Monday 3 June 2019

రామాయణము సుందరకాండ -అరువదిఆరవసర్గ

                                రామాయణము 

                              సుందరకాండ -అరువదిఆరవసర్గ 

హనుమంతుడు ఈ విధముగా పలికిన పిమ్మట శ్రీరాముడు చూడామణిని హృదయమునకు హత్తుకుని మిక్కిలి విలపించెను . అన్నగారిని చూసిన లక్ష్మణుడు కూడా విలపించెను . అప్పుడు శ్రీరాముడు సుగ్రీవునితో "సుగ్రీవా !ఈ చూడామణిని మా వివాహసమయములో మా మామగారు ఐన జనకమహారాజు సీతాదేవికి ఇచ్చెను . ఆమె దీనిని ధరించిన వెంటనే దీని అందము రెట్టింపు అయ్యెను . దీనిని చూసిన వెంటనే మా తండ్రి గారిని ,మా మామగారిని చూసినట్టు వున్నది . ఈ చూడామణిని జనకమహారాజుకి ఆయన చేయు యజ్ఞములకు సంతసించిన దేవేంద్రుడు ఇచ్చెను "అని పలికెను . 
పిమ్మట శ్రీరాముడు హనుమతో "హనుమా !సుందరాంగి ,సహజముగా భయపడు స్వభావము కలది అయిన సీతాదేవి ,ఆ రాక్షసుల మధ్య ఎలా ఉంటోందో ?ఎన్ని బాధలు అనుభవిస్తోందో ?హనుమా !నా సీత ఇంకా ఏమి చెప్పినదో నాకు వివరముగా చెప్పుము . ఇప్పుడు ఆమె మాటలే నా ప్రాణములను నిలుపుచున్నవి . అంత దుఃఖము పొందుచున్న సీతాదేవి ఎలా ఉండగలుగుతుంది ?"అని ప్రశ్నించెను . 

రామాయణము సుందరకాండ అరువదిఆరవసర్గ సమాప్తము . 

             శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment