Tuesday 28 May 2019

రామాయణము సుందరకాండ -అరువదిరెండవసర్గ

                                  రామాయణము 

                                         సుందరకాండ -అరువదిరెండవసర్గ 

దధిముఖుడు వెళ్లిన పిమ్మట వానరవీరులు మధువులు త్రాగుతూ ఆడుతూ అరుచుచూ మితిమీరిన సంతోషముతో ఒకరినొకరు కిందపడవేస్తూ ,నవ్వుతూ ఆడుతూ ,తూలుతూ ,ఎక్కువైన మధువును వలకపోస్తూ గoతులువేయసాగిరి . అప్పుడు ఆ వన సంరక్షకులు తమ నాయకుడైన దధిముఖుడని ఈదర ఉంచుకుని ,తమ బలముతో వానరులనుచెదర కొట్టాలని పెద్ద పెద్ద చెట్లను పీకి వానరులను వాటితో కొట్టుటకు వచ్చిరి .అది చూసిన హనుమ అంగదుడు వారిని చిత్తుచిత్తుగా కొట్టి వెళ్లకొట్టిరి . 
అప్పుడు దధిముఖుడు తన సైన్యముతో "వారిని ఇక్కడే ఉండనివ్వండి . సుగ్రీవునికి ఈ వనమన్న ప్రాణము . వీరు ఈ వనమును ధ్వంసము చేయుచున్నారని తెలిసినచో మన ప్రభువు వీరందరికి మరణదండన విధించును . ఇప్పుడు ఆయన శ్రీరాముని వద్ద వున్నాడు . మనము అక్కడికే వెళ్లి ఈ విషయమును వివరించి చెబుదాము . "అని పలికి తన అనుచరులతో సహా ఆకాశములోకి ఎగిరి రామలక్ష్మణ సుగ్రీవులు ఉన్న వనమునకు వెళ్లెను 

రామాయణము సుందరకాండ అరువదిరెండవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment