రామాయణము
అయోధ్యకాండ -నూటపదునాల్గవసర్గ
భరతుడు ఆ విధముగా అయోధ్యలో ప్రవేశించేసరికి రాత్రి అయినది . అయోధ్యానగరము అంతా నిశ్శబ్దముగా వున్నది . అలికిడి లేకున్నది . ఎప్పుడూ ఎంతో సుందరముగా అలంకరింపబడి వుండే అయోధ్యానగరము పాడుపడినట్లుగా వున్నది . అది చూసిన భరతుడు తన రాధా సారధి తో "చూడుము అయోధ్యా నగరము ఎలా కళావిహీనంగా నున్నదో . ఈ నగర గాలులలో ఎల్లప్పుడూ కర్పూర,సుగంధ ద్రవ్యముల వాసనలు గుభాళించుచు ఉండెడివి . కానీ ఇప్పుడు అవిలేవు . రేయి పగలు తేడా లేకుండా ఈ నగరము జనులతో అంగళ్ళతో కళకళలాడుచుండెడిది .
రాముని వనవాసము పిమ్మట మహారాజు మరణముతో ఈ నగరము శోకసముద్రములో మునిగి కళాకాంతులు లేక బోసిపోయి వున్నది . "అని పలుకుచుండగానే రాజభవనములోకి ప్రవేశించెను . అచట జనసంచారం లేకుండెను . ఆ అంతః పురమును చూచి భరతుడు ఏడ్చెను .
రామాయణము అయోధ్యకాండ నూటపదునాల్గవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment