Tuesday 21 March 2017

రామాయణము అరణ్యకాండ -మొదటిసర్గ

                                              రామాయణము 

                                                       అరణ్యకాండ -మొదటిసర్గ 

ఆ విధముగా సీతారామలక్ష్మణులు దండకారణ్యములో ప్రవేశించిరి . అచట కొంత దూరము నడవగా వారికి మునుల ఆశ్రమములు అగుపించినవి . వారు ఆ ఆశ్రమముల వద్దకు వెళ్లిరి . ఆ మునులందరూ సీతారామ లక్ష్మణులను సాదరముగా ఆహ్వానించి అతిథిమర్యాదలు చేసిరి . వారందరూ సీతారామలక్ష్మణులు రూపసౌందర్యములకు ఆశ్చర్యపడుతూ ,వారివంక తదేకంగా చూచుచుండిరి .  పిమ్మట ఆ మునులందరూ అచట లభించు ఫలములు ,దుంపలను వారికి సమర్పించిరి . 

ఆ మునులందరూ శ్రీరామునితో అచట గల రాక్షసుల బారి నుండీ రక్షించమని అర్ధించిరి . వారి ఆశ్రమములలో ఒక కుటీరమును  సీతారాములకై  ఇచ్చిరి . . ఆ మునులు తమ సేవలతో వారిని సంతుష్టులను చేసిరి . 

రామాయణము అరణ్యకాండ మొదటిసర్గసమాప్తము . 

                                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment