రామాయణము
సుందరకాండ - అరువది ఎనిమిదవసర్గ
హనుమ ఇంకనూ ఇలా చెప్పసాగెను . సీతాదేవి "శ్రీరాముని వీలయినంత త్వరగా ఇక్కడకు వచ్చి నన్నుతీసుకువెళ్ళమని చెప్పు "అని చెప్పెను . ఇంకనూ ఆ సాధ్వి నన్ను అచటనే ఆ రాత్రి విశ్రమించి ఉదయమే వెళ్ళమని చెప్పెను . ఇంకనూ సీతామాతకు ఒక సందేహము కలిగెను అది ఏమనగా "ఓ హనుమా !నీవు బలశాలివి కావున వందయోజనములు దూరము వున్న సముద్రమును అవలీలగా దాటి వచ్చినావు . మరి రామలక్ష్మణులు ,మిగిలిన వానరులు సముద్రమును దాటుట ఎట్లు ?అని ఆ సాద్వి నన్ను ప్రశ్నించెను . అప్పుడు నేను "అమ్మా !సుగ్రీవ మహారాజువద్ద నా కంటే బలశాలురైన వానరవీరులు పెక్కుమంది కలరు . వారందరూ అవలీలగా సముద్రమును దాటగలిగినవారే . రామలక్ష్మణులను నా భుజముపై కూర్చోండపెట్టుకుని ఇక్కడకు తీసుకురాగలనని "ఆ మాతకు ధైర్యము చెప్పాను "అని హనుమ శ్రీరాముడితో చెప్పెను .
రామాయణము సుందరకాండ అరువది ఎనిమిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment