రామాయణము
అయోధ్యకాండ -నూటపదమూడవసర్గ
పిమ్మట భరతుడు అన్నగారి అనుజ్ఞను తీసుకుని "శత్రుంజయము "అను పేరుగల భద్రగజమున రాముని పాదుకలను ఉంచి అయోధ్యాముఖుడయ్యెను . భరతుని ముందు వశిష్ఠుడు ,వామదేవుడు ,జాబాలి మొదలగు పురోహితులు నడుచుచుండెను . వారు భారద్వాజముని ఆశ్రమము చెంతకు చేరిరి . భరతుడు భక్తిశ్రద్దలతో గుఱ్ఱము దిగి భారద్వాజుని దర్శించెను . భారద్వాజుడు అడుగగా భరతుడు జరిగిన వృత్తాన్తమును చెప్పెను . భారద్వాజుడు భరతుని సోదర ప్రేమను మెచ్చుకొనెను .
పిమ్మట వారు భారద్వాజముని వద్ద సెలవు తీసుకుని ప్రయాణము కొనసాగించిరి . శృంగిబేరి పురము దాటి అయోధ్య వైపుగా సాగి అయోధ్యకు చేరిరి . ఆ సమయమున అయోధ్యా నగరమున పాడుబడినట్లుగా ఉండెను .
రామాయణము అయోధ్యకాండ నూటపదమూడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం .ఏ (తెలుగు )తెలుగు పండితులు .
No comments:
Post a Comment