Thursday 9 March 2017

రామాయణము అయోధ్యకాండ -నూటతొమ్మిదవసర్గ

                               రామాయణము 

                                 అయోధ్యకాండ -నూటతొమ్మిదవసర్గ 

సత్య పరాక్రముడైన శ్రీరాముడు తనను మార్చుటకు జాబాలి పలికిన నాస్తిక మాటలను విని క్రుద్ధుడై "మహాత్మా !బ్రాహ్మణోత్తమా !మీరు నాస్తికుల వలె ఎందుకు ఇలా మాట్లాడుచున్నారు . పర లోకము వున్నది . మనము ఇక్కడ చేసిన పాపపుణ్యముల ఫలితమును తప్పక అనుభవించెదము . ఇహ లోక సుఖములు అశాశ్వతములు . నేను సత్యమునకు కట్టుబడినవాడను . తండ్రి మాటను సత్యము చేసేదని సత్య ప్రమాణము చేసి ఉంటిని . అట్టి నేను ఆ మాటను ఎలా జవదాటగలను . ?"అంటూ ఎన్నో ధర్మము పలికెను . 

అప్పుడు జాబాలి "రామా !నేను నాస్తికుడను కాను . ఆస్తికుడను . లోక కళ్యాణార్ధము నాస్తికుడుగా మారుటకు కూడా సన్నద్ధుడనే . రామా !నిన్ను ప్రసన్నునిగా చేసుకొనుటకు ,తిరిగి అయోధ్యకు మరల్చుటకు అటుల పలికితిని . కావున నన్ను క్షమింపుము "అని పలికెను . 

 రామాయణము అయోధ్యకాండ నూటతొమ్మిదవసర్గ సమాప్తము . 

             శశి ,

ఎం . ఏ (తెలుగు )తెలుగు పండితులు . 

No comments:

Post a Comment