Thursday 23 March 2017

రామాయణము అయోధ్యకాండ -మూడవసర్గ

                                                      రామాయణము 

                                                         అయోధ్యకాండ -మూడవసర్గ 

లక్ష్మణుడు ఆ విధముగా రామునితో పలుకుతుండగా ఆ రాక్షసుడు భయంకర స్వరముతో మీరెవరు ఇచటకు ఎందుకు వచ్చారు ?అని ప్రశ్నించెను . అప్పుడు రామలక్ష్మణులు తమ వృత్తాంతమును తెలిపి "నీవెవరవు ?అని ప్రశ్నించెను "అప్పుడు ఆ రాక్షసుడు నా పేరు విరాధుడు . 'జయుడు 'అను రాక్షసుడి కుమారుడును . బ్రహ్మ వర ప్రభావం వలన ఏవిధమయిన శస్త్రములు ఏమియు నన్ను ఏమి చేయలేవు . మీరిరువురు ఈ సుందరాంగిని ఇక్కడే వదిలి వెళ్లిపోండి . ఈ నారీమణి నాకు దక్కిన కారణముగా మీ ప్రాణములు తీయుటలేదు . నా మనసు మారక ముందే పారిపోండి . మీ ప్రాణములు దక్కించుకొండి "అని పలికెను . 
ఆ పలుకులు విన్న రామునికి మిక్కిలి కోపము వచ్చెను . తన బాణములతో ఆ రాక్షసుడిని గాయపరిచేను . రక్తము కారుతుండగా ,సీతను వదిలి పెద్ద శూలము పట్టుకుని రామలక్ష్మణుల పైకి రాసాగేను . రాముడు బాణములతో ఆ శూలమును ముక్కలు చేసెను . రామలక్ష్మణులు తమ బాణములతో ఆ రాక్షసుడి శరీరమును గాయపరిచేను . అయినను రాక్షసుడు పట్టించుకొనక రామలక్ష్మణులను రెండు చేతులతో పట్టుకుని తీసుకుపోవతలిచి వారిరువురిని రెండు చేతులతో పట్టుకొనెను . వాడి అంతరార్ధము గ్రహించిన రాముడు "లక్ష్మణా !ఈ రాక్షసుడు మనులను ఎత్తుకుపోవనెంచాడు . ఎత్తుకుపోనిమ్ము . ఏలననగా మనము వెళ్ళవలసిన దారి కూడా ఈ వైపునే "అని పలికెను . 
అంత ఆ విరాధుడు రామలక్ష్మణులను మోసుకొని దట్టమైన అరణ్యము వైపుగా వడివడిగా  పోవసాగెను . 

రామాయణము అరణ్యకాండ మూడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment