Monday 6 May 2019

రామాయణము సుందరకాండ -నలుబదినాలుగవసర్గ

                                   రామాయణము 

                           సుందరకాండ -నలుబదినాలుగవసర్గ 

మిక్కిలి బలశాలి ఐన ప్రహస్తుని కుమారుడైన జంబుమాలి రావణుడి ఆదేశము మేరకు హనుమ బంధించుటకు వచ్చెను . వచ్చునప్పుడు తన ధనస్సుతో ధనుష్టంకారము చేసెను . రాగానే ముఖద్వారం పైనవున్న హనుమపైకి వాడి ఐన బాణములను ప్రయోగించాడు . హనుమంతుడి ముఖంపై ఒక అర్ధచంద్రాకార బాణము ,శిరస్సుపై వంకర ములికి కల బాణము ,బాహువులపై 10 బాణములను ప్రయోగించి ఆయనను బాధించెను . జమ్బుమాలీ చే కొట్టబడిన హనుమ ముఖము ఎర్రగా మారెను . 
అప్పుడు హనుమ మిక్కిలి కోపముతో ,పక్కనే వున్నా ఒక మహాశిలను పెకలించి ఆ రాక్షసుడిపై విసిరెను . జంబుమాలి పది బాణములతో దానిని ముక్కలు చేసెను . అది చూసిన హనుమ కోపముతో ఒక పెద్ద మద్ది చెట్టుని పీకి దానిని త్రిప్పసాగెను . జంబుమాలి నాలుగు బాణములతో ఆ వృక్షమును ముక్కలుగా చేసెను . భుజములపై అయిదు బాణములు ,గుండెపై ఒక బాణము ,వక్షస్థలమున పది బాణములు వేసి జంబుమాలి హనుమను బాధించెను . శరీరము నిండా బాణములు గుచ్చుకోవటంతో హనుమ కోపము రెట్టింపు అయ్యెను . అప్పుడు హనుమ ఆ ద్వారము ను ఊడబెరికి దానిని వేగముగా తిప్పెను . 
వాయుసుతుడైన హనుమ ఆ ద్వారముతో జంబుమాలి గుండెలపై కొట్టెను .

 ఆ దాటికి జంబుమాలి అతడి  రధసారధి ,రధము ,గుఱ్ఱములు నుగ్గునుగ్గు అయ్యెను . మహాబలశాలురు ఐన ఏలుబదివేలమంది వీరులు ,జంబుమాలి మొరాయించిన విషయము విని రావణుడు కోపముతో గుడ్లురుముతూ ,పళ్ళుకొరుకుతూ ,మిక్కిలి బాల పరాక్రమములు కల అమాత్య పుత్రులను హనుమంతుడితో తలపడుటకు వెంటనే పంపెను . 

 రామాయణము సుందరకాండ నలుబదినాలుగవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





 

No comments:

Post a Comment