Monday 17 June 2019

రామాయణము యుద్ధకాండ -పన్నెండవసర్గ

                                 రామాయణము 

                                   యుద్ధకాండ -పన్నెండవసర్గ 

రావణుడు సభలో వేంచేసి ఉన్న రాక్షస ప్రముఖులందరినీ చూసి "ఓ రాక్షప్రముఖులారా !రాముడు సుగ్రీవుడితో కూడి సమస్త వానర భల్లూక సేనలతో కలిసి సముద్రము ఆవలి తీరమునకు చేరినాడు అని మన గూఢచారులద్వారా తెలిసినది . ఏది ఏమయినప్పటికీ సీతను రాముడికి అప్పగించేది లేదు . సీతను నేను చాలా ఇష్టపడి తీసుకువచ్చాను . ఆమె తన మనసు మార్చుకొనుటకు ఒక సంవత్సరము గడువు ఇచ్చాను . ఇప్పుడు మన తక్షణ కర్తవ్యమును ఆలోచించండి . కుంభకర్ణుడు 6 నెలల నుండి నిద్రలో వున్నాడు . ఈరోజే నిద్రలేచాడు సభకు కూడా వచ్చి వున్నాడు "అని పలికెను .

అప్పుడు విషయము అంతా తెలుసుకున్న కుంభకర్ణుడు రావణునితో "అన్నా !నీవు సీతాదేవి విషయములో చేసినది చాలా తప్పు నిన్ను ఇప్పటివరకు రాముడు చంపకుండా ఉండుట ,నీ అదృష్టము . నీవు ఇప్పుడు సలహా అడుగుట కంటే ,సీతాదేవిని అపహరించునపుడు మా అందరి సలహా అడిగివుంటే బాగుండేది . సరే జరిగినదేదో జరిగినది . యుద్ధ విషయములో నీవు బయపడనవసరము లేదు . రాముడు ఒక బాణము వేసి ,రెండవ బాణము తీసే లోపల నేను అతడి రక్తమును మొత్తము త్రాగివేసెదను . పర్వతాకారములో ఉన్నశరీరముతో నేను యుద్ధరంగములో ఉండగా నన్ను జయించుట దేవేంద్రుడికి సైతము సాధ్యము కాదు . ఇక సాధారణ మానవుడైన ,శ్రీరాముడు ఒక లెక్కా ?వారనులందరిని చంపివేయుదును . రాముడు మృత్యు ముఖమునకు చేరిన పిమ్మట సేత శాశ్వతముగా నీకు వశమవుతుంది . "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ పన్నెండవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment