రామాయణము
సుందరకాండ - ఏబదిఆరవసర్గ
పిమ్మట హనుమంతుడు అశోక వృక్ష ఛాయలో ఆసీనురాలైయున్న సీతాదేవికి పాదాభివందనం చేసి "అమ్మా ! దైవానుగ్రహముచేత ఎట్టి అపాయమునకు లోను కాకు సురక్షితముగా నిన్న చూడ గలుగుతున్నాను ". అని పలికెను .
అప్పుడు సీతాదేవి తిరుగుప్రయాణమవుతున్న హనుమకు జాగ్రత్త చెప్పెను . హనుమ సేతాదేవితో వెళ్లివస్తానని చెప్పి దైర్యంగా ఉండమని చెప్పి , పెద్దగా "నా పేరు హనుమ నేను శ్రీ రాముని దూతను "అని అరిచి తిరుగు ప్రయాణమైయ్యను .
లంక నగరము నుండి బయటకువచ్చిన్న హనుమ అరిష్టము అని పర్వతము దగ్గరకు సముద్రమును లంఘించుటకు వచ్చెను మహాబలశాలి ఐన హనుమ పాదములదాటికి తట్టుకొనలేక ఆ మహా పర్వతము నేల లోకి కృంగిపోయి నేలతోసమానమయ్యెను అప్పుడు ఆ పర్వతముపై నివసించుచున్న నాగులు, కిన్నెరులు గంధర్వులు, యక్షులు, విద్యాధరులు మొదలగువారు భయభ్రాంతులకు లోనై ఆపర్వతమును వదిలి ఆకాశమునకు చేరిరి. ఆలా పైకి ఎగిరిన హనుమ సముద్రమును లంఘించుట ఆరంభించెను .
రామాయణము సుందరకాండ ఏబదిఆరవ సరిగా సమాప్తం .
శశి ,
ఎం.ఏ , ఎం.ఏ (తెలుగు), తెలుగు పండితులు .
No comments:
Post a Comment