రామాయణము
సుందరకాండ -ఏబది ఎనిమిదవసర్గ
వానరులంతా హనుమ చుట్టూ చేరి అక్కడి విశేషములను అడిగిరి . అప్పుడు హనుమ సవివరముగా తానూ సముద్రమును లంఘించుట ,దారిలో తనకు ఆటంకములు వచ్చుట ,మైనాక పర్వతము అడ్డుగా వచ్చుట ,లంకా నగరమును చేరుట లంకిణిని ఓడించుట ,లంకా నగర ప్రవేశము సీతాదేవి కొరకు లంకా నగరమును వెతుకుట ,ఎట్టకేలకు సీతామాతను కనిపెట్టుట ,అప్పుడే అక్కడికి వచ్చిన రావణుని సీతాదేవి తిరస్కరించుట ,రాక్షస స్త్రీలు సీతాదేవిని బయపెట్టుట, ఆమె ఆత్మహత్య చేసుకోనాలని ఆలోచించుట ,సీతాదేవితో తను మాట్లాడుట ధైర్యము చెప్పుట ,పిమ్మట అశోకవన ధ్వంసము ,రాక్షసులతో యుద్ధము ,పిమ్మట వారికి లొంగిపోవుట ,తోకకు నిప్పు అంటించుట ,లంకానగరమునకు నిప్పు పెట్టుట ,సీతాదేవి క్షేమమును కళ్లారా చూసి తిరిగి వచ్చుట మొదలగు విషయములన్నీ చెప్పెను .
రామాయణము సుందరకాండ ఏబదియెనిమిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment