రామాయణము
సుందరకాండ -నలుబదియైదవసర్గ
ఎనబదివేలమంది మరణించారని తెలిసి ఆరి బంధువులంతా కన్నీరుమున్నీరు అయ్యారు . రావణుడి ఆదేశము ప్రకారము ఏడుగురు మంత్రి పుత్రులు మిక్కిలి బలశాలురైన తమ బలముతో కలిసి నేను ముందంటే నేను ముందని పోటీపడుతూ హనుమపైకి యుద్ధమునకు బంగారు రాధములపై బయలుదేరిరి . హనుమ వున్నా ప్రదేశమునకు వెళ్లి ఆకాశమును తాకుతున్నాడా అన్నట్లున్న హనుమను చూసిరి .
వెనువెంటనే వారు హనుమపై బాణముల వర్షము కురిపించిరి . ఆకాశమార్గములోకి ఎగిరి హనుమ ఆ బాణముల పరంపరను చెల్లాచెదురు చేసి ఆ మహా సైన్యమునకు వణుకు పుట్టేటట్లు భయంకరముగా గర్జించెను . పిమ్మట అతడు ఆ రాక్షసయోధులను హతమార్చుటకు విజృంభించెను .
వారిలో కొందరిని హనుమ అరచేతితో చావకొట్టెను . కాళ్లతో తన్నుతూ కొందరిని ,ముష్టిఘాతముతో మరికొందరిని ,మట్టికరిపించెను . గోళ్ళతో కొందరిని చీల్చిచెండాడెను . తన వక్షస్థలముతో కొందరిని తొడలతాకిడితో మరికొందరిని నుగ్గునుగ్గు కావించెను . కొందరు మారుతి గర్జనకే హడలి చచ్చిరి . ఇలా రాక్షసయోధులందరూ రణభూమికి బాలి కాగా బతికి బయటపడ్డ సైనికులు భయకంపితులై అన్ని దిశలకూ పారిపోయిరి .
ఏనుగులు ,గుఱ్ఱములు ఎక్కడికక్కడ చచ్చిపడివుండెను . రథముల పైకప్పులు విరిగి ,ధ్వజపటములు ముక్కలుముక్కలై రాణాభియమి అంతటా చెల్లాచెదురుగా పడిఉండెను . ఆ ప్రదేశము అంతా శత్రువుల రక్తముతో కాలువలా మారెను . లంక అంతా వివిధమైన వికారధ్వనులతో మారుమ్రోగేను . మహా బలసంపన్నుడు ,చందాపరాక్రమశాలి ఐన హనుమ ఇంకా రాక్షసులతో యుద్ధము చేయకోరి మరల అదే ప్రదేశములో ఎత్తైన చోట నుంచుని ఎదురుచూడసాగెను .
రామాయణము సుందరకాండ నలుబదియైదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .
No comments:
Post a Comment