Wednesday 15 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూట పదునైదవసర్గ

                                      రామాయణము 

                                        అయోధ్యకాండ -నూట పదునైదవసర్గ 

దృఢ నిశ్చయము కల భరతుడు తల్లులను అంతఃపురంలో వారివారి గృహములలో ఉంచి ,మంత్రులతో వశిష్టాది గురువులతో శ్రీరాముడు లేని ఈ అయోధ్యలో ఉండలేను . నంది నగరమున ఉండి శ్రీరాముడు కొరకు ఎదురుచూచుచు ఉండెదను . అని పలుకగా  భాతృప్రేమను మెచ్చుకొనిరి . భరతుడు  సిద్ధముచేయించుకుని  తల్లులకు చెప్పి శ్రీరాముని పాదుకలు శిరస్సున ధరించి మంత్రులు ,గురువులతో కలసి నంది గ్రామమునకు వెళ్లెను . 
అచట సింహాసనంపై పాదుకలను ఉంచి ,ఛత్రము పట్టి తానె స్వయముగా వింజామరతో ఆ పాదుకలకు విసరసాగెను . పిదప అచటకు వచ్చిన జనులు మంత్రులతో "పూజ్యులారా ! అన్నయగు శ్రీరాముడు  న్యాసముగా (భద్రముగా రక్షించి ,తిరిగి యజమానికి అప్పగించవలిసిన వస్తువుగా )నాకు ఈ రాజ్యమును అప్పగించినాడు . మఱియు ఈ పాదుకలు కూడా అనుగ్రహించెను . 


ఇవి ఈ రాజ్య ప్రజల యోగక్షేమముల భారమును వహించుచుండును . ఈ విషయమున నేను నిమ్మిత్తమాత్రుడను . రాముని బంటును . ఈ రాజ్యమును రక్షించుచు మా అన్న కొరకు వేచివుందును "అని పలికెను . 
భరతుడు జటావల్కలములు ధరించి  తింటూ నందీ గ్రామమునుండే రాజ్యపాలన విషయములు చూచుచుండెను . శత్రుఘ్నుడు అతనికి తోడుగా ఉండెను . రాజ్యపాలన విషయములు అన్నియు ఆ పాడుకులకు నివేదించుచు ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ నూటపదునైదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment