రామాయణము
అరణ్యకాండ -మొదటిసర్గ
ఆ విధముగా సీతారామలక్ష్మణులు దండకారణ్యములో ప్రవేశించిరి . అచట కొంత దూరము నడవగా వారికి మునుల ఆశ్రమములు అగుపించినవి . వారు ఆ ఆశ్రమముల వద్దకు వెళ్లిరి . ఆ మునులందరూ సీతారామ లక్ష్మణులను సాదరముగా ఆహ్వానించి అతిథిమర్యాదలు చేసిరి . వారందరూ సీతారామలక్ష్మణులు రూపసౌందర్యములకు ఆశ్చర్యపడుతూ ,వారివంక తదేకంగా చూచుచుండిరి . పిమ్మట ఆ మునులందరూ అచట లభించు ఫలములు ,దుంపలను వారికి సమర్పించిరి .
ఆ మునులందరూ శ్రీరామునితో అచట గల రాక్షసుల బారి నుండీ రక్షించమని అర్ధించిరి . వారి ఆశ్రమములలో ఒక కుటీరమును సీతారాములకై ఇచ్చిరి . . ఆ మునులు తమ సేవలతో వారిని సంతుష్టులను చేసిరి .
రామాయణము అరణ్యకాండ మొదటిసర్గసమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment