రామాయణము
సుందరకాండ -ఆరుదియొకటవసర్గ
జాంబవంతుడు పలికిన మాటలకు వానరులందరూ సమ్మతించి ,మహేంద్రగిరి నుండి పైకి ఎగిరిరి . పిమ్మట వారందరూ తిన్నగా రామలక్ష్మణ సుగ్రీవుల వద్దకు వెళ్లక దారిలో వున్న మధు వనములో ప్రవేశించి ,అచటి ఫలములను తిని మధువులను త్రాగిరి .
ఈ మధువనము సుగ్రీవునికి అత్యంత ఇష్టమైన వనము సుగ్రీవునికి బయపడి వానరులెవ్వరూ ఆ వనంలోకి ప్రవేశించు సాహసము చేయరు . సీతాదేవి జాడను కనిపెట్టిన సంతోషముతో ఇప్పుడు హనుమదాది వీఁరులంతా మధువనంలోకి ప్రవేశించిరి .
వారందరూ కడుపు నిండుగా ఫలములను భుజించిరి . మధువును త్రాగిరి . కొందరు వానరులు ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదికి దూకిరి . ఇంకొందరు నవ్వుచుండిరి . మరికొందరు ఏడ్చుచుండిరి . కొంతమంది పాటలు పాడుచుండిరి , ఇంకొంతమంది నాట్యము చేయుచుండిరి ,పెక్కుమంది అక్కడి వృక్షములను ధ్వంసము చేయుచుండిరి .
ఈ విధముగా వారు ఆ మధువనములో విజృంభించుచుండగా ఆ వన పాలకుడు ,సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు వారందరీ అదిలించ ప్రయత్నము చేసెను . కానీ వానరులెవరూ పట్టించుకోకపోవువటంతో వారిలో కొందరిని చేతితో చరిచి ,పెద్దగా అరిచి వారిని ఆ వనము నుండి బయటకు పంపించు ప్రయత్నము చేసెను . అప్పుడు ఆ వానరులలో కొందరు దధిముఖుడను కొట్టిరి ,ఇంకొందరు రక్కిరి ,మరికొందరు కొరికిరి . ఈ విధముగా దధిముఖుడను హింసించి బయటకు ప్రాలద్రోలిరి .
రామాయణము సుందరకాండ అరువదియొకటవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment