రామాయణము
అయోధ్యకాండ - నూటపదునేడవసర్గ
మునులందరూ అక్కడ నుండి వెళ్లిపోవటంతో రాముడికి అక్కడ వుండబుద్దికాలేదు . తల్లులు ,భరతుడు ,జనులు వచ్చిన ప్రదేశము కావడముతో వారు కూడా పదేపదే రామునికి గుర్తురాసాగిరి . అందువలన రాముడు సీతాలక్ష్మణులతో అక్కడనుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని ముందుకు సాగెను .
వారు మువ్వురు అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరిరి . . అచట వారికి సాదరముగా స్వాగత సత్కారములు జరిగెను
.పిమ్మట సీతాదేవిని అత్రిమహాముని భార్య అయిన అనసూయా దేవి లోపలి తీసుకువెళ్ళేను . అనసూయా దేవి మహాపతివ్రత ,ఒకానొకసమయములో లోకములు కరువుకాటకములతో అల్లాడుతున్న సమయములో అనసూయాదేవి తన తపః ప్రభావంతో లోకములను రక్షించెను . ఆవిడ సీతా దేవికి పతివ్రతా ధర్మములను బోధించెను.
రామాయణము అయోధ్యకాండ నూటపదునేడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment