Sunday 26 March 2017

రామాయణము అరణ్యకాండ -ఆరవసర్గ

                                  రామాయణము 

                                         అరణ్యకాండ -ఆరవసర్గ 

 

శరభంగమహర్షి దివంగతుడైన పిమ్మట ధ్యానయోగసాధననిష్ఠ కలవారైన పెక్కుమంది మునులు శ్రీరాముని కడకు వచ్చిరి . వారందరూ ఆ అరణ్యములో పెక్కు ఏండ్లుగా తాపములాచరించువారు . వారందరూ ఆ అరణ్యములో ని రాక్షసుల క్రూర మృగముల బారి నుండి రక్షించమని శ్రీరాముని వేడుకొనిరి . అప్పుడు శ్రీరాముడు "మహర్షులారా !మీరు నన్ను అర్ధించుట తగదు . ఆజ్ఞాపించవలెను . మీ కష్టములు తొలగించుట కొరకే దైవవశమున తండ్రి ఆజ్ఞ నెపముతో నేను ఇచటికి వచ్చితినేమో . నా శాయశక్తులా మిమ్ము రక్షించెదను "అని పలికి సీతారామలక్ష్మణులు సుతీష్ణ మహర్షి ఆశ్రమదిక్కుగా సాగిరి .

రామాయణము అరణ్యకాండ ఆరవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .

No comments:

Post a Comment