రామాయణము
యుద్ధకాండ -రెండవసర్గ
శ్రీరామప్రభువు దీనంగా ఉండటం చూసిన సుగ్రీవుడు ,"ప్రభూ !మేమందరమూ మీతో వున్నాము . ఇంతమంది నీకు తోడుగా ఉండగా ఇలా దిగులుగా ఉండుట అనవసరం . పైపెచ్చు దీనంగా ఉండుటవలన కావలిసిన ఆలోచనలు రావు . కావున ఆ దీనత్వమును వదిలి ఆలోచన చేయుము . మనకు ఇప్పుడు సీతామాత జాడ తెలిసినది . శత్రువు జాడ అతడి బలాబలములు కూడా తెలిసినవి . మనవద్ద వున్న వీరులందరూ మహా పరాక్రమము కలవారు వారు తమ గోళ్ళతో ,రాళ్లతో ,వివిధ ఆయుధములతో శత్రువులను పరిమార్చగల సమర్థులు .
లంకకు వెళ్ళవలెనంటే సముద్రమునకు వారధి కట్టవలెను . సముద్రమునకు వారధి కట్టకుండా లంకా నగరమునకు చేరుట అసాధ్యము . కావున వారధి కట్టు ఉపాయమును ఆలోచించుము . "అని ధైర్యము చెప్పెను .
రామాయణము యుద్ధకాండ రెండవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment