Saturday 18 March 2017

రామాయణము అయోధ్యకాండ - నూటపదునేడవసర్గ

                                                రామాయణము 

                                                అయోధ్యకాండ - నూటపదునేడవసర్గ 

మునులందరూ అక్కడ నుండి వెళ్లిపోవటంతో రాముడికి అక్కడ వుండబుద్దికాలేదు . తల్లులు ,భరతుడు ,జనులు వచ్చిన ప్రదేశము కావడముతో వారు కూడా పదేపదే రామునికి గుర్తురాసాగిరి . అందువలన రాముడు సీతాలక్ష్మణులతో అక్కడనుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని ముందుకు సాగెను . 
వారు మువ్వురు అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరిరి . . అచట వారికి సాదరముగా స్వాగత సత్కారములు జరిగెను 


.పిమ్మట సీతాదేవిని అత్రిమహాముని భార్య అయిన అనసూయా దేవి లోపలి తీసుకువెళ్ళేను  . అనసూయా దేవి మహాపతివ్రత ,ఒకానొకసమయములో లోకములు కరువుకాటకములతో అల్లాడుతున్న సమయములో అనసూయాదేవి తన తపః ప్రభావంతో లోకములను రక్షించెను . ఆవిడ సీతా దేవికి పతివ్రతా ధర్మములను బోధించెను. 

రామాయణము అయోధ్యకాండ నూటపదునేడవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment