Sunday 9 June 2019

రామాయణము యుద్ధకాండ -ఎనిమిదవసర్గ

                              రామాయణము 

                                యుద్ధకాండ -ఎనిమిదవసర్గ         

రాక్షస సేనానాయకుడైన ప్రహస్తుడు "దేవ, దానవ, యక్ష ,కిన్నెర, కింపురుష ,నాగుల వల్ల ఎవరివల్ల ఎదిరింప శక్యము కానీ నీవు రాజ్య పాలన చేయుచుండగా మనము సుఖముగా ఉంటిమి . అలా మనము ఆదమరపుగా ఉండగా ఆ వానరుడు వచ్చి లంకను నాశనము చేసినాడు . మనము జాగరూపులమై  వున్నచో ఎవడు మన వంక చూసే ధైర్యము కూడా చేయలేడు "అని రావణునితో పలికెను . 
అప్పుడు దుర్ముఖుడు అను రాక్షసుడు "రాజా !మన అనుమతి లేకుండా లంకా నగర ప్రవేశము ,అంతః పుర ప్రవేశము ,లంకా నగర దహనము ఇవి క్షమించరాని నేరములు . నేను ఒక్కడినే ఆ వానరుడు ఎక్కడ వున్నను ,వెతికి చంపెదను . అతడిని ఒక్కడినే కాదు ఒక్క వానరుడిని కూడా వదలక చంపెదను . "అని పలికెను . 
పిమ్మట మహాబలశాలి ఐన వజ్రద్రంష్టుడు అనే వాడు పరిఘనుచేతపట్టి "ప్రభూ !నాకు అనుమతి ఇచ్చినచో ,రామలక్ష్మణులను ,సుగ్రీవుడిని సమస్త వానరులను పరిమార్చెదను . "అని పలికెను . ఇలా ఆ సభలో వున్న ప్రముఖులైన రాక్షసులందరూ రావణుని ఎదుట ప్రగల్భములు పలికెను . 

రామాయణము యుద్ధకాండ ఎనిమిదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




No comments:

Post a Comment