములలో భాగములు పడెను . వాటిలో 18 ముఖ్యమైనవి అవే అష్టాదశ శక్తి పీటాలు
ఆవిధముగా తనువు చాలించిన సతీ దేవి హిమవత్ పర్వత రాజు పుత్రికగా జన్మించి సదా శివుని ఆరాధించి ఆతడిని భర్తగా పొందెను .
శశి ,
ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment