రామాయణము
యుద్ధకాండ -పదకొండవసర్గ
రావణుని మంచి కోరి ,విభీషణుడు మంచి చెప్పినప్పటికీ ,రావణుడు వినిపించుకోలేదు . ఇప్పుడు యుద్ధము అనివార్యమని గ్రహించిన రావణుడు తక్షణ కర్తవ్యము ఆలోచించుటకు సభకు రధాన్ని అధిరోహించి ,సభా భవనమునకు వెళ్లి ప్రముఖులైన రాక్షసులకు సభకు రమ్మని కబురుపెట్టెను . రావణుడి కబురు అందుకున్న రాక్షస ప్రముఖులు వెనువెంటనే వారివారి రథాలను అధిరోహించి ,సభాభవనమునకు వెళ్లిరి . ముందుగా విభేషణుడు సభకు వచ్చి రావణుడి పాదాలకు నమస్కరించి ,తన ఆసనంపై కూర్చున్నాడు . మిగిలిన రాక్షసప్రముఖులు కూడా అదే విధముగా ముందుగా రావణుడి పాదములకు నమస్కరించి ,తమతమ ఆసనములపై కూర్చున్నారు .
No comments:
Post a Comment