రామాయణము
అయోధ్యకాండ -నూటపదునాఱవసర్గ
భరతుడు అయోధ్యకు మరలి వెళ్లిన పిమ్మట చాలాకాలము శ్రీరాముడు అచటనే ఉండెను . అప్పుడు కొంతకాలానికి ర్ మునుల ముఖములలో ఎదో ఆందోళన ,తన వలన ఎదో ఇబ్బంది పడుతున్నట్టు ,వారి ముఖావళికల బట్టి రాముడు గ్రహించెను . వారు ఎదో రహస్యముగా మాట్లాడుకొనుచున్నట్లు రామునికి అనిపించి మునులలో ఒక మునిని అడిగెను .
అప్పుడా ముని "ఖరుడు అను వాడు రావణుని తమ్ముడు అతడు మునులను బాధిస్తూ ఉంటాడు . అతడు నీవు ఇక్కడ ఉన్నావని తెలుసుకుని సహించలేక మునులను పెక్కు బాధలు పెడుతున్నాడు మునులను చంపుట ,వారి హోమాది కార్యములను ధ్వంసం చేయుట వంటి కార్యములను చేయుచు మమ్ము మిక్కిలి బాధించుచున్నాడు . కనుక మేమందరము ఇక్కడ నుండి వేరే ప్రాంతమునకు వెళ్లదలుచుకొంటిమి .
నీవు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపో !మాతో పాటు వస్తే రా ." అని పలికెను . ఆ మునులందరూ అచట నుండి వెళ్లిపోయెను. వారంతా వెళ్లిన పిమ్మట శ్రీరాముడు అచట వుండలేకపోయెను .
రామాయణము అయోధ్యకాండ నూటపదునాఱవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment