రామాయణము
యుద్ధకాండ -ఆరవసర్గ
హనుమ లంకా నగరమును ధ్వంసము చేసి వెళ్లిన పిమ్మట రావణుడు ప్రముఖులైన రాక్షసవీరులతో తన మంత్రులతో సమావేశమయ్యెను . పిమ్మట వారితో "ఓ రాక్షసులారా !శత్రుదుర్భేద్యమైన ఈ లంకా నగరంలోకి ఒక వానరుడు ప్రవేశించి ,జానకిని దర్శించగలిగెను . అశోకవనమును ధ్వంసము చేసెను . లంకా నగరంలోని బవనములను ధ్వంసము చేసెను . ఇప్పుడు రాక్షసుల రక్షణార్ధము ఏమి చేయవలెనో ఆలోచించుడు . ఆ వానరం మాటలు బట్టీ త్వరలోనే రాముడు కూడా ఇక్కడికి రాగలడని నాకు అనిపిస్తోంది . అతడి పరాక్రమమును నేను ఇంతకూ ముందే విని ఉన్నాను . అతడే అలా రావాలని అనుకుంటే అతడు అపారమైన సముద్రమును అవలీలగా దాటగలడు . లేదా మరో మార్గము ద్వారా అయినా లంకకు చేరగలడు . కావున వానరులను ఎదుర్కొనుటకు ,,మన లంకా నగరమును సైన్యమును కాపాడుటకు తగిన సలహాలు ఇవ్వండి "అని పలికెను .
రామాయణము యుద్ధకాండ ఆరవసర్గసమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment