Wednesday 22 May 2019

రామాయణము సుందరకాండ - ఏబదిఆరవసర్గ

                                         రామాయణము 

                                     

                                           సుందరకాండ -  ఏబదిఆరవసర్గ 

పిమ్మట హనుమంతుడు అశోక వృక్ష ఛాయలో ఆసీనురాలైయున్న సీతాదేవికి పాదాభివందనం చేసి "అమ్మా ! దైవానుగ్రహముచేత ఎట్టి అపాయమునకు లోను కాకు సురక్షితముగా నిన్న చూడ గలుగుతున్నాను ". అని పలికెను . 

అప్పుడు సీతాదేవి తిరుగుప్రయాణమవుతున్న హనుమకు జాగ్రత్త చెప్పెను . హనుమ సేతాదేవితో వెళ్లివస్తానని చెప్పి దైర్యంగా ఉండమని చెప్పి , పెద్దగా "నా పేరు హనుమ నేను శ్రీ రాముని దూతను "అని అరిచి తిరుగు ప్రయాణమైయ్యను .
లంక నగరము నుండి బయటకువచ్చిన్న హనుమ అరిష్టము అని పర్వతము  దగ్గరకు సముద్రమును లంఘించుటకు  వచ్చెను  మహాబలశాలి ఐన హనుమ  పాదములదాటికి తట్టుకొనలేక ఆ మహా పర్వతము నేల లోకి కృంగిపోయి  నేలతోసమానమయ్యెను అప్పుడు ఆ పర్వతముపై నివసించుచున్న నాగులు,  కిన్నెరులు గంధర్వులు,   యక్షులు,   విద్యాధరులు మొదలగువారు భయభ్రాంతులకు  లోనై ఆపర్వతమును వదిలి ఆకాశమునకు చేరిరి.  ఆలా పైకి ఎగిరిన హనుమ సముద్రమును లంఘించుట ఆరంభించెను . 


రామాయణము సుందరకాండ ఏబదిఆరవ సరిగా సమాప్తం . 

  

శశి , 

ఎం.ఏ , ఎం.ఏ (తెలుగు), తెలుగు పండితులు . 




No comments:

Post a Comment