రామాయణము
అరణ్యకాండ -నాల్గవసర్గ
రామలక్ష్మణులను ఎత్తుకుపోతున్న రాక్షసుడిని చూసి భీతిల్లిన సీతాదేవి భయముతో కేకలు పెట్టసాగెను . సీతాదేవి భయపడుట గమనించిన రామలక్ష్మణులు చెరొక చేతిని నరికివేసెను . అప్పుడు ఆ రాక్షసుడు నేలపై పడిపోయెను . రామలక్ష్మణులు వాడిని ముష్టిఘాతములతో ,కత్తులతో దాడి చేసి మిక్కిలి గాయపరిచేను . అయినను రాక్షసుడు చావకుండుట చూసి రాముడు లక్ష్మణుడితో "వీడి వరప్రభావము వలన చావకున్నాడు . కావున వేడిని భూమిలో పాతి వేద్దాము "అని పలికెను .
రాక్షసులను మరణించిన పిదప పాతిపెట్టుట ఆచారము . ఆ మాటలు విన్న విరాధుడు ." నేను తుంబురుడు అనే గంధర్వుడను . రంభ ప్రేమలో పడి కుభేరుడి సేవకు వేళకు వెళ్లకుండుటచే ఆయన నన్ను రాక్షసుడవు కమ్మని శపించాడు . నేను ప్రార్ధించగా రామలక్ష్మణుల వలన నీకు శాపవిముక్తి అవుతుందని చెప్పాడు . ఆ రామలక్ష్మణులు మీ రె అని నాకు తెలుస్తోంది "అని పలికెను . ఇంకనూ ఆ విరాధుడు
"ఇక్కడకు దగ్గరలోనే శరభంగమహర్షి ఆశ్రమము కలదు మీరు అచటికి వెళ్ళండి . మీకు శుభము కలుగుతుంది" అని పలికి తనను గోతిలో పాతిపెట్టమని చెప్పెను . రాముడు భయంకరముగా బాధతో అరుచుచున్న ఆ రాక్షసుడిని గోతిలో పాతిపెట్టెను . ఆ సమయములో విరాధుడు అరచిన అరుపులకు ఆ అరణ్యము ప్రతిధ్వనించింది . సీతారామలక్ష్మణులు తిరిగి తమ ప్రయాణమును కొనసాగించిరి .
రామాయణము అరణ్యకాండ నాల్గవసర్గ సమాప్తము .
శశి ,
ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment